Sunday, December 18, 2011

శ్రీరాములను పొడుగు చేయకండి



AP-Map-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయనకు నివాళులర్పించాలని ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ వివాదాస్పందంగా మారింది. గతంలోలేని ఈ తంతు ఇప్పుడు ఎందుకు తలపెట్టారు? పైకి చెబుతున్నట్టు శ్రీరాములును గౌరవించడానికేనా? లేక ఆయన భుజంపై తుపాకి పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాలరాయడానికా? ఇందులో దాగిఉన్న మతలబు ఏమి టి? డిసెంబర్ 15న అసువులు బాసిన ఆయనను సమైక్యాంవూధవూపదేశ్‌కు ప్రతినిధిని చేయడమంటే పొట్టిశ్రీరాములును పొడుగుచేసి, ఆయన చరివూతను అభాసు పాలు చేయడమే. కనుక తెలంగాణ విలీనం తో ఆవిర్భవించిన ఆంధ్రవూపదేశ్ అవతరణకు ఎలాంటి సంబంధంలేని పొట్టి శ్రీరాములుకు తెలంగాణవారు ఎందుకు నివాళులర్పించాలి? దీనికి సమైక్య వలస వాదుల వద్ద సమాధానం లేదు. 

ఆంధ్రవూపదేశ్ అవతరణ దినాన్నే తెలంగాణవాదులు విద్రోహదినం గా పాటించి, నిరసిస్తున్నారని సర్కారుకు తెలుసు. అయినా సమైక్యాంధ్ర సెంటిమెంటుకు ప్రతీకగా మలచబడ్డ పొట్టిశ్రీరాములును అడ్డం పెట్టుకుని, ఆయనకు నివాళులర్పించాలని నిర్దేశించడమంటే తెలంగాణ ఉద్యోగులను ప్రత్యేక తెలంగాణ మాటెత్తకుండా చేసి, సమైక్యాంధ్ర భావానికి తలొగ్గేట్టు చేయడమే. తెలంగాణ కోసం 42 రోజుల పాటు సకల జనులు సమ్మె చేసి, వలసాంధ్ర సర్కారును స్తంభింపచేసిన తెలంగాణ ఉద్యోగుల మీద కక్షసాధించడమే అవుతుంది. డాక్టర్ చెరుకు సుధాకర్‌పై కక్ష సాధింపు ధోరణితో అక్రమ కేసులు బనాయించడం చట్టవిరుద్ధం అని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో కిరణ్‌కుమార్‌డ్డి అభాసు పాలయ్యారు.

అయినా తన సమైక్య అహంభావాన్ని చాటుకోవడానికే ఇప్పు డు పొట్టిశ్రీరాములును పావుగా వాడుకున్నాడు. ఆంధ్ర చరిత్రే తెలంగాణ చరివూతగా చిత్రించడమంటే తెలంగాణ చరివూతకు అస్తిత్వం లేకుండా చేసి, తెలంగాణపై వలసాంధ్ర ఆధిపత్యాన్ని అధిష్టించడమే అవుతుంది. ఈ వక్రబుద్ధి ఇప్పు డే కొత్తగా పుట్టిన దుర్బుద్ధి కాదు. ఇది ఆంధ్రవూపదేశ్ అవతరణ నాటి నుంచి నేటి దాకా పలురూపాల్లో కొనసాగుతూనే ఉంది. తెలంగాణను ఆంధ్రతో కలిపేటప్పు డు ఆ ఉమ్మడి రాష్ట్రానికి ‘తెలంగాణాంధ్ర’ తిలింగాంధ్ర) అని పేరు పెట్టాలని ఒప్పందం జరిగింది. అయినా పేరులో సైతం తెలంగాణ అస్తిత్వాన్ని సహించలేని వలసాంధ్ర పెత్తందారులు పార్లమెంటు పరిశీలనకు పంపిన ‘తెలంగాణాం ధ్ర’ బిల్లులో తెలంగాణ పేరు తొలగించి వలసాంధ్ర గుత్తాధిపత్యానికి నాందిపలికారు. అలా ఆంధ్ర వలసీకరణకు గురై సొంత అస్తిత్వం కోల్పోయి దగాపడ్డ తెలంగాణ ప్రజలు ‘మా తెలంగాణ మాకు కావాలి’ అని తెలంగాణ రాష్ట్రం కోసం ఉధృతంగా ఉద్యమించడంతో, బెంబేపూత్తిన వలసాంవూధవాదులు తమ తీరు మార్చుకోకుండా పేరు మార్చే కుటిల ఎత్తుగడలతో కుహనా సమైక్యాంవూధవాదాన్ని యథాతథంగా కొనసాగించే దుష్టత్వాన్ని చాటుకున్నారు. 

