Friday, October 14, 2011

సకల జనుల సమ్మె-అణచివేత By పొఫెసర్ హరగోపాల్ Namasethe telangana 15/10/2011

సకల జనుల సమ్మె-అణచివేత
భారత రాజ్య వ్యవస్థ ప్రజా ఉద్యమాలకు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించడం చాలా కాలం కిందటే మానుకుంది. నాలుగు ఐదు దశాబ్దాలు గా ఎలాంటి ఉద్యమానై్ననా అణచివేయవచ్చు అనే పరిష్కారాన్ని ఎన్నుకోవ డం వలన, పోలీసు, మిలటరీ, పారా మిలటరీ దళాల సంఖ్య వాటి మీద ఖర్చు అనూహ్య స్థాయికి చేరుకుంది. ఇంకా బలగాలను బెటాలియన్లను పెంచుతామని, అంతర్జాతీయ ఆయుధ మార్కెటుకు బాసటగా నిలుస్తామని నిరంతరంగా వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ఉద్యమాలు ఉధృతంగా జరగడానికి, వీటిని నిరోధించలేకపోవడానికి ఆధునిక ఆయుధాల కొరతను ఒక కారణంగా చెబుతున్నారు. ప్రజాస్వామ్యమంటే అతి స్వల్ప బలవూపయోగంతో కూడిన పాలన అనే అవగాహన ఎక్కువగా కనిపించడం లేదు. ఎవ్వరు కూడా ఇంత బలవూపయోగం రాజ్యానికి ఎందుకు అవసరమని కాని, ప్రజల అసంతృప్తికి మూల కారణాలను వెతకడం కాని చేయడం లేదు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేశ్ మావోయిస్టు ఉద్యమం మీద చేసిన ఒక ప్రసం గం ‘హిందూ’ ఆంగ్ల దిన పత్రికలో (14-10-2011పచురితమైంది. ఆయ న ఆలోచన హోంమినిస్టర్ చిదంబరం ఆలోచనకు కాస్త భిన్నంగా ఉంది. అంటే ఆయన అణచివేత వద్దని అన్నారని కాదు. అణచివేతతో పాటు గిరిజనుల అభివృద్ధి గురించి కూడా ఆలోచించాలి అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే పెద్ద ‘విప్లవాత్మక ఆలోచన’గా అగుపిస్తుంది. ‘స్వాతంత్య్రం’ వచ్చి న తర్వాత 1948 జనవరిలో గాంధీ ఒక ప్రసంగంలో మిలటరీ, పోలీసులను ఉపయోగించి చేసే ఏ పరిపాలన అయినా పరాయి పాలనే అంటూ పాలకులు ఎవరు అనే ప్రశ్న కాదు. పాలన ఎలా జరుగుతున్నది అన్నదే స్వతంత్ర దేశానికి ప్రమాణం అని అన్నారు. ఇవి ఇప్పుడు పరిపాలిస్తున్న వారి కి ఒక ‘దేశ ద్రోహి’ మాటలుగా అనిపించినా ఆశ్చర్యం లేదు.

గాంధీ మార్గాన్ని, గాంధీ పద్ధతులను వదిలివేయడమే కాక ఆ పద్ధతులను అసహ్యించుకునే ఒక పాలకవర్గం జాతీయస్థాయిలో, ప్రత్యేకంగా మన రాష్ట్రం లో చాలా బలంగా ఉన్నది. గాంధీ భవన్ పేరు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, తాము గాంధీ వాదులుగా చెబుతున్న కొందరు కాంగ్రెస్ ‘తత్వవేత్తలు’ ఒక ప్రజా ఉద్యమాన్ని ముఖ్యంగా లక్షలాది మంది, బహుశా కోట్లాది మంది శాంతియుతంగా తమ ఆకాంక్షలను వ్యక్తీకరిస్తున్న ప్రక్రియను గౌరవించి యుద్ధవూపాతిపదిక మీద స్పందించి ఉంటే ప్రజలు హర్షించేవారు. గాంధీ పద్ధతులకు సాధికారత చేకూరేది. ప్రజలకు శాంతియుత పద్ధతుల మీద విశ్వాసమేర్పడేది. ప్రజాస్వామ్యవాదులకు మావోయిస్టు ఉద్యమంతో లేదా ఇతర మిలిటెంట్ ఉద్యమాలతో వాదించడానికి ఒక అవకాశముండేది. హింసాయు త పద్ధతులను ఉపయోగించే రాజ్యాన్ని ప్రతిహింస ద్వారా మాత్రమే ప్రజలు ఎదిరించగలరు అనే రాజకీయ విశ్వాసాన్ని ఎలా ఎదుర్కొవాలి అనేది ప్రజాస్వామ్యవాదులందరికీ అదిపెద్ద సవాలుగా మిగిలింది.

