Saturday, October 8, 2011

కుతంత్రాలు ఇక చాలు...By-బి. రామకృష్ణ Namasethe Telangana 09/10/2011

కుతంత్రాలు ఇక చాలు...
తెలంగాణ ఆరు దశాబ్దాలుగా సమానత్వ విలువల కోసం పోరాడుతున్న ది. ఆత్మగౌరవం కోసం, స్వయం నిర్ణయాధికారం కోసం కలెబడుతున్నది. తన సాంస్కృతిక అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం పొర్లాడుతున్నది. తన యాసను, భాషను, వేళ్లను వెతుక్కుంటూ, వాటిని స్థిరీకరించుటకు పోరుతున్నది. స్థానిక సంస్కృతులను నిలబెట్టుకుంటూ అంతర్లీనంగా ప్రపంచీకరణను ఎదిరించే పోరాటానికి సాగుతున్నది తెలంగాణ. పాలకుల కుటిల నీతిని, బడా పెట్టుబడిదారుల క్రూరత్వాన్ని, వారి స్వలాభాల కోసం ప్రజలను ఎంతగా
హింసించగలరో నిరూపిస్తున్నది. త్యాగాలకు, శాంతియుత ప్రజాస్వామిక ఉద్యమాలకు పాఠాలు నేర్పుతున్నది తెలంగాణ.

గుణాత్మక ఉద్యమ లక్ష్యాలతో సకల జనుల ఆకాంక్షగా ముందుకెగసి పడుతున్నది తెలంగాణ. చరిత్ర గర్వించదగ్గ రీతిలో సమర శంఖం పూరిస్తూ సమ్మె సెగలను రాజేస్తూ రాష్ట్ర సాధన దిశగా సాగిపోతున్న ది తెలంగాణ.నాలుగు వారాలుగా సింగరేణి బొగ్గుగని కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారూ, వీరు అనకుండా సకల జనులు ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మెలో పాల్గొంటున్నారు. తెలంగాణే ఏకైక ధ్యేయంగా నిర్బంధాలను ధిక్కరిస్తూ ఉద్యమం లో ఊరేగుతున్నారు.
ఉద్యోగులు జీతభత్యాల కోసం కాకుండా రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యోగాలను పణంగా పెట్టి ఉద్యమ సెగలను రాజేస్తూ కదులుతున్నారు. సకల ఇబ్బందులను భరిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కద న రంగంలో సకల జనులు పరుగుపూత్తుతున్నారు.

పది పదిహేనేళ్లుగా ఊరువాడా, సకల, సబ్బండ వర్గా లు రాష్ట్ర ఆకాంక్షను సభలు సమావేశాల్లో, ఊరేగింపుల్లో, ధర్నాల్లో, నిరాహారదీక్షా శిబిరాల్లో, ఆట పాటల్లో, వంటా వార్పుల్లో, రైలు రోకోలలో, బందుల్లో నేడు సకల జనుల సమ్మె రూపంలో వ్యక్తీకరిస్తున్న సందర్భంలో మనమున్నాం. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించకుండా ఇంకా చర్చలు అంటే మరో మోసానికి తెర తీయడమే! హైదరాబాద్‌లేని తెలంగాణను
సూచించడమనేది తెలంగాణ ప్రజలను వంచించడమే తప్ప మరొకటి కాదు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాత్రం నేడు విలువలు కరువైనాయని అంటున్నారు. ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి గాంధేయవాదానికే ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి అంటున్నాడు. గాంధేయ పద్ధతుల్లో ఈ ప్రాంత ప్రజలు పదిహేనేళ్లుగా ఉద్యమిస్తున్నా.. దాని గురించి
సానుకూలంగా పెదవి తెరవరు సరికదా అణచివేత, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. వీరా గాంధేయవాదం గురించి మాట్లాడేది? తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడిన పాలక పార్టీలు, కోస్తాంధ్ర వలస పెట్టుబడిదారులు, సోకాల్ట్ కోస్తాంధ్ర మేధావులది సంకుచిత బుద్ధి తప్ప మరొకటి కాదు. తెలంగాణ సంస్కృతిని ఎత్తిపట్టి, గౌరవించి తమలో మమే కం చేసుకోలేని సమైక్యవాదులు ఇక్కడి మట్టిమనుషుల వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పటిమను, ధీరత్వాన్ని కాదని సమైక్యరాగాన్ని ఆలపించడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయి. పాలక వర్గ పార్టీల మాయోపాయా లు, దుర్నీతి, చెవులుండి వినిపించనట్టు, కళ్లుండి చూడలేకపోతున్నట్లు నటిస్తున్న కుట్రపూరిత మోసకారితనం ప్రస్ఫుటంగా వెల్లడవుతున్నది.


రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల (ఒక్క సీపీఎం తప్ప) అంగీకారం మేరకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది. వెను విద్రోహాలు మొదలై ఆ ప్రకటన వెనక్కిపోయింది. కేంద్రం కూడా ఇచ్చిన మాటను అమలు చేయకుండా దొంగ నాటకానికి తెర తీసింది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోనని ఏడువందలకుపైగా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ బలిదానాలకు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, తెలంగాణపై ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న పార్టీలదే బాధ్యత. సమై క్యం అనేవారు, అంతా ఒకటే అనేవారు, భాష, ఒకే తల్లి బిడ్డలం అనేవారు, మనమంతా సోదరులం అనేవారు, సాటి సోదరులు బలిదాలకు చలించరా?
తెలంగాణ ఇవ్వకుండా కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు కొత్త విద్రోహానికి సన్నాహాలు చేస్తుంటే, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించకుండా ఉంటున్నారంటే వారికి ఎంత అధికారదాహం ఉన్నదో అర్థమవుతుం ది. ప్రజాభివూపాయాన్ని గౌరవించే ప్రజాస్వామిక సంస్కృతి ఉంటే ఇంత తమ పదవులను అట్టిపెట్టుకునేవారు కానే కాదు. పైగా రాజీనామాలు చేసిన కొంద రు తామేదో త్యాగం చేసినట్టు,త్యాగధనులుగా కీర్తింపబడాలని తిరిగి తమనే ఎన్నుకోవాలనే ఒక నిర్బంధపూరిత వాతావరణాన్ని కోరుకుంటున్నా ను. ఇదేదో తమ జన్మహక్కుగా భావించే ఒక చౌకబారు మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నారు. దీన్ని మరికొందరు సమర్థిస్తున్నారు. వీరి రాజీనామాలను ప్రజలు కోరుకున్నారు. రాజీనామాలు చేసి ప్రజాభివూపాయాన్ని గౌరవించడం బాధ్యతగా గుర్తించాలే తప్ప త్యాగంగా కానే కాదు. ఉద్యమంలో ప్రత్యక్ష
కార్యాచరణతో పాల్గొని తెలంగాణ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే గౌరవానికి అర్హత వస్తుంది. అంతేకాని రాజీనామాల డ్రామాలు అడితే రాదనేది స్పష్టం అయిపోయింది.


రాజకీయ పార్టీలు ఉద్యమాలు చేస్తున్న క్రమంలో వాటిలోని న్యాయమైన ఆకాంక్షలకు మద్దతుగా ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, కార్మికులు, విద్యార్థులు ఉద్యమాల్లోకి వస్తుంటా రు. కాని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో దీనికి భిన్నంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థి వర్గం అగ్రస్థానంలో ఉండి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాజకీయ పార్టీలకు చురకలు అంటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరివూతలో
ఎప్పుడూ విద్యార్థులు, ఉద్యోగులే ప్రధాన భూమిక వహించడం ఇక్కడి చారివూతక ప్రత్యేకత.
దేశంలో అంతర్భాగంగా కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమంపై ఎన్నెన్నో కుతంవూతా లు, కపట నాటకాలు, విద్యార్థులపై పోలీసుల లాఠీలు, ఒక్కొక్కరిపై 100పైగా అక్రమ కేసులు, బెదిరింపులు, జైళ్లు, తీవ్ర నిర్బంధాలు అణచివేతలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకపోవడం చూస్తుంటే, మౌలిక మార్పు కోసం జరిగే
ఉద్యమాలపై ఎంత దారుణమైన రాజ్యహింస ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రజాస్వామిక నిరసనలకు, శాంతియుత పోరాటాలకు విలువలేని దుర్మార్గపు పరిస్థితి దాపురించడం దేశ ప్రజలకు, ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు నిరాశ కలిగించే విషయం.
-బి. రామకృష్ణ

No comments:

Post a Comment