Monday, September 23, 2013

పతనమవుతున్న విశ్వవిద్యాలయాలు By -శ్రీధర్ మోతె


ఈమధ్యన ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాల నైపుణ్యాలు, విలువల స్థాయిని వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ (ఏఆర్‌డబ్ల్యూయూ)విడుదల చేసింది. అనేక అధ్యయనాలు, పరిశీలనల అనంతరం 2013 కు గాను 500 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను తయారు చేసింది. వీటిలో అమెరికన్ యూనివర్సిటీలే అగ్రగామిగా అత్యుత్తమ 182 స్థానాలను ఆక్రమించాయి. ఆ తర్వాత యూరోపియన్ యూనివర్సిటీలు తరువాతి 200 స్థానాలను దక్కించుకున్నాయి. వీటిలో 17 చైనా విశ్వవిద్యాలయాలున్నాయి. ప్రపంచంలో 20 అగ్రగామి అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో 17 అమెరికా యూనివర్సిటీలే ఉన్నాయి. ప్రపంచంలో అన్నింటికన్నా అత్యుత్తమ ప్రథమ శ్రేణి యూనివర్సిటీగా హార్వార్డ్ విశ్వవిద్యాల యం 100 పాయింట్లు దక్కించుకున్నది. ఈ జాబితాలో భారతదేశంలోని ఒక బెంగుళూరు ఐఐఎస్‌సీ మాత్రమే 300 స్థానంలో నిలిచి చోటు దక్కించుకున్నది.

ఆయా యూనివర్సిటీల నుంచి వెలుగులోకి వస్తున్న ప్రపంచ మేధావులు, వారు పొందుతున్న మెడల్స్, గౌరవం, పరిశోధనలు, ప్రఖ్యాతిగాంచిన పత్రికల్లో వారు రాసిన వ్యాసాల ప్రచురణల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు ఇచ్చారు. అలాగే ఆయా యూనివర్సిటీల్లో వనరులు, వసతులు,అర్హత గల బోధనా సిబ్బంది , అర్హతలు, నైపుణ్యాలను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. అలాగే బ్రిటన్‌కు చెందిన ‘క్యూఎస్’ ఏజెన్సీ కూడా ప్రపంచలోని 300 అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాను తయారు చేసింది.వీటిలో ఢిల్లీ ఐఐటీ 212స్థానం దక్కించుకున్నది. మిగతా ఐఐటీలన్నీ తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఆసియా ఖండంలోని 50 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మన ఐఐటీలు 40వ స్థానంలో నిలిచాయి. ఈ క్రమంలో ఈ అధ్యయన సంస్థలకు అనేక విమర్శలు, చర్చల అనంతరం మాత్రమే మన యూనివర్సిటీలు తమ సమాచారాన్ని అందజేశాయి. వసతులు, నాణ్యతల విషయంలో గోప్యతను ప్రదర్శిస్తున్న విధానంపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈ అధ్యయన ఏజెన్సీలకు సహకరించాయి. కావల సిన సమాచారాన్ని అందజేశాయి. అయితే ఈ అధ్యయన సంస్థలు ప్రపంచంలో అత్యుత్తమ యూనివర్సిటీలను నిర్ణయించడానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు, పరిశోధన తదితర అంశాలు కూడా సరియైన ప్రాతిపదికనలేవనే విమర్శలున్నాయి. 

భారతదేశంలో 700 విశ్వవిద్యాలయాల్లో దాదా పు 35వేల కాలేజీలున్నాయి. ఇదే సందర్భంలో మనం ప్రపంచంలోనే అత్యధిక మానవ వనరులున్న దేశంగా గొప్పలు చెప్పుకుంటాము. కానీ పరిశోధనా పత్రాలు సమర్పించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే మనం జపాన్, చైనా కంటే వెనకబడి ఉన్నాం. ప్రచురణల విషయంలో కూడా మిగతా యూనివర్సిటీలకన్నా చాలా వెనుకబడి ఉన్నాం. ఒక్క కాలిఫొర్నియా యూనివర్సిటీ నుంచే 120 మం ది ప్రపంచ స్థాయి మేధావులు తయారయ్యారు. ఇందులో ఒక్కరు కూడా భారతీయులు లేకపోవడం గమనార్హం. 

