Wednesday, July 23, 2014

పీడితులకు పోరాటమే మార్గం By కొంకల వెంకటనారాయణ


Updated : 7/24/2014 3:24:51 AM
Views : 20
1998 జూలై16న వేంపెంట నరమేధం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని పౌరప్రజాస్వామిక,విప్లవ సంస్థల వైఖరుల బండరాన్ని బయట పెడుతూ కారంచేడు నుంచి వేంపెంట దాకా దళితులపై దాడులు ఎందు కు జరుగుతున్నాయి? ఏం చేయాలి? అని అమరుడు మారోజు వీరన్న స్థాపించిన దళిత బహుజన మహాసభ రికార్డు చేసింది. ఆ కొనసాగింపుగానే కులవర్గ జమిలి పోరాట అవగహానలోనే 2012లో లక్షింపేట దళితుల హత్యాకాండపై పౌర, ప్రజాస్వామిక, విప్లవ సంస్థల, దళిత, బీసీ కుల సంస్థల వైఖరుల్ని వివిధ తెలుగు దిన, వార, మాస పత్రికల్లో జరిగిన చర్చవిశ్లేషణల్ని ఒక చోట చేర్చి విలువైన డాక్యుమెంట్ రూపంలో జాబాలి ప్రచురణల పేర కొంకల వెంకటనారాయణ, పాపని నాగరాజు, కమ్మరి రేణుక తీసుకురావడం జరిగింది.

గతంలో దళిత రణన్నినాదం సంకలన వేసిన ఉ.సా అయినా, నేడు దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం పేరు తో కారంచేడు, చుండూరు, నీరుకొం డ, తిమ్మసముద్రం, వేంపెంట, ప్యాపి లి, లక్షింపేట, కంబాలపల్లి (కర్నాటక రాష్ర్టం), ఖైర్లాంజీ (మహారాష్ర్ట రాష్ర్టం) సంఘటనలపై వివిధ విప్లవ, ప్రజాస్వామిక సంస్థలు జరిపిన సైద్ధాంతిక చర్చను ఒకచోట చేర్చిన నాగరాజులు బీసీలు కావడం యాదృచ్ఛికం. కానీ ఇండియా సమాజాన్ని కులవర్గ సమాజమని, ఈ సమాజాన్ని కుల-వర్గ జమిలి పోరాటాల ద్వారానే నిర్మూలించే వీలు ఉంటుదని నమ్మిన వ్యక్తులుగా కొనసాగుతున్నారన్నది చారిత్రక సత్యం.

వీరన్న రూపొందించి నిర్మించిన కులవర్గ జమిలి పోరాట కార్యక్రమాన్ని మోసుకువెళ్లే కార్యకర్తగా, ఆపార్టీ విద్యార్ధి విభాగామైన బిడియస్‌ఎఫ్‌కు రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పాపని నాగరాజు వెలుగులోనే కారంచేడు నుండి లక్షింపేట వరకు జరిగిన సంఘటనలను సంకలనంగా ముద్రించే బాధ్యతను స్వీకరించాడు. ఇది భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా అరికట్టాలో అన్వేషించే క్రమంలో అధ్యయనంచేసి ముందుకు పోవడానికి కార్యకర్తలకు, ప్రజాసంస్థకు తొడ్పడుతుందీ దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం. ఈ గ్రంథం ఆ కర్తవ్య నిర్వహణనకు తోడ్పడుతుందని భావించే నాగరాజు ఈ ముద్రణను పూనుకున్నాడు. 

నేడు కొన్ని సంఘటనలు సాకుగా చేసుకొని దళితులను బీసీలను శత్రువులుగా చిత్రించి మిత్రవైరుధ్యాలను శత్రు పూరిత వైరుద్యాలుగా సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుచేతనే బ్రాహ్మణీయ అగ్రకుల అకృత్యాలు దళితులపై ఎన్ని జరిగిన ఆపలేకపోతున్నాం. కనక ఈ వాస్తవాన్ని గుర్తించి కులవర్గ జమిలిపోరాటాల ద్వారానే దళితుల, పీడితకుల ప్రజల విముక్తి ఉంటుందనే విశ్వసించి ప్రయాణిద్దాం. 

No comments:

Post a Comment