Thursday, August 23, 2012

మళ్లీ నిషేధ రాజకీయాలు ----ప్రొఫెసర్ హరగోపాల్



మన రాష్ట్రంలో రెవల్యూషనరీ డెమొక్షికాటిక్ సంస్థ (ఆర్‌డీఎఫ్)ను నిషేధించడం తొందరపాటు చర్యే. రాజకీయ విశ్వాసాలను, ఆ విశ్వాసాలున్న సంస్థలను నిషేధించడం మన రాష్ట్రానికి కొత్తేమీ కాదు. విప్లవ ఉద్యమాలు ముందుకు తీసుకవచ్చిన మౌలిక ప్రజా సమస్యలను పరిష్కరించలేని రాజకీయ వ్యవస్థ, ఆ మౌలిక సమస్యలను లేవనెత్తుతున్న రాజకీయాలను నిషేధించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. విప్లవ పార్టీలనే కాక పార్టీల పట్ల సానుభూతి కలిగిన సంస్థలను, వాటికి ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని పేరుపెట్టి, వాటి సాహిత్యాన్ని, పుస్తకాలను నిషేధించే ఒక అప్రజాస్వామిక సంస్కృతి రాష్ట్రంలో ఉంది. నిషేధ రాజకీయాలు భూస్వామ్య, వలసవాద పద్ధతులు. ఇలాంటి పద్ధతులకు వ్యతిరేకంగా స్వాతంవూత్యోద్యమం నడవడం వల్ల ఆ ఉద్యమంలో ముందుకు వచ్చిన ప్రజాస్వామ్య ఆకాంక్షల వెలుగులో భారత రాజ్యాంగం రూపొందించబడింది. దాదాపు రెండున్నర సంవత్సరా ల కాలం మేధోమథనం చేసి అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రూపకల్పన జరిగింది. 

స్వతంత్ర దేశంలో ప్రజలే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటార ని, ప్రజలు స్వేచ్ఛగా స్వతంవూతంగా తమ సమస్యలు చెప్పుకోవచ్చని, సంఘటితంగా సంఘాలు పెట్టుకోవచ్చని, ఉద్యమాలు చేపట్టవచ్చని రాజ్యాంగం హామీ ఇచ్చి, హక్కులు కల్పించింది. భావ ప్రకటన స్వేచ్ఛకు దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర ఉంది. సోక్రటీస్, జీసస్, గెలీలియో కోపర్నికస్, భ్రూనోల సాహసం నుంచి, లక్షలాది ప్రజల పోరాటాల నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛ ఒక వ్యవస్థీకృతమైన ప్రజాస్వామ్య విలువగా మానవ చైతన్యం లో భాగమైంది. పైన ఉదహరించిన సాహసవంతులు తమ స్వేచ్ఛ కోసం, తాము నమ్మిన విశ్వాసాల కోసం, తాము సత్యమనుకొని నమ్మిన సత్యాన్ని అప్పటి పాలకవర్గాలకు కంటగింపుగా ఉన్నా ప్రపంచానికి చాటారు. ఈ అంశం మీద నేను చాలా సందర్భాల్లో పేర్కొన్న జేఎస్ మిల్ స్వేచ్ఛ మీద రాసిన గ్రంథం ప్రామాణికం గా పరిగణింపబడుతున్నది. మానవాళి సత్యాన్వేషణలో ఉన్నప్పుడు ఎలాంటి భావాలను నిరోధించినా అది మానవ నాగరికత పరిణామ క్రమానికి ప్రమాదమని స్వేచ్ఛా సిద్ధాంతం భావిస్తుంది.

స్వాతంవూత్యోద్యమ కాలంలో మన దేశంలో ఈ విలువ చాలా ప్రసవవేదన తర్వాతే పుట్టిం ది. గాంధీ రాసిన ‘హింద్ స్వరాజ్’ను అప్ప టి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. అలాగే రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఉద్యమమే జరిగింది. ఈ కాలంలోనే భిన్న భావాలు ముందుకు వచ్చాయి. మార్క్సి స్టు సిద్ధాంతం, ఎంఎన్ రాయ్, లోహియా, డాక్టర్ అంబేద్కర్, జయవూపకాశ్ నారాయణ, అలాగే హిందూమత ఛాందసత్వానికి చెందిన సావర్కర్, గోల్వాల్‌కర్ రచనలు కూడా వచ్చాయి. మనం అన్ని భావాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ ఆ భావా లు చెప్పే స్వేచ్ఛ వాళ్లకుండాలి. అంతిమంగా ప్రజలు ముఖ్యంగా శ్రామిక జనం దేన్ని విశ్వసించి పోరాడితే ఆ విలువలు సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ మొత్తం వారసత్వం ఏమైంది? ఎక్కడ మునిగిపోయిందో అడగవలసిన అగత్యం ఏర్పడింది.