మావోయిస్టు పద్ధతులను విమర్శనాత్మకంగా చూసిన బాలగోపాల్ బతికుంటే ఏమి రాసేవాడో, ఏమి మాట్లాడేవాడో తెలియదు కాని, ఒక సందర్భంలో మావోయిస్టు ఉద్య మం బలపడుతున్నది కదా అని ఒక టీవీ చానెల్ అడిగితే ‘మంచిదే కదా’ అని అన్నాడు. బహుశా ఆయనకు కూడా పాలకుల పట్ల వారి పద్ధతుల పట్ల ఏ మాత్రం విశ్వాసముండేది కాదు. అందుకే జీవితమంతా పోరాటాలవైపు నిలబడ్డాడు.
స్వాతంవూతోద్యమం తర్వాత బహుశా ఇంత అహింసాపూరిత ఉద్యమం తెలంగాణ ఉద్యమమే అయి ఉంటుంది. ఈశాన్య భారత ఉద్యమాలు, పంజా బ్ ఉద్యమం, కాశ్మీర్ ఉద్యమం, ఇలా చాలా ఉద్యమాలు హింస లేదా ప్రతిహింసతో కూడుకున్నవే. మన రాష్ట్రంలో పౌరహక్కుల ఉద్యమం దాదాపు ఒక దశాబ్ద కాలం ఈ అంశాన్ని చర్చించింది. ఈ అంశం మీద విడిపోయింది.

ప్రధానంగా జరిగిన చర్చలో ప్రతిహింసను ఉపయోగించే వారు చాలా సంయమనం పాటించాలని, మనిషి ప్రాణాన్ని గౌరవించాలని, తమ పద్ధతులను నిరంతరంగా సమీక్షించుకోవాలని, వాళ్లు కోరుకున్న కలలు కన్న వ్యవస్థ నిర్మాణం ప్రజాస్వామ్యంగా, మానవీయంగా ఉండాలని, అది నిర్మించడానికి తమ పద్ధతులను ఆ కోణం నుంచి, ఆ ప్రమాణం నుంచి పరిశీలించాలనే చర్చ చాలా లోతుగా ఘాటుగా జరిగింది. ఈ చర్చ ఒక రకం గా శాంతి చర్చలకు దారి వేసింది. అంతిమంగా శాంతి చర్చలు వాస్తవ రూపం తీసుకున్నా యి. ఒక విప్లవ పార్టీ రాజ్యంతో చర్చించడం చరివూతలో చాలా అరుదుగా జరుగుతుంది. చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర హోం మంవూతిత్వ శాఖ ఈ మధ్య కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ శాంతి చర్చలు జరపాలనుకుంటే ఆంధ్రవూపదేశ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఆ కాలంలో నక్సలైట్ పార్టీలు చాలా బలపడ్డాయని ముఖ్యంగా ల్యాండ్ మైనింగ్ విస్తృతంగా చేశారని ఒక పెద్ద మోసపు, అబద్ధపు ప్రచారాన్ని చేసింది. నిజానికి మన రాష్ట్రంలో శాంతి చర్చల వలన ఈ ఉద్యమాలు దెబ్బతిన్నాయన్నది ఒక వాస్తవం.

ఈ చర్చను పక్కకు పెట్టి శాంతియుత పద్ధతుల మీద అంత విశ్వాసము న్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పద్ధతులనే గత నెల రోజులుగా పాటిస్తూ, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసనను, తమ ఆకాంక్షను వ్యక్తీకరిస్తుంటే ఎందుకు స్పందించలేకపోతున్నాయి అనేది పెద్ద ప్రశ్న. గాంధీ పద్ధతుల ద్వారా లక్షలాది ప్రజలు తమ ‘స్వపరిపాలనను’ కోరుకుంటుంటే, లగడపాటి నిర్వహించిన ‘వందే గాంధేయం’ సదస్సుకు గులాం నబీ ఆజాద్ ఎందుకు హాజరయినట్టు? లగడపాటి సంపదకు గాంధీ నిరాడంబరతకు ఏమైనా సంబంధముందా? ఆజాద్ ఈ సదస్సుకు హాజరై లగడపాటి ధన బలం పట్ల తన ‘గౌరవాన్ని’ ప్రకటించుకోవడం తప్ప తెలంగాణ ప్రజల గాంధీయిజం ఆచరణను ఎందుకు విస్మరించినట్టు? అది ఏ సందేశాన్ని ఇచ్చినట్టు? రాజకీయాలలో హిపోక్షికసి ఉందని అందరికీ తెలుసు.

కాని దానికి ఏమైనా పరిమితులున్నాయా లేక ఇది హద్దులు దాటిన హిపోక్షికసా? దీంట్లో ప్రమాదం; ప్రజలకు ఈ రాజకీయాల పట్ల, గాంధీ శాంతియుత పద్ధతుల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం మరింత సన్నగిల్లితే అది ఎటు దారి తీస్తుందో కేంద్ర ప్రభుత్వం ఏమైనా అవగాహన చేసుకుంటున్నదా? ఆలోచిస్తున్నదా అన్నది అనుమానమే.

