Tuesday, October 22, 2013

నిరాడంబరతకు నిలువుటద్దం (ఎస్.ఆర్.శంకరన్) By చెట్టుపల్లి మల్లిఖార్జున్


సమాజంలో అట్టడుగు వర్గాలైన పేదలు, దళితులు, అదివాసీల పట్ల అపారమైన ప్రేమతో, ఈ దేశం బాగుపడాలనే తపనతో అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలలను ఎస్సీ, ఎస్టీ ప్రజలకు అందించిన ఘనత ఎస్.ఆర్. శంకరన్‌దే! రాష్ట్రంలో సాంఘిక, సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలు, గురుకుల పాఠశాలలు, స్కాలర్‌షిప్పులు, గిరిజన హక్కులు, నక్సలైట్ ఉద్యమం అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు ఎస్.ఆర్.శంకరన్.
దేశ చరివూతలో ఉన్నతాధికారుల్లో శంకరన్ లాంటి మానవతావాదులు అరుదు. ఆయన నిజాయితీకి మారుపేరుగా నిలిచారు. పేద ప్రజలకు ఆయన చేసిన మేలు దళితులు, గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. సమాజ మార్పు కోసం ఆయన వేసిన అడుగులు అందరికీ ఆదర్శం. శంకరన్ నిజాయితీ గల ఐ.ఎ.ఎస్.అధికారిగా భూ సమస్యల విషయంలో పేదలకు అనుకూల విధానాలు రూపొందించి వాటిని చిత్తశుద్ధితో అమలు చేశారు. మావోయిస్టులతో రాష్ర్ట ప్రభుత్వం చర్చలు జరపడంలో ఆయనే ముఖ్య పాత్ర పోషించారు. రాజ్యాంగంలో పొందు పరచబడిన ‘సంక్షేమ భావన’ను ఆచరణలో చూపిన వ్యక్తి. ‘సంక్షేమం’ అన్న భావానికి దేశవ్యాప్తంగా గుర్తింపును, మన రాష్ట్రానికి ఈ విషయంలో ప్రత్యేకతను సంతరించిపెట్టిన వారు ఎస్.ఆర్. శంకరన్.

శంకరన్ తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు సమీపంలోని సిరిగలత్తూరు గ్రామం లో 1934 అక్టోబర్ 22న జన్మించారు, ఎస్.ఆర్. శంకరన్ పూర్తి పేరు సిరిగలత్తూర్ రామనాధన్ శంకరన్. శంకరన్ తండ్రి రైల్వేగార్డుగా పనిచేసేవారు. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు బదిలీ అయి వెలుతుండటంతో ఆయన చదువు వివిధ ప్రాంతాలలో కొనసాగింది. మద్రాసు లయోలా కళాశాలలో బి.కాం(ఆనర్స్) చదివారు. మధురైలోని కళాశాలలో కొంతకాలం కామర్స్ లెక్చరర్‌గా పనిచేశారు. శంకరన్ కేంద్ర పబ్లి క్ సర్వీస్ కమిషన్ రాసి 1957ఐఏఎస్ బ్యాచ్‌కు ఎంపికై నంద్యాల సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కొద్దికాలం ఫారెస్ట్ ఎన్విరాన్‌మెంట్ డిపార్ట్‌మెంట్లకు కార్యదర్శిగా పనిచేశారు. ఆర్ధిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగాను, ఈ శాఖలోనే ప్లానింగ్ కార్యదర్శిగాను పనిచేశారు. న్యూఢిల్లీలో గ్రామీణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. బీహార్ కోల్‌మైన్స్ అధికారిగా కొంతకాలం ఉన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు.

