Thursday, October 10, 2013

కొత్త రాష్ట్రాలు-సామాజికశక్తుల కర్తవ్యం By Y K



కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ కోర్ కమిటీలు 2013 జూలై 30న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేశాయి. ఆతర్వాత 63 రోజుల సీమాంధ్ర ఆందోళన అనంతరం కూడా ఆ తీర్మానాన్ని యధాతథంగా కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. సమైక్యవాదుల, రాజకీయ నాయకత్వంగానీ, ఉద్యోగ సంఘాల జేఏసీ గానీ ఆందోళనని ఉధృతం చెయ్యటానికి తమ శక్తినంతా ధారపోశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఆందోళనకు కథ, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం అన్నీ తానై నిర్వహిస్తున్నారు.అయినప్పటికీ కేంద్ర నిర్ణయంపై ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో సీమాంవూధలో ఆందోళన మూలంగా కాంగ్రెస్ ఓట్ల పరంగా బాగానే నష్టపోయింది. అయినప్పటికీ జూలై 30 తీర్మానం అక్టోబరు 3న కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. అది అనివార్యం కూడా. ఎందుకంటే, 2009 డిసెంబరు 9 ప్రకటన నుంచి, 23 ప్రకటన ద్వారా ఒకసారి వెనక్కి వెళ్ళింది. ఈలోగా అనేక చర్చలు జరగడం, వివిధ రాజకీయ పార్టీలు తమతమ అభివూపాయాలు తెలియజేయటం, తన అభివూపాయం చెప్పాలని మిగిలిన పార్టీలు కాంగ్రెస్‌పైన వత్తిడితేవడం.. ఈ నేపధ్యంలోనే జూలై 30 తీర్మానం వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడిక వెనక్కి వెళ్ళడం అంటే అప్రతిష్ట మూటగట్టుకొనడమే అవుతుంది. ఏమైనా కాంగ్రెస్ పూర్తిగా నమ్మశక్యంగానిదే అనేది మరువలేం. కనుక రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజలు అవూపమత్తంగా వుండవలసిందే. ప్రజా ఉద్యమాన్ని కొనసాగించవలసిం దే. సీమాంవూధలో సామాజిక న్యాయశక్తులు రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ఎదురీత ఈదవలసివస్తున్నది.సమైక్యవాదనాయకులు ఆధిపత్యకులాలకు చెందిన సంపన్న వర్గీయులు ప్రజలపై, ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలను గుప్పిట్లో పెట్టుకుని వారిని తమకనుకూలంగా నడిపిస్తున్నారు. మరో వైపు బడుగు, బలహీనవర్గాలను ప్రభావితం చేస్తూ అంబేద్కర్ ప్రవచించిన చిన్న రాష్ట్రాల భావజాలం పక్షాన నిలబెట్టగలిగిన బలమైన సామాజిక న్యాయ పార్టీ రాష్ట్రంలో లేదు. కనుకనే సమైక్యవాద అగ్రకుల నాయకులు సీమాంవూధలో కొంతమందిని గందరగోళ పరచగలిగారు. కొంత ఉన్మాదాన్ని కూడా రెచ్చగొట్టగలిగారు. ఆందోళనకు సామాన్య ప్రజల్లో పునాదులు లేకపోయినప్పటికీ, సమైక్యవాదంలోనే పసలేకపోయినప్పటికీ కొంతమందినైనా పక్కదారి పట్టించగలిగారు. మనోవూదేకాలు సృష్టించగలిగారు. భిన్నాభివూపాయాన్ని ప్రకటించటానికైనా వీల్లేని ఫాసిస్టు వాతావరణాన్ని సృష్టించగలిగారు. 

