Monday, July 9, 2012

అబూజ్‌మాడ్‌లో ఏం జరుగుతోంది?----డి మార్కండేయ


పెరివూబల్ మలేరియాతో తెహెల్కా ఫొటోక్షిగాఫర్ తరుణ్ శెహ్రావత్ మరణించడంతో అబూజ్‌మాడ్ ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. మహిళా జర్నలిస్టు తుషా మిట్టల్‌తో కలిసి గత ఏప్రిల్‌లో శెహ్రావత్ మాడ్ కొండల పైకి వెళ్లారు. వారం రోజుల పాటు తిరిగి అక్కడ జరుగుతున్నదేమిటో తెలుసుకుని బయటకు వచ్చారు. మాడ్ వాసుల జీవన పరిస్థితులు, మావోయిస్టుల నేతృత్వంలో ఏర్పడిన జనతన సర్కార్లు, వారికి పోలీ సు బలగాలకు మధ్య జరుగుతున్న యుద్ధం, తదితర అంశాలకు సంబంధించిన విలువైన సమాచారం మోసుకువచ్చారు. అయితే, శతాబ్దాలుగా మాడ్ గోండులను పట్టిపీడిస్తున్న మలేరియా మహమ్మారి వారిని వెన్నంటి వచ్చింది. ఇద్దరూ మంచం పట్టారు. ఆధునిక వైద్యం శెహ్రావత్‌ను కాపాడలేకపోయింది. మే 15న ఆ కెమెరా యోధుడు అంతిమశ్వాస విడిచాడు. కాగా, తుషా మిట్టల్ ఆస్పత్రి బెడ్‌పై మృత్యువుతో పోరాటం సాగిస్తున్నది. అబూజ్‌మాడ్‌లో జరుగుతున్నదేమిటో, అక్కడి ప్రజల కష్టాలేమిటో లోకానికి తెలియజెప్పిన ఈ ఇద్దరు జర్నలిస్టుల సాహసాన్ని పత్రికా ప్రపంచం కొనియాడింది. మావోయిస్టు పార్టీ సైతం వీరిని ఆదివాసుల మిత్రులుగా పేర్కొంటూ శెహ్రావత్ కుటుంబానికి సంతాపం తెలిపింది. తుషా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

ఒకప్పుడు దుర్భేద్యమైన, సర్వే జరగని ప్రాంతంగా వినుతికెక్కిన అబూజ్‌మాడ్‌కు ఇటీవలికాలంలో సందర్శకులు పెరిగారు. 2009 ఆగస్టు నుంచి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్‌హంట్ పేరిట వేలాది పోలీసు, పారా మిలిటరీ బలగాలను మోహరించి మావోయిస్ట్లులపై అప్రకటిత యుద్ధాన్ని ఆరంభించిన నేపథ్యంలో అందరి దృష్టి బస్తర్‌పై పడింది. మనుగడ కోసం ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరన్నట్లు పరస్పరం భారీ దాడులకు పూనుకుంటుండడం, ప్రాణనష్టాలు పెరగడంతో మీడియా కూడా ఈ ప్రాంత పరిణామాలపై కేంద్రీకరించింది. మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం అధికంగా ఉన్న దంతేవాడ, బీజాపూర్, నారాయణ్‌పూర్ జిల్లాలకు జర్నలిస్టుల రాకపోకలు పెరిగా యి. ఈ సందర్భంగా మావోయిస్టులకు తిరుగులేని కోటగా, ప్రధాన స్థావరంగా ఉన్న అబూజ్‌మాడ్ సహజంగానే అందరినీ ఆకర్షించింది. గౌతం నవలఖా, రాహుల్ పండిత, సత్నామ్‌సింగ్ మొదలు తెహెల్కా బృందం వరకు ఎందరో జర్నలిస్టులు అబూజ్‌మాడ్ ను సందర్శించారు. ఎన్నో ఆసక్తికరమైన కథనాలను అందించారు.