ఎస్.ఆర్.శంకరన్ కంటే ముందు ‘సాంఘిక సంక్షేమశాఖ’ అనేది లేబర్, ఎంప్లాయిమెంట్ శాఖలో మిళితమై ఉండేది. దాన్ని ప్రత్యేక శాఖగా చేసిన ఘనత శంకరన్ గారిదే. అంతేకాదు ఎన్టీఆర్ ముఖ్యమంవూతిగా ఉండగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలంన్నింటినీ కలిపి ఒకే భవనంలో వాటి కార్యాలయాలను ఏర్పాటు చేసింది శంకరన్ గారే. నేటి ‘దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్’ నిర్మాణానికి రూపురేఖలు దిద్దింది కూడా ఆయనే. సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల రూపకల్పనకు, దేశంలో సివిల్ సర్వీసెస్ సాధించుటకు ‘ఆంధ్రవూపదేశ్ స్టడీసర్కిల్’ ఏర్పాటుకు కృషి చేసింది శంకరన్‌గారే. వృత్తి విద్యాకోర్సులలో చదివే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులందరికీ (ఆదాయ పరిమితిని విధించి) ఉచిత హాస్టల్ వసతి, ఉపకార వేతనాలు అందజేసే ప్రక్రియను ప్రారంభించిందీ ఆయనే. సాంఘీక సంక్షేమశాఖ కార్యదర్శిగా ఉండగా హాస్టల్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థిని చేర్చుకోవాలని ఆదేశాలు జారీచేశారు. విద్యార్థుల సంఖ్య అనుకున్నదానికంటే ఎక్కువ కావడంతో హాస్టల్స్ నిర్వహణకు బడ్జెట్ సరిపోలేదు. దీంతో ప్రభుత్వ అనుమతి లేకున్నా ఖర్చుపెట్టారు. అందుకు ఆర్థికశాఖ కార్యదర్శి బి.పి.ఆర్.విఠల్ అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి పేషీకి వెళ్ళింది. అప్పుడు వి.గోవిందరాజన్ ముఖ్యమంత్రి చెన్నాడ్డికి కార్యదర్శిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు శంకరన్ చేసిన సేవల ఫలితంగానే ఈ వర్గాల ప్రజలు ఇందిరా కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించారని ముఖ్యమంత్రి గ్రహించారు. శంకరన్ ప్రతిపాదనలను,ఆదేశాలను,ఆచరణను సమర్ధించారు.

శంకరన్ గారికి కార్మిక,ఉపాధి, సాం ఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖలంటే బాగా ఇష్టం. ఈ శాఖల ద్వారా ప్రజలకు చేరువకావచ్చునని, ఎక్కువ సేవ చేసే అవకాశం ఉంటుందని భావించేవారు. ఈ శాఖల అధికారిగా ఆయన దళిత బడుగు, బలహీన వర్గాలకు సేవచేసి వారి ఆదరాభిమానాలను చూరగొన్నారు. శంకరన్ నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన 18 నెలల కాలంలో పేద వర్గాలకు అధిక సేవలందించారు. ఆ తర్వాత వీరిని ఆదర్శంగా తీసుకొని కె.రాజు, ఐఏఎస్, కలెక్టరుగా ఈ జిల్లా పేదప్రజలకు ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు సేవచేశారు. శంకరన్ ఈ జిల్లాకు కలెక్టరుగా పనిచేసిన కాలాన్ని జిల్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. పేదలకు వందలాది ఎకరాల భూమిని ఆయన పంచిపెట్టారు. ‘కపూక్టర్’ అన్న పదవికి గౌరవం తీసుకువచ్చారు. జిల్లాలోని సగం గ్రామాలను స్వయంగా అధికార బృందంతో సందర్శించారు. ప్రజల వద్దకు పాలన అంటే ఎలా ఉంటుందో ఆచరణలో చూపారు. వీరి సేవలకు గుర్తింపుగా నెల్లూరు జిల్లాలో శంకరపురం, శంకరన్ నగర్‌లు అనేకం వున్నాయి.
ddr3

