Saturday, July 14, 2012

కాలుష్యంపై కదంతొక్కిన మహిళలు



కరీంనగర్‌కు పోరాట వారసత్వం ఉంది, నాయకత్వ లక్షణాలు పుష్కలం. సాహిత్యం, కళలకు పుట్టినిల్లు. ఇది తెలంగాణ ప్రత్యేకత కాబట్టే ఇక్కడ ఇంకా తిరుగుబాటు నగారా మోగుతానే ఉంటది. కరీంనగర్ పోరాట చరివూతలో మరొక పేజీని సొంతం చేసుకుంది పర్లపల్లి హరిత బయోవూపొడక్ట్స్ కంపెనీపై తిరుగుబాటు. ఇది ముఖ్యంగా మహిళల విజయం. 70 మహిళా స్వయం సహాయక బృందాలు ఉన్న పర్లపల్లి గ్రామం, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లాలో ఉన్న ది. పల్లెలు ఇంకా పచ్చని పట్టు బట్టలతోని కనపడతాయి. పర్లపప్లూకు పోతుంటే చుట్టూ అందమైన కొండలు. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క చరిత్ర. గుట్టకు, పుట్టకు దేవుడుంటడు.అన్ని తెలంగాణ పల్లెల లెక్కనే ఇక్కడ పల్లెపప్లూకు దేవతలుంటారు. గ్రానైట్ రాళ్ళ కోసం, కంకర కోసం గుట్టలను పిప్పిచేసి పల్లె చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రశాంతంగా బతికిన పర్లపల్లికి 2009 నుంచి వాళ్ల బతుకులు పోరుబాట పడతాయని ఊహించి ఉండకపోవచ్చు. జూన్ 2న వందలాది మంది మహిళలు, పురుషులు ఊరంతా దండులాగా కదిలి హరిత బయో ప్రొడక్ట్స్ కంపెనీ మీద తిరగబడ్డది.

కంపెనీ వాహనాలపై దాడి జరిపిన సంఘటన మామూలు ముచ్చట కాదు. ఏడాదికాలంగా వాళ్ళు అనుభవిస్తున్న బాధ, ఆక్రోశం ఆకాశాన్నంటింది. యాజమా న్యం, పోలీసులు, కంపెనీ సెక్యూరిటీ ఏమీ చేయలేకపోయారు. మాభూమి సినిమాలో గడి మీద దండు కదిలినట్టు కదిలిన దృశ్యం కళ్ళముందు కు వచ్చింది. ఇక్కడ ప్రజలే స్వ యంగా తమ సమస్యల మీద అవగాహనతో, ఒక్కతాటిపైకి వచ్చి కదిలిన సంద ర్భం. ఈ ప్రపంచీకరణ యుగంలో ‘నేను’, ‘నాదీ’లో పూర్తిగా మునిగి ఉన్న పట్టణ, మధ్యతరగతి మేధావులకు ఈ ’తిరుగుబాటు’ అర్థంకాని విషయం. ప్రజలు సామూహికంగా ఊరు బాగు కోసం, భూమి కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతార నే అనుభవాలు ఇంకా ఈ గడ్డ మీద సజీవంగా మిగిలి ఉన్నా యనడానికి ఇదొక ఉదాహరణ.

హరిత బయోవూపొడక్ట్స్ 2009లో ఇథనాల్ తయారు చేసే కంపెనీగా పచ్చని పంట పొలాల్లోకి అడుగుపెట్టింది. ఎక్కడి నుంచో ఇక్కడికి ఒచ్చిన దొరలకు కరీంనగర్ మక్కలపై, మానేరుపై కన్నుపడ్డది. తెలంగాణలో ఆహార ధాన్యాల మీద ఆధారపడి తయారు చేసే మొట్టమొదటి కంపెనీ ఇది. నూకలు, మక్కలతోని ఇథనాల్ తయారు చేసి, ఆల్కహాల్, మందులకు దీనిని పంపిస్తామని యాజమాన్యం చెపుతున్నది. ఇక్కడ పశువులకు దానా కూడా తయారు చేస్తారట.2009 ఆగస్ట్ 18న పర్లపల్లి బడిలో కాలుష్య నియంవూతణ ఇంజనీర్, ప్రభుత్వాధికారులు, ప్రజావూపతినిధుల సమక్షంలో ప్రజాభివూపాయసేకరణ జరిగినట్టు, అంతకన్నా ఒక నెల ముందు, పత్రికా ప్రకటన ఇచ్చినట్లు యాజమాన్యం తరఫున శ్రీనివాసడ్డి అంటున్నారు.వాస్తవానికి ఊరు ఊరంతా కూడా ఒక్కటై అది బూటకమని మొత్తుకుంటున్నారు. అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసి, మా జీవితాలను నాశనం చేస్తున్నారని బోరుమంటున్నారు.