ఇక ఆంధ్రవూపదేశ్ విషయానికి వస్తే.. మన రాష్ట్రం లో ప్రతియేటా 250 ఇంజనీరింగ్ కాలేజీలు సుమారుగా రెండు లక్షల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్ప త్తి చేస్తున్నాయి.ఇలా తామర తంపరగా బయటికి వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థుల్లో కనీస స్థాయి పరిజ్ఞానం కూదా ఉండటం లేదన్న విమర్శలు వెల్లు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల కోసం ఆయా కాలేజీలను సందర్శించిన పలు కంపెనీలు విద్యార్థుల్లో 20, 25 శాతం మందిలో మాత్రమే కనీస పరిజ్ఙానం ఉందని విమర్శిస్తున్నాయి. వీరికి ఉద్యోగానికి కావలసిన పరిజ్ఞానం, నైపుణ్యాలు కనీసంగా కూడా లేవని అంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంజనీరింగ్ పట్టా లు చేతపట్టుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా మిగులుతున్నారు.విషాదమేమంటే..దేశంలో ప్రతియేటా విద్యా ప్రమాణాలు నానాటికీ దిగజారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంనుంచి ప్రతియేటా లక్షాయాభై వేలమంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాల బాట పడుతున్నారు. ఐఐటీల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల్లో 90 శాతం మంది ఉన్నత చదువులు, మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళుతున్నారు.

ఈ నేపథ్యంలోనే అమెరికాలో బిల్‌గేట్స్ కలల పంట సిలికాన్ వ్యాలీలో మెజారిటీ భారత విద్యార్థుల కృషే ఉంటున్నది. వీరే ప్రపంచంలో అత్యుత్తమ పరిశోధనలు, ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. 
నిజానికి విద్యాబోధన అన్నింటికన్నా ఉదాత్తమైనది. ఉత్తమమైనది. గౌరవవూపదమైనది. ప్రపంచంలోని చాలా దేశాల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారినే బోధనా సిబ్బందిగా తీసుకుంటారు. అలాగే వారికే సామాజిక గౌరవం కూడా దక్కుతుంది. దురదృష్టవశాత్తూ మనదేశంలో దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. ఏవిధమైన ఉద్యోగాలు రానప్పుడే బోధనా వృత్తిని ఎంచుకునే పరిస్థితి ఉన్నది. ఒకానొక అనధికార సర్వే ప్రకారం 80 శాతం బోధనా సిబ్బంది తమ పిల్లలను బోధనా వృత్తిలోకి పంపడానికి సంసిద్ధంగా లేరు. దీన్ని బట్టే మనదేశంలో బోధనా వృత్తి పట్ల సమాజంలో ఉన్న గౌరవం, స్థానం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలోని అన్ని బోధనాలయాలతోపాటు, ఐఐటీల్లో కూడా బోధనా సిబ్బంది కొరత ఉన్నది. ఐఐటీలు 40 శాతం బోధనా సిబ్బంది కొరతతో సతమతమవుతున్నాయి. 