శంకరన్ సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ఉన్న సమయంలో లేక్ వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉండేవారు. సచివాలయానికి నడిచివచ్చేవారు. ఒకరోజు గేటువద్ద ‘పాస్’ చూపమని సెక్యూరిటీ అధికారి అడిగారు. ‘నేను శంకరన్ నయ్యా’అన్నారు. ఖంగుతిన్న సెక్యూరిటీ అధికారి క్షమించమని చెప్పి సెల్యూట్ చేసి పంపించారు. శంకరన్ అతనిని తన విధిని సక్రమంగా నిర్వహిస్తున్నందుకు అభినందించారు. అప్పటి నుంచీ ఆయన ఎంట్రీ పాసును తీసి పెట్టుకున్నారు. శంకరన్ సచివాలయానికి ఉదయాన్నే తొమ్మిదన్నరలోగా చేరుకునేవారు. రాత్రి ఎనిమిది గంటల వరకు పనిచేసేవారుపజల సమస్యలనుచిత్తశుద్ధితో పరిష్కరించేవారు.
శంకరన్ మెదక్ జిల్లా ‘ఖానాపూర్’లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికులను సమావేశపరిచి వారికి వెట్టిచాకిరి నుంచి ఎట్లా విముక్తి కావాలో శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి బోధించారు. ఫలితంగా భూస్వాముల వద్ద పనిచేసే జీతగాళ్ళంతా తిరుగుబాటు చేశారు. వాళ్ళలో డాక్టర్ చెన్నాడ్డి బంధువుల వద్ద పనిచేసేవాళ్లూ ఉన్నారు. అప్పుడు ముఖ్యమంవూతిగా ఉన్న చెన్నాడ్డికి వారంతా ఫిర్యాదు చేసి, తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి శంకరన్ గారిని పిలిచి మందలించబోయారు. తాను చట్టవూపకారమే పనిచేస్తున్నానని కరాఖండిగా చెప్పారు.చెన్నాడ్డితో వెట్టిచాకిరి నిర్మూలన అంశంపై విభేదించిన శంకరన్ గారిని త్రిపుర ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని స్వీకరించమని కోరింది. అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నృపేన్ చక్రవర్తి. ఆయన కూడా శంకరన్ వలె అవివాహితుడు. శంకరన్ గారికి పాలన విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. త్రిపురలో శంకరన్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉండేవారు. ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునేవారు.

బీహార్ రాష్ర్టంలో కోల్‌మైన్స్ అధికారిగా ఉన్నప్పుడు బొగ్గు గునుల్లోకి వర్షం నీళ్లు ప్రవహించాయి. దీనివల్ల అనేక మంది బొగ్గుగని కార్మికులు ప్రాణాలు పొగొట్టుకున్నారు. తమ వారిని పోగొట్టుకున్న ఒక ముసలి అవ్వ శంకరన్ గారిని పట్టుకొని బోరున విలపించింది. ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఈ ఘటనలో శంకరన్ గారి స్పందన, ఆయన పనివిధానం బాధితులను ఆకట్టుకుంది.
శంకరన్ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా, కాకి మాధవరావు డైరెక్టర్‌గా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల సమగ్ర అభివృద్ధికి కావలసిన చర్యల్ని చేపట్టడానికి రాష్ట్రస్థాయిలో వారం రోజుల పాటు ఎల్‌బీ స్టేడియంలో జరిగిన మహాసభలో చేసిన తీర్మానాలను జీవోల రూపంలో తీసుకు వచ్చారు. ఈ ఘనత ఎస్.ఆర్.శంకరన్ గారిదే. వాటిని ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం కూడా దీనిలో చేర్చారు. 1976-77లో 136 మెమోలు, జీవోలు వెలువడ్డాయి. వీటిలో హౌసింగ్ బోర్డు ఇళ్ల కేటాయింపులో రిజర్వేషన్లు, బోగస్ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించిన వారిపై చర్యలు, జిల్లా స్థాయిలో ఎస్సీ, ఎస్టీ సెల్‌ల ఏర్పాటు, కులాంతర వివాహితులకు రక్షణ, అగ్రవర్ణ కాలనీలలో దళితుల ఇళ్ల నిర్మాణం, మురికివాడల్లో నివసించేవారికి ప్రత్యామ్నాయ గృహ వసతి, భూ పంపిణీ మొదలైనవి ఉన్నాయి. జీవితాంతం శంకరన్ గారు బడుగు బలహీన వర్గాలకు చేసిన మేలు, రాజ్యాంగ పరంగా సంక్రమింప చేసిన హక్కులు మరువరానివి. ఐఏఎస్ అధికారిగా అత్యున్నత పదవులు చేపట్టినా నిరాడంబరంగా జీవించిన ప్రజల మనిషి శంకరన్. జీవితాంతం ఉన్నత మానవీయ విలువల కోసం పోరాడిన శంకరన్ ఎందరికో స్ఫూర్తి.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అకడమిక్ కన్సప్టూంట్
పాలమూరు యూనివర్సిటీ
(నేడు ఎస్.ఆర్. శంకరన్ 79వ జయంతి)

Published in Namasete Telangana Telugu News Paper Dated : 22/10/2013 

No comments:

Post a Comment