పర్లపల్లిలో ఏం జరిగింది? మొదటి నుంచి కూడా గ్రామ కార్యదర్శి, సర్పంచి ఇంకా కొంతమంది దళారులు కలిసి అది బిస్కెట్ కంపెనీ అని, ఇక్కడ బ్రెడ్ కూడా తయారవుతుందని, ఊరోల్లందరికి ఉద్యోగాలోస్తాయని నమ్మించారు. కంపెనీ పేరుమీద వివరాలు ఏమీ లేకుండా తీర్మానం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ ప్రారంభం కానిచ్చినరు. అట్ల మొదలైన కంపెనీ తమ జీవితాలలో కాలుష్యం నింపుతున్నదని గ్రామస్తులు పోరుబాట పట్టారు. పచ్చని పంట పొలాల మధ్య 30 ఎకరాలలో సర్వేనంబర్ 1130, 1131, (పి)1132, 1133, 1134 (పి) పర్లపల్లిలో రెక్టిఫైడ్ స్ప్రిరిట్,ఎథనాల్, ఫార్మ గ్రేడ్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ తయారీకి కాలుష్య నియంవూతణమండలి అనుమతినిచ్చింది. దీనికి రెండు మెగావా ట్ల విద్యుత్తు, రోజుకు ఐదు లక్షల లీటర్ల నీరు, 4000 టన్నుల మక్కలు కూడా అవసరం. కంపెనీ కోసం 30 ఎకరాలకు అనుమతినిస్తే, ఈ కంపెనీ దాదాపు వంద ఎకరాలు రైతులనుంచి అక్రమంగా కొన్నది. మోసంతో మొదలైన కంపెనీ అసలు రూపం మొదలు పెట్టిన రోజునుంచే మొదలైంది. చుట్టు పక్కల భయంకరమైన దుర్గంధం వెదజల్లింది. ప్రజలు లొల్లిపెట్టడం, ఆ ఊరి పెద్దలు నచ్చ చెప్పడం... కొన్నిరోజులు గడిచాయి. ఆ తరువాత ఆరోగ్యాలు పాడు కావడం, పిల్లలకు కామెర్లు, స్త్రీలకు అబార్షన్లు, చర్మ వ్యాధులు ఎక్కువ కావడంతో ప్రజలకు నిద్ర లేకుండా అయింది. దీనిపై ప్రభుత్వాధికారులకు, ప్రజాప్రతినిధులకు తమ గోడును చెప్పుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. రాజకీయపార్టీలు మొదటి నుంచీ ఏమి తెలియనట్టే ఉన్నాయి. కంపెనీ నడవడానికి లక్షలకొద్ది లీటర్ల నీరు లభించడం కోసం కంపెనీ చుట్టూ పక్కల ఉన్న బావులను, బోర్లను కిరాయికి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల బోరుబావులన్నీ ఎండిపోయాయి.కంపెనీ నుంచి వచ్చే భరించలేని వాసనకు నల్గొండ, పీచుపల్లి, ముల్కనూర్, సర్లపల్లి, మొగిలిపాలెం, మొలంగూర్ పల్లెలు తల్లడిల్లాయి. గ్రామాలన్నీ కాలుష్య కాసారంగా మారాయి. ఎవరి ఇంట్లో వారు ఉండలేని పరిస్థితి ఏర్పడింది.

అరవై కోట్ల కంపెనీకి కేవలం 150 మంది కార్మికులను చుట్టుపక్కన ఉన్న గ్రామాలనుంచి తీసుకున్నారు. కంపెనీ కాలుష్యంతో ఇక బతకడం కష్టమని జూన్ 27న ధర్నా చేద్దామని పల్లెజనం కంపెనీ బాట పట్టినరు. యూత్ గ్రూపులు, మహిళా సంఘాలు కంపెనీ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. ఆవేశం కట్టలు తెగి కంపెనీపై దాడికి దిగారు. దొరికింది దొరికినట్టే ధ్వంసంచేశారు. ఇది ధర్మాక్షిగహం కాదా? 38 మంది మీద కేసులు పెట్టి 13 మందిని జైలుకు పంపించారు. దీంతో ఊరంతా స్మశాన ప్రశాంతత నెలకొన్నది. పోలీసువాళ్లు మఫ్టీలో వచ్చి కోడి పిల్లలను ఎత్తుక పోయినట్టు ఎత్తుకుపోతున్నరని ప్రజలు బావురు మన్నరు. శ్రీనివాసచారి అనే ఒక పూజారికి దాడితో ఎటువంటి సంబంధమూ లేదు. తనకు వచ్చిన చర్మ వ్యాధి గురించి , డాక్టర్ చెప్పిన విషయాలను వివరిస్తున్నడు, అంతలోనే మఫ్టీ లో ఉన్న పోలీసులు వచ్చికొట్టుకుంటూ తీసుకుపోయినరు.