మన రాష్ట్రంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి నిషేధ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే నక్సల్బరి పోరాటాన్ని పాలకులు ఎప్పు డూ ఇది కేవలం శాంతి భద్రతల సమస్య అని భావించలేదు. పాలించే వాళ్ల కు దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో అని తెలియక కాదు. అది వాళ్లకు పూర్తి గా తెలుసు కాబట్టే ఇంత భయం. సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానత ల నుంచి, అణచివేత నుంచి ఈ ఉద్యమాలు పుట్టాయని ఏలిన వారికి తెలు సు. తెలిస్తే అసమానతలు తగ్గించవచ్చు కదా, భూమిని పంపిణీ చేయవచ్చు కదా, ఆదివాసీల హక్కులను గుర్తించి, రాజ్యాంగ స్ఫూర్తితో వాళ్ల వనరులు వాళ్లకే దక్కేలా చూడవచ్చు కదా. ఇది చేయడం స్వప్రయోజన పరులకు ఇష్టం ఉండదు. అశాంతిమయమైన హింసా ప్రపంచంలో అభవూదతతోనైనా జీవిస్తారు. కానీ కొన్ని ప్రయోజనాలనైనా వదులుకొని ఒక సజీవ శాంతియు త సమాజంలో జీవించాలనే స్పృహ వాళ్లకుండదు. విపరీతమైన ఆస్తికాంక్ష, లాభాల వేటలో ఉండే వాళ్లలోని మనిషి మాయమైపోయి ఉంటాడు. అందు కే వాళ్లు బలవూపయోగాన్ని, హింసను కోరుకుంటారు. హింసద్వారా ప్రజల ఆకాంక్షలను అణచివేయాలనుకుంటారు. అక్కడే ఆగరు. ఆ ఆలోచనలనే తుంచి వేయాలనుకుంటారు.

నిజాయితీగా ప్రశ్నలడిగే వారు చాలా భయంకరంగా కనిపిస్తారు. రోజు వాస్తవాలను వక్రీకరించే మీడియాను సృష్టించుకుంటారు.వాళ్లు రోజూ ప్రచారం చేస్తున్న సమాచారం నిజమని భ్రమింప చూస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా , అంతిమంగా మనిషి తన సామాజిక అనుభవం నుంచి వాస్తవాలను గ్రహిస్తాడు. ఆ అనుభవపు వెలుగులో ముందుకుపోతుంటాడు. ఆలోచనలను, భావాలను, సంస్థలను నిషేధించ డం వల్ల మార్క్స్ అన్నట్లు.. అవి పాలకులు ఆశించిన ప్రయోజనాలకు భిన్నంగా మనిషి చైతన్యాన్ని మరింత పదును చేస్తాయి. ఒక పుస్తకాన్ని నిషేధించడం వల్ల ఆ పుస్తకం చదవాలి అనే ఆసక్తి పెరుగుతుంది. ఒక సంస్థను నిషేధిస్తే, ఆ సంస్థ గురించి పట్టించుకోని వారు కూడా ఈ సంస్థను ఎందుకు నిషేధించారు అని చర్చించుకుంటారు. నిషేధాలు ఎప్పుడూ పాలకుల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పనిచేస్తాయి.

మన రాష్ట్రంలో ఇలాంటి తప్పుడు రాజకీయాలను ప్రవేశపెట్టిన వారిలో వెంగళ్‌రావు ఆద్యుడు. ఆ రోజుల్లో సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని చాలా ప్రచారం చేశారు. ఎన్‌కౌంటర్లను ప్రోత్సహిస్తే పాలక వర్గాలు సంబరపడ్డాయి. ఆయన అణచాలన్న రాజకీయాలు దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నా యి. అది దేశ భద్రతకే పెద్ద ముప్పు అని భావించేదాకా ఎదిగాయి. కానీ వెంగళ్‌రావును ఎవరు గుర్తు పెట్టుకున్నారో మనకు తెలియదు. ఆణచివేతను కొనసాగించినా, రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినందుకు ఎన్టీఆర్‌ను గుర్తుపెట్టుకున్నారు. కొంచెం వెసులుబాటు కల్పించినా జ్ఞాపకం పెట్టుకునే ఈ ప్రజల మీద దాడులు అణచివేతలు చేయడం పాలకుల అజ్ఞానం.