అబూజ్‌మాడ్ చరిత్ర ఏమిటి? అబూజ్‌మాడియాల జీవన విధానం ఎలా ఉంటుంది? సంస్కృతీ సంప్రదాయాల మాటేమిటి? మావోయిస్టులు అక్కడ పాగా ఎలా వేయగలిగారు? ప్రభుత్వ బలగాలు అక్కడికి ఎందుకు చేరుకోలేకపోతున్నాయి? పన్నెండేళ్ల కిందట కొత్తగా ఏర్పడిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బస్తర్ అతిముఖ్యమైనది. పూర్తిగా ఆదివాసులు నివసించే ప్రాంతం. అడవులు, నదులు, ఖనిజవనరులు దండిగా ఉన్న ప్రాంతం. ఒకప్పుడు ఒకే జిల్లాగా ఉన్న బస్తర్‌ను ఇప్పుడు ఏడు జిల్లాలుగా విభజించారు. ఈ ఏడు జిల్లాల్లో ఒకటైన నారాయణపూర్‌తో పాటు మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా భామ్రాగడ్ తాలూకాలో అబూజ్‌మాడ్ కొండలు విస్తరించివున్నాయి. ఉత్తరం నుంచి దక్షిణానికి 80 కి.మీ. లు, పడమటి నుంచి తూర్పునకు 50 కి.మీ.ల మేర వ్యాపించిన మాడ్ ప్రాంతం విస్తీర్ణం 4వేల చదరపు కిలోమీటర్లు. ఇక్కడున్న చిన్నా పెద్ద పల్లెలు 237 కాగా, జనాభా సుమారు 35వేలు. ఒకే ఒక ఇల్లున్న జనావా సం కూడా ఇక్కడ గ్రామం కిందికే వస్తుంది. వంద ఇండ్లుంటే అది పెద్ద గ్రామం.

ఇక్కడ నివసించే ఆదిమ తెగ పేరు మాడియా గోండు లు. వీరి జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు విభిన్నమైనవి. వైవిధ్యంతో కూడుకున్నవి. ప్రకృతితో విడదీయరాని సంబంధం కలిగినట్టివి. పోడు వ్యవసాయం, జంతువుల, చేపల వేట, ఆకులు అలములు, పండ్లు ఫలాల సేకరణ వీరి ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు. మొన్నమొన్నటి వరకూ వీళ్లు కేవలం ఉప్పు, బాణాలకు వాడే ఇనుపభాగాలు, పంచెల కోసం మాత్రమే గుట్టలు దిగి నారాయణపూర్ అంగడికి వెళ్లేవారు. ఇక వీరి (పోడు)వ్యవసాయం విచివూతంగా సాగుతుంది. కొండవాలు ను ఎంచుకుని అక్కడున్న చెట్లను నరికి తగులబెట్టి వానలు పడగానే కొహ్‌లా అనే ధాన్య పు గింజలను చల్లుతారు. అటుపైన ఎలాంటి మానవక్షిశమ లేకుండానే చేతికి వచ్చిన పంట ను దంచి అన్నంలా వండుకుంటారు. నాగలి దున్నడం వీరికి తెలియదు. బియ్యపన్నంతో పోల్చితే సగం కూడా పోషకవిలువలు లేని కొహ్‌లాను గట్కలా వండుకుంటారు.

కూరగా పచ్చి లేదా ఎండిన మాంసం, చేపలు, అడవిలో విస్తృతంగా దొరికే బొప్పాయి, గోంగూర, ఇతర ఆకుకూరలను ఉపయోగిస్తారు. నూనె వాడకం చాలా తక్కువ. నివాసాలు ఎత్తైన ప్రదేశంలో ఉంటాయి. ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ సమీపంలోనే అన్ని కాలాల్లో ప్రవహించే చిన్నచిన్న సెలయేళ్లు ఉంటాయి. అడవిలో దొరికే వెదురుబొంగులు,కలప, నదీతీరంలో పెరిగే ఒకరకం గడ్డితో ఇళ్లు నిర్మించుకుంటారు. ఇళ్లు సాధారణంగా చిన్నవిగా ఉండి ఒక జంట నివసించడానికి అనువుగా ఉంటాయి. పెళ్లయిన ప్రతి జంటకూ ఓ ఇంటిని నిర్మించి ఇవ్వడం అక్కడ ఆనవాయితీ.