దీంతో ప్రక్కదారిపట్టినవారిలో కొందరు అణచబడ్డ కులాలకు, మైనారిటీలకు చెందినవారు కూడా వుండటం బాధాకరమే. అదే సమయంలో సమైక్యవాదం అంటే సారాంశంలో ఆధిపత్యకులాల సంప న్న వర్గాల రాజకీయాధిపత్యం, తద్వారా ఆర్థిక దోపి డీ తప్ప మరేమీ కాదనే చైతన్యం ప్రజల్లో కలిగించలేకపోవడం సామాజిక న్యాయశక్తుల వైఫల్యమే. కులవ్యవస్థ లోతుగా వేళ్లూనుకొని వున్న దేశంలో సామాజిక న్యాయం లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమం, ఆ లక్ష ్యసాధనలో నిమగ్నమైవున్న ఒక బలమైన రాజకీయపార్టీ ఉనికలో లేకపోవడం పెద్ద కొరత. ఆ కొరతను పూడ్చుకొనడం సామాజిక న్యాయ రాజకీయ శక్తుల తక్షణ కర్తవ్యం. ప్రస్తుతం విషవాయువులా వీస్తున్న సమైక్యవాద ప్రచారాన్ని అడ్డుకొని ముందుకు సాగవలసి వుంది. ప్రస్తుత సందర్భం, సామాజిక న్యాయశక్తులను కూడగట్టుకోవటానికి ముందుకు వచ్చిన ఒక మహాదవకాశం కూడ. ఎందుకంటే, ఇప్పుడు జరుగుతున్నది కేవలం రాష్ట్రాల విభజన మాత్రమేకాదు, సామాజిక న్యాయం, సామాజిక ఆధిపత్యం అనే రెంటి మధ్య జరుగుతున్న రాజకీయ శక్తుల విభజన కూడ. ఈవిధంగా రెండు రాజకీయ శిబిరాల ఏర్పాటు కావడం, అభివృద్ధి చెందడం ఆహ్వానించదగిన పరిణామమే కదా? అయితే, తెలంగాణ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నమైంది. ఐదు దశాబ్దాలకు పైగా అనేక ఆటుపోట్లతో కొనసాగుతున్న రాష్ట్ర సాధన ఉద్యమం ఫలించబోతున్నది. ఆ క్రమం ఇప్పుడు ప్రారంభమైంది. అంటే భౌగోళిక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనున్నది. 

సామాజిక న్యాయ శక్తుల కర్తవ్యం కేవలం భౌగోళిక రాష్ట్రమే అయితే బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారీటీ వర్గాలకు, అంటే బహుజనులకు ఒరిగే ప్రయోజనం బహుస్వల్పం. పాత సామ్రాజ్యవాద అనుకూల, ఆధిపత్య కులాల భూస్వామ్య సంపన్నవర్గాలే రాజ్యాధికారంలో కొనసాగుతాయి. సమైక్య రాష్ట్రంలో పరిపాలించిన శక్తుల మౌలిక స్వభావానికీ, కొత్త పరిపాలకుల మౌలిక స్వభావానికీ తేడా ఏమీ వుండదు. బడుగు బలహీన వర్గాల జీవనస్థితి యధాతధంగా కొనసాగుతుంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీ, బీజేపీలలో ఏ ఒక్కటీ సామాజిక న్యాయపార్టీ కాకపోగా సామాజిక న్యాయాన్ని నిరంతరమూ, అన్ని విధాలా కాలరాస్తున్న పార్టీలే. ఆ పార్టీలనాశ్రయిస్తే, నమ్ముకుంటే ఏవో కొన్ని రాయితీలు (ఆర్థిక, రాజకీయవగైరా) రాలవొచ్చునేమోగానీ, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారంరాదు. సామాజిక న్యాయం అసలే దక్కదు. అంతేగాక, ఆ పార్టీ ల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవడం కూడా సామాజిక న్యాయానికి అన్యా యం చెయ్యడమే.ఎందుకంటే, ఆ పార్టీలన్నీ ఒకే తానులోని ముక్కలే. ‘తెలంగాణను తెచ్చిందీ, ఇచ్చిందీ మేమే’ నని తెరాస, కాంగ్రెస్ పార్టీలు సెంటిమెంటును రెచ్చగొట్టి ఓట్ల వేట సాగించే అవకాశం వుంది. వాస్తవానికి గత ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలోనూ, ప్రత్యేకించి ఒక దశాబ్దానికి పైగా సాగుతోన్న మలిదశ పోరాటంలోనూ ప్రధానశక్తిగా నిలబడింది బహుజనులైన ప్రజా బాహుళ్యమే. ఉస్మానియా తదితర సంస్థల బహుజన విద్యార్థులే. వెయ్యి మందికి పైగా అమరులైన త్యాగధనుల్లో అత్యధికులు ఈ సామాజిక వర్గాలకు చెందినవారే. మరోవైపు ఆధిపత్య కుల సంపన్న వర్గీయులు నాయకత్వ స్థానాలను ఆక్రమించుకున్నారు. పంచాయితీ మొదలు పార్లమెంటుదాకా, ఆపైన అధికార కాంగ్రెస్‌తో రాజీపడి మంత్రి పదవులదాకా ఎగబాకారు. కానీ, సుదీర్ఘ పోరాటంలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలు కేవలం పరిపాలకులు మారటం మాత్రమే కాదు. తలకాయలు మారటం కాదు. పాలనలో, ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలని, కొత్త రాష్ట్రంలో వస్తుందని ఆకాంక్షించారు. ఉద్యమించారు. త్యాగాలు చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే సామాజిక న్యాయాన్ని ఆకాంక్షించారు. కనుక ‘తెలంగాణ తెచ్చిన వారు, ఇచ్చినవారు’ ఆధిపత్యకుల రాజకీయ పార్టీలు కాదు. తెలంగాణ ప్రజలే. ప్రధానంగా బడుగు బలహీనవర్గాల ప్రజలే. అలాంటప్పుడు నూతన రాష్ట్రంలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించవలసింది సామాజిక న్యాయ రాజకీయ శక్తులే. అంతేగానీ, పాత సమైక్యాంధ్ర పరిపాలకుల వంటి ఆధిపత్య కులదోపిడీ స్వభావంగల శక్తులకు ఆ అర్హత లేదు.