మన రాష్ట్రంలో నక్సలైట్ పార్టీలకు, ప్రభుత్వానికి మధ్య శాంతి చర్చలు జరిగాయని ప్రభుత్వం మరిచిపోయినా, ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఇది ‘పౌర సమాజం’ చొరవ మీద ఏడు, ఎనిమిది ఏళ్ల నిరంతర కృషి మేరకు జరిగింది. అడవి నుంచి అగ్రనాయకులు హైదరాబాద్‌లో ప్రభుత్వ అతిథులుగా ఉండి, కొన్ని మౌలికమైన అంశాలను చర్చకు పెట్టారు. అందులో ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. రాజకీయాలను, విశ్వాసాలను ప్రచారం చేసుకునే హక్కు పరిధి పెంచాలని, పాలకులు తాము రాసుకున్న రాజ్యాంగాన్నైనా గౌరవించాలని, ఆ హక్కులు ప్రజలు అనుభవించాలంటే ఒక రాజకీయ పరిస్థితిని కల్పించాలని డిమాండ్ చేశారు. పౌరస్పందన వేదిక ప్రజాస్వామ్యచోటు పరిధి పెరిగితే హింస తగ్గుతుందని చాలా బలంగా విశ్వసించి అంత పెద్ద ప్రయత్నం చేసింది. ఇంత పెద్ద ప్రయోగం జరిగిన రాష్ట్రంలో మళ్లీ రెవల్యూషనరీ డెమోక్షికటిక్ ఫ్రంట్ లాంటి జాతీయ జాతీ య సంస్థను ఏపీ పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ కింద నిషేధించడమేమిటి? ఇప్పుడు మన రాష్ట్రంలో అంత బలమైన నక్సలైట్ ఉద్య మం లేదు కదా, నక్సలైట్లు అభివృద్ధికి ఆటంకం అని ప్రచారం చేసిన వారు, ఇప్పుడు తాము పదేపదే చెబుతున్న అభివృద్ధిని చేపట్టవచ్చుకదా! ఆర్‌డీఎఫ్ లాంటి ప్రజాస్వామిక సంస్థ ముందుకు తెచ్చిన వాదనలకు జవాబు చెప్పవచ్చు కదా.

మన రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమం పూర్తిగా సమసిపోయింది అని కేంద్ర హోం మంవూతికి చెబుతున్నా మన ప్రభుత్వానికి కొందరు కవులు, రచయితలు, ప్రజాస్వామికవాదులు నిరాయుధంగా రాజకీయా లు మాట్లాడుతుంటే అంత భయమెందు కు? ఉద్యమం మళ్లీ పుంజుకోవచ్చు అని అనుకుంటే అది మళ్లీ రావలసిన అవసరం లేని పరిస్థితులు కల్పించవచ్చుకదా. నిషే ధం ప్రజల అవసరాలకు, అంతరాలకు జవాబు ఎలఅవుతుంది. ప్రపంచీకరణ సామ్రాజ్యవాద ప్రేరిత అభివృద్ధి నమూనాను అమలు చేసినంత కాలం ఉద్యమాలు ఏదో రూపంలో జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో వాల్‌స్ట్రీట్ ఆక్రమించుకోండి అన్న ఉద్యమం వెనక ఏ నక్సలైట్లు ఉన్నారు? అది శాంతియుత పోరాటం అని భావిస్తే, అమెరికాలో ప్రతి పౌరుడి దగ్గర ఆయుధముంది. వాళ్ల రాజ్యాంగంలోనే ఆయుధాన్ని కలిగి ఉండే హక్కును రాసుకున్నారు. అమెరికన్ ప్రజల సహనం నశిస్తే, అది సాయుధ పోరాటం గా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. 

నిజానికి ఆర్‌డీఎఫ్ మన రాష్ట్రం లో గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ఒక సభ జరిపింది. సభలో మాలాంటి వాళ్లం పాల్గొన్నాం. ఛత్తీస్‌గఢ్‌లో కలెక్టర్ అపహరణ సందర్భంలో ఈ దుర్మార్గాన్ని గురించి అడిగితే అక్కడి ముఖ్యమంత్రి గ్రీన్‌హంట్ అనేటువంటి చర్య తమ రాష్ట్రంలో లేనేలేదని అన్నాడు. లేకపోతే దాని గురించి మాట్లాడేవారి విశ్వసనీయత దెబ్బతింటుంది కదా. ఆర్‌డీఎఫ్ అలాంటి సభ ఒకటి ఢిల్లీలో పోలీసుల అనుమతితో పార్లమెంటు స్ట్రీట్‌లో పెట్టింది. ఆ సభ కు హాజరైన వారిలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, ప్రజాస్వామికవాదులు, అలాగే న్యాయమూర్తి రాజేంద్ర సచార్ మాట్లాడారు. ఇంత పారదర్శకంగా పాలకులు అంటున్న ప్రజాస్వామ్య గొడుగు కింద పనిచేస్తున్న సంస్థను నిషేధించడమనేది చరివూతకు వ్యతిరేకంగా ప్రయాణించడమే. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఒక రాజకీయ స్పృహతో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని, అలా ఒత్తిడి తేవడానికి తెలంగాణ కోసం పోరాడుతున్న రాజకీయ శక్తులు కూడా కృషి చేస్తాయని ఆశిద్దాం.

ప్రొఫెసర్ హరగోపాల్
Namasete Telangana News Paper Dated : 23/08/2012

No comments:

Post a Comment