‘ఆంవూధవూపదేశ్ అనే దుష్ట సమాస భూయిష్టమైన పేరుకు బదులు మూడు ప్రాంతాల యావత్తు తెలుగుదేశానికి చెందిన తివేణి సంగమం లాంటి) ‘త్రిలింగాణం’ లేదా తెలంగాణ అనే పేరును స్థిరపరుస్తూ, రాజ్యాంగ సవరణకు ఉద్యమించడం తెలుగుజాతి సమైక్యతకు అవసరం’ అని సీమాంధ్ర సీనియర్ జర్నలిస్టు ఏబీకే ప్రసాద్ చేసిన ప్రతిపాదనే అందుకు నిదర్శనం. ఈ వలసాంధ్ర పెత్తందారులు తెలంగాణ అస్తిత్వానికే కాదు, రాయలసీమ అస్తిత్వానికి కూడా ఇదే గతి పట్టించారు. ‘ఆంధ్ర రాష్ట్ర’ అవతరణ జరిగే ముందు రాయలసీమ వారు ‘రాయల సీమాంధ్ర’ పేరును ప్రతిపాదించారు. దాన్ని బుట్టదాఖలు చేసి రాయలసీమపై వలసాంవూధవాదాన్ని రుద్దారు. ఇప్పుడు తెలంగాణ విడిపోయినా రాయలసీమను తమ వలసాధిపత్యం కింద ఉంచుకునే ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా రాయల ‘సీమాంధ్ర’ అనే పదాన్ని ఇటీవలే తెరమీదికి తెచ్చారు. వీరి ఆంతర్యాన్ని గ్రహించిన రాయలసీమ ప్రాంత ప్రజలు సైతం ఈ వలసాంధ్ర ఆధిపత్య శక్తులను విశ్వసించడానికి సిద్ధంగా లేరు. 

అందుకే ఈ బూటకపు సమైక్యాంవూధవాదాన్ని బుట్టధాఖలు చేస్తూ, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకాంధ్ర అవతరణ దినోత్సవం రోజున 2010 అక్టోబర్ 1న‘సామాజిక జైఆంధ్ర మహాసభ’ స్థాపించాం. అంతకుముందే 2009 డిసెంబర్‌లో సీమాంవూధలో చెలరేగిన కృత్రిమ ఉద్యమాన్ని అభిశంసిస్తూ వలస పెత్తందార్లకు వ్యతిరేకంగా డిసెంబర్ 19న గుంటూరులో భారీ ర్యాలీ నిర్వహించాం. పొట్టి శ్రీరాములు ‘సమైక్యాంవూధకు ప్రతీక కాదు-వూపత్యేకాంవూధకు ప్రతీకరా!’ అని ఎలుగెత్తి చాటాం. ఆంధ్రవూపదేశ్ అవతరణ దినోత్సవాన్ని తిరస్కరిం చి, అంబేద్కర్ స్ఫూర్తితో ‘చిన్న రాష్ట్రాల ఆవశ్యకత దినోత్సవం’గా జరిపాం. ప్రత్యేకాంవూధవాదం తరఫున తెలంగాణవాదానికి సంఘీభావం తెలపడానికి 2011 జనవరి 23న ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్’అధ్యక్షులు గద్దర్‌ను ముఖ్య అతిథిగా గుంటూరుకు ఆహ్వానించాం.