పెళ్లికాని యువతీయువకులు నిద్రించడానికి ఉద్దేశించిన గోటుల్ ఈ తెగలోని మరో ప్రత్యేకత. ప్రతి పల్లెలోనూ గోటుల్ ఉంటుంది. పాలు మరిచిన పిల్లల నుంచి యుక్తవయస్సు అమ్మాయిలు, అబ్బాయిల వరకు గోటుల్‌లో సభ్యులుగా ఉంటారు. సీనియర్ సభ్యుడొకరు గోటుల్ పెద్దగా ఉంటూ ఇక్కడ జరిగే కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటాడు. పగలంతా తల్లిదంవూడులతో పాటు రకరకాల పనులు చేసే పిల్లలు సాయంత్రం కాగానే గోటుల్ వద్దకు చేరతారు. ఆటపాటల్లో నిమగ్నమవుతారు. గానాబజానా, డ్యాన్సులు మొదలవుతాయి. చివరకు అలసిపోయి ఏ రాత్రికో నిద్రిస్తారు. ఈ ఆటపాటల క్రమంలో యువతీ యువకుల మధ్య ప్రేమ ఏర్పడడం, సన్నిహితం కావడం సహజంగానే జరుగుతుంది. అలా పరస్పరం ఇష్టపడినవారి మధ్య లైంగిక సంబంధాలు వీరి సమాజంలో తప్పు కాదు. ఇలాంటి జంటలు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతాయి.

పెళ్లయిన మరుక్షణం వీరు గోటుల్ సభ్యత్వం కోల్పోతారు. మాడ్ గుట్టల కింద మైదాన అటవీవూపాంతాల్లో నివసించే మాడియాల్లో కూడా గోటుల్ ఆచారం ఉన్నా రాత్రిపూట ఆటపాటల తర్వాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లి నిద్రించడంగా పరిణామం చెందింది. వస్త్రధారణ విషయానికి వస్తే, మావోయిస్టులు ప్రవేశించేవరకూ ఇక్కడి స్త్రీలు పంచె లాంటి వస్త్రాన్ని నడుముకు చుట్టుకునేవారు. ఛాతీపైన ఎలాంటి ఆచ్ఛాదనా ఉండేది కాదు. ప్రస్తు తం పెళ్లికాని అమ్మాయిలు బ్లౌజులు ధరిస్తున్నారు. పురుషులు బుడ్డగోచీ పెట్టుకుంటారు. వెనుకబడిన ఆర్థిక విధానం, పురాతన సంస్కృతితో పాటు కనీస సౌకర్యాలు లేని లోటు కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆస్పవూతులు, రోడ్లు,కరెంటు,పాఠశాలలు లేవు. అన్నింటికంటే ముఖ్యంగా మార్కెట్ లేదు. దోపిడీ లేదు. ప్రపంచీకరణ వాసనలు లేవు. దోపిడీ దారులు లేరు. కారల్ మార్క్స్ చెప్పిన ఆదిమ కమ్యూనిస్టు సమాజం తరహాలో జీవించేవారు.

1947 తర్వాత అబూజ్‌మాడ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత ప్రభుత్వ ప్రతినిధులుగా అటవీ, పోలీసు సిబ్బంది ఇక్కడి పల్లెల్లోకి రావడం ప్రారంభమైంది. తుపాకులతో వచ్చి, ఆదివాసులు సేకరించుకున్న ఇప్పపువ్వు తదితర అటవీ ఉత్పత్తుల ను,కోళ్లను ఎత్తుకెళ్లడం జరిగేది. 1970లలో అబూజ్‌మాడ్ గుట్టల అంచున ఉత్తరాన దల్లీ-రాజ్హరా ప్రాంతంలో ఇనుప గనుల తవ్వకం మొదలైంది. 80లలో కుతుల్ లాంటి చోట్ల రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆశ్రమపా స్థాపించారు. సోన్‌పూర్, ఛోటాఢోంగర్ వంటి పెద్దక్షిగామాలకు మట్టిరోడ్లను నిర్మించారు. ఈ క్రమంలో 1985లో మాడ్ కొండల పైకి మొదటిసారిగా మావోయిస్టులు అడుగుపెట్టారు. అప్పటినుంచి పీపుల్స్‌వార్ పేరు తో ఉన్న ఆ పార్టీ నాయకత్వంలో గడ్‌చిరోలిలోనూ,బస్తర్‌లోనూ బలమైన విప్లవోద్యమం కొనసాగుతోంది. ప్రజాసంఘాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ నిర్మాణాలే గెరిల్లా దళాలుగా అభివృద్ధిచెందాయి. మనుగడ కోసం ప్రకృతితో పోరాడుతున్న అబూజ్‌మాడియాలకు అండగా నిలి చి వారిని వేధిస్తున్న అటవీ సిబ్బందిని తరిమికొట్టాయి. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయ డం ఎలాగో చూపాయి. కూరగాయలు పండించడం నేర్పాయి. గోటుల్ వ్యవస్థలో మహిళకు జరుగుతున్న ఆన్యాయాన్ని అర్థం చేయించాయి. బ్లౌజులు ధరించడాన్ని కేంపెయిన్‌గా కొనసాగించి మహిళల గౌరవాన్ని నిలబెట్టాయి. వారి ఆటల్లో ఆటగా, పాటల్లో పాటగా నిలు స్తూ అభిమానాన్ని చూరగొన్నాయి.

