Thursday, October 31, 2013

విభజనతోనే ముస్లింల వికాసం By -మహమ్మద్ అజ్గర్‌అలీ

ఆధునిక ఆంధ్రవూపదేశ్‌లో 1950 తరువాత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కొన్ని విచిత్ర అంశాలు కన్పిస్తాయి. 1953, 1969,1972 లలో విభజనను పూర్తిగా సమర్ధించిన వారు, 2013లో విభజన ప్రకటన వచ్చిన తరువాత సీమాంధ్ర ప్రాంత వాసులు సమైక్యతా వాదులుగా మారారు! నిజంగా ఇది వారి హృదయాలలోంచి వచ్చిందేనా? సీమాంవూధలోని అన్నీ వర్గాల ప్రజలు సమైక్య వాదాన్ని సమర్థిస్తున్నారా? అయితే ఇరుప్రాంతాల్లోని ముస్లింలు ఏం కోరుకుం టున్నారు? వారి చారిత్రక,జీవన పరిస్థితులేమిటి?

రాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా దాదాపు 13శాతం వరకు ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముస్లింలు, కోస్తా ప్రాంతం కన్నా అధికంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో 40శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది. పాతబస్తీలో 90శాతం వరకు ముస్లింలున్నారు. అన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా ముస్లింలు గణనీయంగా ఉన్నా రు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర స్వల్పంగానే కనిపిస్తుంది. ఎంఐఎం తెలంగాణ ఏర్పాటును వ్యతేరేకించింది. రాష్ట్రం విడిపోరాదని, విడిపోతే ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని కోరింది. ఎట్టి పరిస్థితులలోనూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోమన్నా రు. ఉద్యమానికి మూలస్తంభంగా పరిగణించే టీఆర్‌ఎస్‌లో కూడా ముస్లిం నాయకులు వేళ్లమీద లెక్కించే సంఖ్యలోనే ఉన్నా రు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థి పరాజయం పొందాడు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, బీజేపీ ప్రాబ ల్యం పెరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ అగ్ర నాయకులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్ర మోడి మొదలగు వారు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు మద్దతు ప్రకటించారు. మొత్తం మీద పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర స్వల్పంగానే ఉన్నదని చెప్పవచ్చు. ముస్లిం విద్యాధికులు తెలంగాణ ఏర్పాటును ఆమోదించినా, ముస్లిం సామాన్య ప్రజలలో తెలంగాణవాదం మిగతా వర్గాల ప్రజలతో పోలిస్తే అంతగా లేదు.
ddre21

ఇక సీమాంధ్ర ప్రాంతానికి వస్తే.. ముస్లింల జనాభా 5-6శాతం కన్నా ఎక్కువ లేదు. వీరిలో 95శాతం మంది చేతి వృత్తుల మీద ఆధారపడిన వారు. అక్షరాస్యత అధికంగా లేదు. రాయలసీమ ప్రాతం, దక్షిణ కోస్తాలో ముస్లింలు కొంత ఎక్కువగా కన్పిస్తారు. గోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలో అతి స్వల్పం. కానీ సమైక్య ఉద్య మంలో వీరి పాత్ర అధికంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమలోని అన్నీ జిల్లాలలోనూ, గుంటూర్,కృష్ణ జిల్లా, విశాఖపట్నంలో జరిగే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. మసీదులలో, ముస్లిం జమాత్‌లలో, రోడ్ల మీద నమాజులు చదువుతున్నారు. దువా చేస్తున్నారు. ముస్లిం మతపెద్దలు, శాసన సభ్యులు నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ‘ఓట్ బ్యాంక్’ గా పరిగణించబడే వీరు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిర్వహించే నిరసన ప్రదర్శనలలో అదికంగా కన్పిస్తున్నారు. ముస్లిం స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, విద్యార్థినులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. కింది తరగతి, ఉన్నత తరగతి అనే తేడా లేకుండా, అన్నీ వర్గాలవారు, అన్నీ వృత్తులకు చెందిన ముస్లింలు పాల్గొంటున్నారు.

ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీల నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల సామాజిక,ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులు ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నా దారుణంగా ఉన్నాయి. ముస్లింలలో ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది, రాష్ట్ర సర్వీసులలోని ముస్లిం ఉద్యోగస్తుల సంఖ్య 1-3శాతం కన్నా తక్కువగా ఉంది. ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటానికి రాష్ట్రంలో అనేక అడ్డంకులను ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోర్టు స్టే పైనే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ముస్లింలలో కూడా అందరికీ రిజర్వేషన్లు లేవు. కొన్ని వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారు. పఠాన్, సయ్యద్‌లకు రిజర్వేషన్లు లేవు. షేక్‌లకు మాత్రమే ఉన్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేష న్లు ఉన్నా, సచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిటీ సూచనల మేరకు కేంద్ర సర్వీసులలో ఇంకా రేజర్వేషన్లు కల్పించబడలేదు. పోలీసు,పారామిలిటరీ, మిలిటరీ దళాలలో ముస్లింల సంఖ్య పెరగడంలేదు. పైగా ఇటీవల జరిపిన సర్వేలో రక్షణ దళాల లో వీరి సంఖ్య గత పదేళ్లలో తగ్గింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటానికి జరిగిన ఉద్యమాలను, ఆందోళనలను పరిశీలిస్తే..,ఆ ఆందోళనలలో సీమాంవూధలోని ముస్లిం జనసమూహం నిర్వహించిన పాత్ర చాలా తక్కువ. కానీ ప్రస్తుత సమైక్యతా ఉద్యమంలో కాస్త ఎక్కువగానే పాల్గొంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలలోని ముస్లింలు రిజర్వేషన్ల కోసం ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలలోని ముస్లిం విద్యాధికులు రిజర్వేషన్ల కోసం పోరాడారు. తమ జీవనం, అభివృద్ధి, చదువు, ఉద్యోగాలు, తమ భవిష్యత్తో ముడిపడిన రిజర్వేషన్ల కన్నా, సీమాంధ్ర ముస్లింలకు సమైక్య ఉద్యమంలో ఏం కనిపిస్తున్నదో అంతుపట్టడం లేదు.
విభజన జరిగితే రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందని, నీటి కొరత ఏర్పడుతుందని,ఉద్యోగావకాశాలు తగ్గుతాయని భ్రమపడుతున్నారు. కానీ కోస్తా ముస్లిం లు ఏ కారణాలతో ఉద్యమిస్తున్నారో అర్థం కావటం లేదు. రాష్ట్రం విడిపోతే ముస్లిం లకు వచ్చే నష్టాలు ఏంటి అనేది ఒక ప్రశ్న?

విభజన జరిగినా కోస్తా ముస్లింలకు వచ్చే నష్టం లేదు. నీటి కొరత ఏర్పడదని, ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల విషయంలో ఎటువంటి తేడా ఉండదని నీతిపారుదల నిపుణులు చెబుతున్నారు. సమస్యలు వస్తే తీర్చటానికి నిపుణుల కమిటీలు ఉన్నాయి కదా అంటున్నారు. ఉద్యోగాల విషయంలో హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభు త్య ఉద్యోగాలు చేయటానికి జోనల్ విధానం అడ్డు వస్తుంది. 610 జీవో కింద ఉన్నవారే వెనకకు వస్తున్నారు. కేంద్ర ఉద్యోగాలలో, విద్యాలయాలలో అందరికీ సమా న అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగాల విషయానికి వస్తే.. ఆర్హతలు ఉంటే హైదరాబాద్‌లో మిగతా వారికన్నా ముస్లింలకే ఆధిక అవకాశాలున్నాయి. భాష, సంస్కృతి, ప్రయోజనాన్ని అధికంగా పొం దవచ్చు. ఇతరులకన్నా మిన్నగా ముస్లిం లు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ముస్లింలకు ప్రయోజనాలు లేవనుకున్నా నష్టాలు మాత్రం లేవు.

రాష్ట్ర విభజన జరిగి, రాజధాని కర్నూల్ వచ్చినా, విజయవాడ-గుంటూరు మధ్య వచ్చినా,ఒంగోలుకు వచ్చినా ముస్లింలకే ఆధిక ప్రయోజనం. ఆ ప్రాంతాలలో వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కిలోమీటర్ల మేర ముస్లింల జన సంఖ్య అధికంగా ఉంటుంది.ఆ ప్రాంత జనసంఖ్యలో దాదాపు 15-20 శాతం ఉంది. రాష్ట్ర విభజనతో ముస్లింల భూములు, ఆస్తుల విలువలు పెరుగుతాయి. వ్యాపారాలు, చిన్న, చేతి వృత్తుల పరిక్షిశమలు, ఆటోనగర్, పౌండ్రీ లు అభివృద్ధి చెం దుతాయి. పిల్లలకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. శాసన సభలో కూడా ముస్లింల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ముస్లింలచే స్థాపించబడి, నడపబడుతున్న ఉన్నత విద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాల లు, మదరసాలు వృద్ధిచెందుతాయి. ప్రస్తుతమున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ కన్నా.. రేపు విడిగా ఏర్పడే సీమాంధ్ర, తెలంగాణలో వీరి అభివృద్ధి నిజంగా తగ్గుతుందా, లేదా విభజన ద్వారా ఆధిక ప్రయోజనం కలుగుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
ఈమధ్యనే ఒక మేధావి అన్నట్లు మతం ఒకటైనా, ఉర్దూ, తెలుగు-ఉర్దూ మాట్లా డే తెలంగాణ ముస్లింలకు, ఉర్దూ, తెలుగు-ఇంగ్లిష్ మాట్లాడే ఆంధ్ర ముస్లింలకు విభజన, సమైక్యతల మధ్య సరియైన అవగాహన రాలేదా? తమది కాని సమైక్య ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారో ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిది. విభజన తోనే ముస్లింలు అభివృద్ధి చెందుతారని గుర్తెరగాలి.
Namasete Telangana Telugu News Paper Dated: 31/10/2013 

No comments:

Post a Comment