భారీ బహిరంగసభ జరిపి తెలంగాణకు జైకొట్టే సామాజిక ఆంధ్ర భేరి మోగించాం. బూటకపు సమైక్యాంధ్ర వక్రభాష్య చరిత్ర బండారాన్ని బైటపెట్టే సాహిత్యాన్ని విరివిగా వెలుగులోకి తెచ్చాం.‘అన్నదమ్ముల్లా విడిపోదాం! విడివిడిగా కలివిడిగా వుందాం, ప్రాంతాలు వేరైనా ప్రజలు వేరు కాదు!, మన గౌరమ్మ, మన బతుకమ్మలను పరస్పరం గౌరవించుకుందాం’ అని చాటి చెప్పాం. లగడపాటి లాంటి వలసాంధ్ర దురహంకార శక్తుల దాడులు, దౌర్జన్యాలను; వలసాంధ్ర పాలకుల అక్రమ కేసులు జైలు శిక్షలకు వెరవకుండా, వెనకడుగు వేయకుండా, సామాజిక ప్రత్యేకాంధ్ర సాధన కోసం సామాన్యులకు కూడగడుతున్నాం. 
తెలంగాణను విలీనం చేసుకున్న ఆంధ్రవూపదేశ్‌తో శ్రీరాములుకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఉన్నట్టు ‘అక్షికమ’ సంబంధాన్ని అంటగట్టారు. అయిదున్నర దశాబ్దాలుగా ఈ అబద్ధాన్ని నిజమని నమ్మించిన ఆంధ్ర వలసవాద అపరగోబెల్స్ దుష్ర్పచారం తె లంగాణ వారినే కాదు, ఆంధ్రవారిని కూడా ప్రభావం చేసింది.
పొట్టిశ్రీరాములు మద్రాసు నగరం కోసం మంకుపట్టుపట్టి అసువులు బాసారు. కనుక ఆయనను ప్రత్యేకాంధ్ర అవతరణకు ప్రతినిధిగా గుర్తించవచ్చు. కానీ ఆంధ్రవూపదేశ్ అవతరణకు ప్రతీకగా మాత్రం గుర్తించలేం. తమిళభాషా ప్రాంతానికి చెందిన మద్రాస్ నగరాన్ని తెలుగు భాషా ప్రాంతమైన ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి రాజధానిగా దక్కించుకోవాలనే తాపవూతయం వెనుక మద్రాసు నగరంలో ఉన్న తమ వ్యాపార ప్రయోజనాల్ని పరిరక్షించుకోవాలనే ఆంధ్రా పెట్టుబడిదారు ల, సినిమా పరిక్షిశమాధిపతుల స్వార్థ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఇది బొంబాయి నగరం విషయంలో గుజరాతీ మార్వాడీ వ్యాపారవర్గం ప్రదర్శించిన స్వార్థపరత్వం లాంటిదే. ఇప్పుడు హైదరాబాద్ నగరం విషయంలో కూడా వారిది అదే ధోరణి. ఈ స్వార్థ ప్రయోజనాల కోసమే నాడు పొట్టి శ్రీరాములను బలిపశువును చేసి, బలిపీటమెక్కించి పొట్టన పెట్టుకున్నారు.

ఆధునికంగా వెనుకబడి ఉన్న తెలంగాణను ఆంధ్రతో విలీనం చేస్తే అది వలసాంధ్ర పీడిత ప్రాంతంగా పరిణమిస్తుందని నాడే ఫజలాలీ కమిషన్ తేల్చి చెప్పింది. అయినా ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణేతర మరట్వాడ, కర్నాటక ప్రాంతాలకు చెందిన ప్రతినిధులను, విశాలాంవూధవాద తెలంగాణ కమ్యూనిస్టు ప్రతినిధులను మేనేజ్ చేసి తెలంగాణ విలీనానికి అనువుగా హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించారు. అంటే మొదటి ఎస్సార్సీ తో సంబంధంలేకుండా ముందే ఏర్పడింది. అలాగే ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం కూడా మొదటి ఎస్సార్సీతో సంబంధం లేకుండా ఏర్పడింది. అయినప్పుడు అసలు ఆంధ్రవూపదేశ్ అవతరణకు ప్రాతిపదిక ఏమిటి?సమైక్యాంవూధవాదమా?కాదు! విశాలాంవూధవాదమా? కాదు, భాషా ప్రయుక్తవాదమా? కాదు! మరేమిటి? సీమాంధ్ర వలసాంవూధవాదం. 

-ఉ.సా.
సామాజిక జైఆంధ్ర సిద్ధాంతకర్త
Namasete Telangana News Paper Dated 18/12/2011

No comments:

Post a Comment