అయితే తెలంగాణలో కూడ సామాజిక న్యాయ రాజకీయ శక్తులు బలమైన సంఘటితశక్తిగా ఈ రోజు లేవు. ఆస్థాయిలో వ్యవహరించగల రాజకీయ పార్టీలు లేవు. అవి ఉద్యమ శక్తులుగానే, చిన్న చిన్న పార్టీలుగానే, గ్రూపులుగానే, వ్యక్తులుగానే అసంఘటితంగా వున్నాయి. ఈ శక్తులన్నీ ఇప్పటికిప్పుడే ఒకే రాజకీయ పార్టీగా నిర్మాణమై ఒకే గొడుగు కిందకి వచ్చే అవకాశాలు లేవు. అందుకు పరిస్థితులు ఇంకా పరిపక్వం కావలసే వుంది.దీనికోసం సిద్ధాంత, రాజకీయ విధాన పరమైన, నిర్మాణయుతమైన కృషి సాగించవలసి వుంది. ఇది నేటి ప్రజల ఆవశ్యకత. గను క ఆ కృషిలో నిబద్ధత, నిజాయితీ గలిగిన శక్తులు తప్పకుండా ముందుకు వస్తాయి .ఇది కష్టతరమైందే కానీ అసంభవమేమీ కాదు.
2014 ఎన్నికల దిశగా ప్రస్తుతం ఉనికిలో వున్న సామాజిక న్యాయ శక్తులన్నీ కలిసి ఒక రాజకీయ ఫ్రంట్‌గా ఏర్పడాలి. ఆ శక్తులు ఏ రూపంలో వున్నా ఫ్రంట్‌లో భాగస్వాములవడానికి అభ్యంతరం వుండకూడదు. ఆ ఫ్రంట్ ఇప్పుడున్న పాలక, ప్రతి పక్ష పార్టీలకు(అక్షిగకుల సంపన్నవర్గాల పార్టీ లు) ప్రత్యామ్నాయంగా 2014లో పోటీ చెయ్యటానికి సన్నద్ధమవ్వాలి. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే ఎన్నికలు దగ్గరలో వున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం రాజకీయ వూహ్యంతోనే చేసింది. ఇలాంటి నిర్ణయాపూప్పుడూ ఆధిపత్య శక్తులే చేస్తా యి. వున్నంతలో అందుకొనడం తప్ప బలహీనవర్గాలకు మరో గత్యంతరం లేదు. కనుక, ఏ సంస్థకాసంస్థ సమాయత్తమవుతూ మరోవైపు సమష్టిగా ఒక సామాజిక రాజకీయ శిబిరం నిర్మాణానికి నడుం బిగించాలి. అదే సమయంలో సభలు, సమావేశాలు, సదస్సులు విస్త ృతంగా నిర్వహిస్తూ నూతన రాష్ట్రమంతటా సామాజిక ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణాన్ని పెంచాలి. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సెంటిమెంటు ఎంతబలంగా నిర్మాణమైందో, అంతకన్నా మించిన స్థాయిలో సామాజిక న్యాయ సెంటిమెంటును విస్త ృతంగా రగల్చాలి. సంస్థలకు రోటీన్‌గా వుండే డిమాండ్ల ఎజెండాను తత్కాలికంగానైనా రెండో స్థానానికి నెట్టి, వీలైతే పూర్తిగా పక్కనబెట్టి, సామాజిక న్యాయ రాజకీయ వ్యాప్తినీ, అలాంటి శిబిరం నిర్మాణాన్నీ ప్రధాన ఎజెండాగా సంస్థలన్నీ కృషి చేయాలి. ఇప్పటి నుంచే 2014 ఎన్నికల అంశం కేంద్ర బిందువుగా క్షేత్ర స్థాయి లో కార్యక్షికమం సాగాలి.

-వై కే
సామాజిక న్యాయంపార్టీ రాష్ట్ర అధ్యక్షులు

Namasete Telangana Telugu News Paper Dated: 11/10/2013 

No comments:

Post a Comment