మనదేశంలో బోధనాలయాలను దేవాలయాలుగా చెబుతారు. కానీ ఇవ్వాళ అవి అనేక సమస్యలతో కునారిల్లుతున్నాయి. రాజకీయాలు, ఆశ్రీత పక్షపాతం, వివక్షలు, అవినీతితో అధఃపాతాళానికి పడిపోయాయి. ఉన్నత విద్యాలయాల్లో అత్యున్నత అధికార నిర్ణయక ఉద్యోగాలు, అత్యున్నత పాలకమండలి సభ్యులు, బోధనా సిబ్బంది నియామకంలో కూడా రాజకీయాలు చోటు చేసుకుంటున్నా యి. పాలక ప్రభుత్వాలు, పార్టీలు తమ రాజకీయ అనుంగు అనుయాయులను అందలమెక్కిస్తున్నారు. నియామకాల్లో పారదర్శకతకు పాతరేసి పక్షపాతానికి పల్లకి కడుతున్నారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో నిష్పాక్షికత మటు మాయమై కులం, రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. స్వయం వూపతిపత్తి ఆవిరైపోయి పైరవీ రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో విద్యాలయాల్లో విద్యావూపమాణాలు అడుగంటిపోయాయి. పరిశోధనలు, విజ్ఞానం కనీస స్థాయిని దాటడంలేదు. దీంతో వెలుగులు నింపాల్సిన విశ్వవిద్యాలయాలు చీకట్లను పం చుతున్నాయి. మరోవైపు విద్యార్థులు తమ భవిష్యతు ్తకోసం ఎంచుకున్న మార్గా ల్లో పయనించడం కోసం తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు. అస్తవ్యస్తమైన పాఠ్యాంశాలు, భారమైన సిలబస్‌లతో కృంగిపోతున్నారు. ఇప్పుడున్న పరీక్షావిధానంతో విద్యార్థులు మరింత ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కాలేజీ లు అనుసరిస్తున్న విధానాలతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నా రు. ఉన్నత విద్యావకాశాల కోసం కోచింగ్ సెంటర్లు చేస్తున్న బోధనా విధానం కూడా పలు విమర్శలకు తావిస్తున్నది. 

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్రమైన నిధుల కొర త ఎదుర్కొంటున్నది. నాణ్యమైన విద్యా ప్రమాణాలు, పరిశోధనలు కూడా నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్న త చదువులకోసం దేశం నుంచి విదేశాలకు వల స వెళుతున్న విద్యార్థుల కారణంగా వందల వేల కోట్ల రూపాయలు తరలిపోతున్నాయి. ఈ నిధులే ఇక్కడ ఉంటే ఇక్కడి విశ్వవిద్యాలయాలు ఎంతో అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవి. అలాగే విద్యా ప్రమాణాలకోసం ప్రపంచ దేశాలన్నీ తమ దేశ ప్రణాళికల్లో పెద్దపీట వేస్తుంటే.. మన దేశంలో మాత్రం విద్యకోసం ప్రణాళికా వ్యయం రాను రాను తగ్గిపోతున్నది. చైనాలో దేశ ప్రణాళికలో 20 శాతం విద్యకోసం ఖర్చు చేస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం పాలకులు నామమావూతపు నిధులు విదిల్చి చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు పేద ప్రజల అభ్యున్నతి పేరు మీద వం దల కోట్లు సబ్సిడీలు ఇస్తున్నారు. దేశ పునర్నిర్మాణానికి ఉపకరించే నిధులను సంక్షే మ పథకాలకు మళ్లించి ఓట్ల రాజకీయం చేస్తున్నారు. దేశ భవిష్యత్తును నిర్లక్ష్యం చేస్తున్నారు. వందకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సంక్షేమ రాజ్యం పేరు మీద అనేక రాయితీలు, సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలు, దేశాభివృద్ధిని నిర్దేశించే విద్య కోసం మాత్రం నామమాత్రం నిధులు ఇచ్చి చోద్యం చూస్తున్నది. ఈ పరిస్థితులు ఇలా గే ఉంటే దేశ ప్రగతి కుంటుపడే ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. 

ఈ పరిస్థితుల్లో ప్రపంచంలోని విశ్వవిద్యాలయాల స్థాయికి మన విద్యాలయా లు చేరుకోవాలంటే.. నిధుల కేటాయింపు చాలినంతగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన ప్రభుత్వం ఇది చేయడానికి బదులు దేశంలోకి విదేశీ విద్యాలయాలను అనుమతిస్తున్నది. విద్యా ప్రమాణాలు పెరగాలంటే ప్రపంచంలోని అత్యున్నత ప్రమాణాలు గల విద్యాలయాలతో కలిసి ఉమ్మడిగా ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించిన నాడే సర్వతోముఖాభివృద్ధికి అవకాశం ఉంటుంది. అలాగే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి దీటుగా దేశం అభివృద్ధి చెందడానికి వీలు ఉంటుంది.


srimothe@gmail.com 
స్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు

Namasete Telangana Telugu News Paper Dated : 23/09/2013

No comments:

Post a Comment