Thursday, January 3, 2013

నిరంకుశ స్థాపన వద్దు --జగన్ ఎన్‌టీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి(సీపీఐ మావోయిస్టు)



డిల్లీలో జరిగిన అమానత్ సామూహిక అత్యాచార ఘటన. ఇది దేశాన్ని కుదిపేసింది. ఘటన జరిగిన తీరు మానవీయత ఉన్న మనుషులనందరినీ కదిలించింది. దేశవ్యాప్తంగా ప్రజలు విద్యార్థి యువకులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు.అమానత్‌పై నిందితులు ప్రవర్తించిన తీరు ఫలితంగా అమానత్ ఘటనతో ఆగ్రహజ్వాలలైన యువత నిందితులను ఉరితీయాలనేది మొదలు నపుంసకులుగా చేయాలనీ, బహిరంగంగా ఉరితీయాలనీ, బహిరంగ ప్రదేశంలో రాళ్లతో కొట్టి చంపాలని(అరబ్‌దేశాల్లో అమలు చేస్తున్న మధ్యయుగాల నాటి శిక్షల తీరు గా)రకరకాలుగా డిమాండ్ చేస్తున్నారు. అతి కిరాతకంగా నిండు ప్రాణాన్ని బలిగొన్న వారికి ఎలాంటి శిక్ష వేయాల్నో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇదే అదనుగా కాంగ్రెస్ పార్టీ కూడా సత్వర, శిక్షలు అమలు చేయడానికి సంబంధించి న బిల్లు రూపకల్పనలో తలమునకలై ఉన్నటు ్లవార్తలు వస్తున్నాయి. అలాగే ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలోని కమిటీకి శిక్షలకు సంబంధించిన సూచనలు పౌరుల నుంచి కోరుతున్నది. ఇప్పటికే అమలులో ఉన్న అత్యాచార చట్టాల కోరలకు పదునుపెట్టి సత్వరమే చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నది. 

ఇక్కడ అసలు విషయాన్ని పక్కదారి పట్టించే కుట్ర ఒకటి పకడ్బందీగా జరుగుతున్నది. లైంగికహింసకు సంబంధించిన మౌలిక కారణాన్ని పట్టించుకోకుండా నేరానికి మనిషిని మాత్రమే బాధ్యున్ని చేసే ప్రయత్నమొకటి జరుగుతున్నది. ఎక్కడైనా, ఒక వ్యక్తి నేరాని పాల్పడితే దానికి అతనున్న సామాజిక పరిస్థితుల ప్రభావమే ప్రధాన కారణమవుతుందని సామాజిక శాస్త్రాలు చెబుతున్నాయి.ఈ నిజాన్ని దాచి పెట్టే కుట్ర పాలకులు ప్రయత్న పూర్వకంగా దాచి పెడుతున్నారు. అమానత్ విషయంలో ప్రజల్లో రగిలిన ఆగ్రహావేశాలను సాకుగా తీసుకుని ప్రభుత్వం నిర్బంధ కోరలకు మరింత పదు నుపె ఉపయోగించుకోవాలనుకుంటున్నది. అంతేగాకుండా ప్రజల ప్రాణాలను తీసే హక్కును రాజ్యం తన చేతుల్లోకి తీసుకునే కుట్రను అమలు చేస్తున్నది.ఇప్పటికే ప్రజలను చంపే అధికారాన్ని చేతిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రజల మాన, ప్రాణాలను తోడేస్తున్న రాజ్యం, ఢిల్లీ ఘటన సాకుగా తీసుకుని మరింత నగ్నంగా ప్రజలను బలిగొనేందుకు సమాయత్తమవుతున్నది. మధ్య యుగాల నాటి చీకటి కాలానికి దేశాన్ని వెనక్కి తీసుకపోయే ప్రయత్నం జరుగు తున్నది.