ఈ ఆత్మీయతలే ప్రాతిపదికగా ఇక్కడ మావోయిస్టులు బలపడ్డారు. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలతో స్థానికుల అండ లేకుండా అపరిచితుపూవ్వరూ ప్రవేశించ వీలుగాని ఈ ప్రాంతాన్ని సైనిక శిక్షణకు, విశ్రాంతికి, బలగాల సమీకరణకు, నాయకత్వం తలదాచుకోవడానికి మావో యిస్టులు విస్తృతంగా ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని 1995 నాటికి గాని పోలీసులు పసిగట్టలేదు. ఆ వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అబూజ్‌మాడ్‌పై దృష్టి కేంద్రీకరించాయి. అభివృద్ధి పథకాలు, వ్యవసాయ శిక్షణ పేరుతో, హోంగార్డు ఉద్యోగాల ఎరతో కొంతమంది స్థానిక యువకులను ఇన్ఫార్లర్లుగా మార్చుకోవడానికి ప్రయత్నించాయి. అప్పుడప్పుడు గుట్టల అంచుల్లో ఉన్న గ్రామాలకు పోలీసులు వెళ్లి దాడులు చేయడం, గిరిజనులను నిర్బంధించడం, దళాల గురించి తెలుసుకుని కాల్పులకు దిగడం చేశాయి.

1996లో వేయి మంది బలగాలకు నాయకత్వం వహించిన అప్పటి బస్తర్ ఎస్‌పీ 15రోజుల పాటు ఆపరేషన్ నిర్వహించి మొట్టమొదటిసారిగా మాడ్ లోతట్టుకు ప్రవేశించిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కాగా, శత్రు ఎత్తుగడల్లో మార్పును గమనించిన మావోయిస్టులు తర్వాతికాలంలో తమ ఎత్తుగడలనూ మార్చుకున్నారు. అప్పటిదాకా షెల్టర్ జోన్‌గా ఉన్న మాడ్‌ను సంఘటితం చేశారు. గ్రామక్షిగామాన పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణంపై కేంద్రీకరించారు. రాజ్యాధికార అంగాలైన జనతన సర్కార్లను ఏర్పరచారు. స్థానిక యువతీయువకులను పెద్దయెత్తున దళాల్లో చేర్చుకున్నారు. పీఎల్‌జీఏ దళాలను ప్లాటూన్లుగా, కంపెనీలుగా ఏర్పాటు చేసి అడవిలోకి చొచ్చుకురావడానికి యత్నించిన పోలీసుబలగాలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తూ వచ్చారు. ఇలా 2008 నాటికి అబూజ్‌మాడ్‌ను శవూతువు ప్రవేశించ వీలుగాని గెరిల్లా స్థావరంగా అభివృద్ధి చేశారు.
-డి మార్కండేయ
dmknamaste@gmail.com
(అబూజ్‌మాడియాలకు ముప్పు గురువారం సంచికలో).
Namasete Telangana News Paper Dated : 10/07/2012 

No comments:

Post a Comment