తెలంగాణ ఉద్యమాన్ని కటువుగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రకటించారు. పోలీసు బలగాలను పెంచారు. కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేస్తున్నారు. పోలీసు అధికారులు హోం మినిస్టర్ ప్రమేయం లేకుండా, తామే ప్రెస్ మీట్‌లు పెట్టి ప్రకటన మీద ప్రకటన చేస్తున్నారు. హింసాయుత ఉద్యమాలైతే కొంత అర్థం చేసుకోవచ్చు. ఉద్య మం వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయనేది వాస్తవమైనా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉద్యమాలు ఎలా చేయాలో పోలీస్ ఆఫీసర్లే చెప్పాలి. ఇది ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షకు ఎలా జవాబు అవుతుంది? ఎందుకు ప్రజ ల ఆకాంక్షను గుర్తించలేకపోతున్నారు, గౌరవించలేకపోతున్నారు అన్నది ప్రశ్న. అలాగే కార్మిక సంఘాలను విడదీయాలని, రైతులను విద్యుత్తు ఉద్యోగులకు వ్యతిరేకంగా, తల్లిందంవూడులను ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రభుత్వాలు ఇలాంటి చాణక్యనీతిని అవలంబించినా తెలంగాణ ప్రజలు దాన్ని బాగానే అర్థం చేసుకుంటున్నారు. రైతులైనా, ప్రయాణీకులైనా, తల్లిదంవూడులైనా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వము ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని సమీకరించడం ప్రజాస్వామ్య సంస్కృతి ఎలా అవుతుంది? ఉద్యమాల వలన ప్రజలకు అసౌకర్యం కలగడం వలన ప్రజా ప్రభుత్వం స్పందిస్తుంది అనే భావనతో ఈ నిరసన రూపాలు ముందుకు వచ్చాయి. కానీ ప్రజల అసౌకర్యాన్ని మిషగా చూపించి ఉద్యమాలను విభజించడం చాలా విచిత్ర ధోరణి. అంటే.. తమ అధికారం తప్ప ఏదీ పట్టని ప్రభుత్వాలు ఎందుకు అధికారంలో ఉన్నట్టు? అధికారం లక్ష్యం కేవలం ఆధిపత్యమేనా? లేక అది సమస్యలను పరిష్కరించడానికి ఒక సాధనమా అనే ప్రశ్న కూడా అడగవలసి ఉంటుంది. ఇలాంటి తప్పుడు పద్ధతులకు లోను కాకుండా రైతులు, ప్రయాణీకులు, తల్లిదంవూడు లు, ఇతర ఇబ్బందులకు గురై న వాళ్లు తెలంగాణ ప్రజాస్వామ్య ఆకాంక్షను గుర్తించి ఎందుకు పరిష్కరించడంలేదని అడుగుతూ అసలైన పరిష్కారాన్ని చేపట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టాలి.

అప్పుడే ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది. లేకుంటే నిరసన తెలుపుతున్న వర్గాలను చూపించి ఉద్యమాలను అణచివే సే ప్రమాదముంటుంది. అది ఏ వర్గానికి కూడా దీర్ఘ కాలంలో మంచిది కాదు.

తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వాలు తమకుండే ‘పశు బలం’తో అణచివేయవచ్చు. హైద్రాబాదులోని ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు తాత్కాలికంగా విజయాన్ని సాధించవచ్చు. పెట్టుబడి చరివూతలో ఎప్పుడు లేనంత బలంగా ఉంది. దీని విర్రవీగుడు వెనక అంతర్జాతీయ పెట్టుబడి కూడా ఉంది. ఇది కార్మికులను, రైతులను, విద్యార్థులను, ఉద్యోగస్తులను అంతకుమించి ప్రజలందరినీ ప్రజాఉద్యమాలతో పాటు అణచివేసి తమ ప్రయోజనాలను, తమ లాభాలను కాపాడుకోవాలను కుంటున్నది. అందు కే అటు ఆంధ్ర ప్రాంత ప్రజలకు, ఇటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రయోజనం లేని పరిష్కారాలను సూచిస్తున్నది. లేకుంటే హైద్రాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించమనడము ఎవరు చెప్పిన ప్రత్యామ్నాయమో, అది ఏ ప్రజల ప్రయోజనం కొరకో ఆలోచించాలి. పెట్టుబడి ప్రజా ప్రయోజనాలను దాటి తన స్వతంవూతతను చాటుకుంది. తమకు లాభాలు, ప్రజల కు లాఠీలు తూటా లు. ఇదీ ప్రజాస్వామ్యం! పెట్టుబడి రాజ్యహింస, ప్రైవేటు హింసను వ్యవస్థీకృతం చేసింది. ఈ వ్యవస్థీకృత హింసను తెలంగాణ ప్రజ లు ఎలా ఎదుర్కొంటారు అన్నది చరిత్ర తెలంగాణ ఉద్యమానికి విసిరిన సవాలు. ఉద్యమం అంతిమంగా ఏం సాధించినా, సాధించకపోయినా, సకల జనుల సమ్మె ఒక చరివూతాత్మక సంఘటనే. 
పొఫెసర్ హరగోపాల్

No comments:

Post a Comment