ఈ సందర్భంగా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు అమానత్ పైన జరిగిన ఘటన పట్ల తీవ్రంగా స్పందించాలని కోరుతూనే రాజ్య స్వభావాన్ని, కుట్రలను పసిగట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా విధ్వం సక అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా నిర్వాసితులవుతున్న ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ ప్రజలు పోరాడుతున్నప్పుడు రాజ్యం వారిపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. వేలాది మందిని జైళ్లో నిర్బంధిస్తున్నది. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, ఎదిరిస్తున్న ప్రజలపై, ముఖ్యంగా స్త్రీలపై రాజ్యం అత్యాచారాలనే ఆయుధంగా ఎంచుకున్నది. కశ్మీర్, ఈశా న్య రాష్ట్రాలు, మధ్య భారతంలోని దండకారణ్యంలో ప్రజల మాన ప్రాణాలను భద్రతా బలగాలు ఇప్పటికే తోడేస్తున్నాయి. ఎంతో మందిని మాయం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సోనిసోరి ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విష యం తెలిసిందే. మావోయిస్టులకు సహకరిస్తుందన్న సాకుతో సోనిసోరిని ఎంత రాక్షసంగా పోలీసులు చిత్రహింసల పాలు చేశారో చూశాము. సోరీ ఇంకా జైలులోనే న్యాయం కోసం పోరాడుతున్నది.

అసాధారణమైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్ష వేయాలన్నది ఓ నియమమున్నా.. దానిని సాధారణం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ది. ఇప్పటి దాకా సమాజంలోని పేదలు, వెనుకబడిన బడుగువర్గాల ప్రజలు, మైనారిటీలు మాత్రమే ఉరికంబాపూక్కారు. అలాగే దేశంలో జరుగుతున్న అత్యాచార కేసుల్లో 25 శాతానికి మించి శిక్షలు పడటం లేదు. చట్టంలోని లొసుగులను ఉన్నత వర్గాలు రక్షణకు అనువుగా వాడుకుంటున్న తీరును చూస్తున్నాం. 

కాబట్టి అత్యాచార ఘటనల్లో నిందితులను కఠినంగా శిక్షించే మాటు న సమాజాన్ని అమానవీయం చేసే విధానాన్ని వ్యతిరేకించాలి. నేరాల విషయంలో సామాజిక బాధ్యతను మరుగు పరిచే చర్యలను వ్యతిరేకించాలి. వ్యక్తి నిర్మూలనతో నేరం అంతం కాదు, నేరానికి మూలం సమాజంలో ఉంటుంది. మధ్యయుగాల నాటి అమానవీయ ఉరిశిక్ష రద్దు చేయాలి.మహిళను లైంగిక వస్తువుగా చూసే దృక్పథం మారనంత వరకు ఈ అత్యాచారాలకు అంతం వుండదు. ఒకవైపు పాలకులు మహిళ సాధికరత, మహిళా స్వాతంత్య్రం అంటూ ఆకర్షణీయ మైన మాటలను వల్లి స్తున్నారు. మరోవైపు మహిళల పట్ల సమాజ దృక్ప థం కించిత్తు కూడా మారడం లేదు. కేవలం కల్లబొల్లి మాటలతో, ప్రచార్భాటాలతో మహిళ ల సమస్యలు పరిష్కారం కావు. మహిళల సమస్యల పరిష్కారానికి సమాజంలో మౌలిక మార్పులు జరగాలి. మహిళల మీద అమలవుతున్న సమస్త పీడనలకు మూలాలు దోపిడీ సమాజంలోనే వున్నాయి. కనుక తమ మీద జరుగుతున్న సమస్త పీడనలను తొలగించుకోవడానికి మహిళలు దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సగభా గం కావాలి. అప్పుడే నిజమైన సాధికారత, స్వతంవూతలను పొందగలరు.
-జగన్
ఎన్‌టీఎస్‌జెడ్‌సీ అధికార ప్రతినిధి(సీపీఐ మావోయిస్టు)

Namasete Telangana Telugu News Paper Dated: 3/1/2013

No comments:

Post a Comment