మరుసటి రోజు సాయంత్రం తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్‌లో తెలంగాణ భూమి రక్షణ సంఘం, పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ చేశాయి. బాధితుల తరఫున పోలీసుస్టేషన్‌కు పోయి ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, కంపెనీ వెంటనే మూసి వేయాలని డిమాండ్ చేశాయి. ప్రజలు ’హింస’కు పాల్పడినరు కాబట్టి కేసు లు పెట్టినమని పోలీసులు అంటున్నారు. ఇదే మాట కలెక్టర్ కూడా చెప్పారు. రాజ్యానిది ఒకటే భాష, హింస ఒకటే నిర్వచనం. ప్రజల ను ఇన్ని రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నా, వారిని ఏమి అనకూడదని అధికారులు సెలవిస్తున్నారు. ప్రజలు తమ బాగుకోసం, ఊరుకోసం, పర్యావరణం కోసం పోట్లాడితే వారు హింసా వాదులుగా పోలీసులకు కనిపిస్తున్నారు. మహిళలు వందల సంఖ్యలో రాత్రి అని చూడకుండా వచ్చి రాజీవ్ రహదారిని మూసివేసి, తమ వారిని విడిపించాలని రోడ్డుపై బైఠాయించి పోరాట పటిమను చాటారు.

తమ భర్తలు, పిల్లలను ఎంత హింసించినా పోరాటం ఆపేది లేదని మహిళలు ముందున్నారు. వారి ఆగ్రహం ముందు ప్రభుత్వం ఓడిపోయింది. ప్రజా ప్రతినిధులు నీళ్ళు నములుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రస్తుతం తాత్కాలికంగా కంపెనీని మూసివేశారు. ఇప్పటికే ఇథనాల్ తయారీకి వ్యతిరేకంగా ప్రజలు ఇతర ప్రాంతాలలో ఉద్యమిస్తున్నారు. ఈ కాలుష్య పరిక్షిశమలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి. పంట పొలాలు, నీళ్ళు నష్టపోకుండా అన్ని ప్రజా సంఘాలు అడ్డుపడాలి.

ప్రజలు ప్రభుత్వాలపై నమ్మకాలను పోగొట్టుకున్నారు. రాత్రి అంతా తిమ్మాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో, జాతీయ రహదారి మీద కూర్చున్నారు. తమ పంతాన్ని నెగ్గించు కున్నారు. రాత్రి పదిగంటలకు కూడా ట్రాక్టర్‌లలో మహిళ లు దిగుతూనే ఉన్నారు. ఎక్కువ చదువు లేకున్నా, ముందూ వెనుకా గొప్ప సంఘాలు లేకున్నా, సో కాల్డ్ సిద్ధాంత రాద్ధాంతాలు లేకుండా న్యాయం కోసం ఉద్యమించిన పర్లపల్లి మహిళలు విజయం వైపు ప్రయాణం కొనసాగిస్తున్నారు. మాలాంటి వాళ్లకు, సంఘాలకు నిజంగా ఈ పర్లపల్లి మహిళల పోరాటం ఎన్నో పాఠాలు నేర్పుతున్నది. మొదటి రోజు దాడి తర్వాత, రెండో రోజు ఒక మహిళా బృందం కలెక్టర్‌ను కలిసింది. ఆవేశంలో కంపెనీపై దాడికి దిగినట్టు కలెక్టర్ ముందు ఒప్పుకున్నారు. కాని కేసులకు భయపడలేదు. వెనక్కిపోలేదు.ఇది మహిళల విజయం. వీరి పోరాటం సహజ వనరుల కోసం. అంతరిస్తున్న భూగర్భ జలాల కోసం. తమ స్వచ్ఛమైన పల్లె పరిసరాల కోసం గ్రామస్థులు ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. కంపెనీల పేరుతో పల్లె జీవితాలకు కాలుష్యాన్ని పంచు తున్న కంపెనీలకు గోరీ కడుతున్నారు. ఈ చైతన్యం అందరికీ ఆదర్శం కావాలి. వీరికి మద్దతు పలుకుదాం.

Namasete Telangana News Paper Dated : 15/07/2012
-సుజాత సూరేప

No comments:

Post a Comment