Saturday, December 24, 2011

ఈ జీవన విధ్వంసం అగేదెన్నడు?



స్వాతంత్య్ర భారతవని ఒకవైపు అభివృద్ధి వైపు దూసుకెళ్తుంటే, అదే భారతావనిలో భాగమై నివసిస్తున్న ఆదిమజాతి తెగలకు స్వాతం త్య్రం వచ్చిందా? రాలేదా? అనే సందిగ్ధంలో వారు జీవన విధ్వంసాన్ని చవిచూస్తున్నారు. అభివృద్ధి అనే విషపుకోరల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. అమ లు కావాల్సిన రాజ్యాంగహక్కులు అమలు కాక అందాల్సిన రిజర్వేషన్లు అందక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన అభివృద్ధి నిధులు దళారులపాల వు తున్నాయి. ఆదివాసీలను అభివృద్ధి చేయడానికి రాజ్యాంగం రాష్ట్రపతి, గవర్నర్‌లకు ప్రత్యేక హక్కులను చట్టాలను కల్పించింది. ప్రత్యేక ఆర్థికనిధిని కేటాయి స్తూ అభివృద్ధి చేయమని సూచించింది. కానీ నేడు పాలకులు చేస్తున్న దేమిటి? నల్లమల్ల అట వీ ప్రాంతంలో 236, 237 జీవోలు పెట్టి రాజీవ్‌గాంధీ పులుల అభయారణ్యం పేరుతో డీబీర్స్ కంపెనీకి వజ్రాల తవ్వకానికి ఇచ్చి చెంచులను నిర్వాసితులను చేస్తున్నారు.

adivasi_0-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఖమ్మం,కరీంనగర్,వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలలో ఓపెన్ కాస్ట్ పేరుతో ఆదివాసీ ప్రాంతాలలో జీవనాధారాలను బొందపెడుతున్నారు. కుంతాల జలవిద్యుత్ కేంద్రం పేరుతో చారివూతక సాంస్కృతిక ఆధారాలను దెబ్బతీస్తున్నారు. అలాగే 41 జోన్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కవ్వాల్ అభయారణ్యం.11వందల చదరపు కి.మీ విస్తీర్ణంతో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టు వలన నేడు 40 ఆదివాసీ గ్రామాలను అడవి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారుపభుత్వం లక్ష్యం ఒక్కటే ఆదివాసీలు అడవిలో ఉన్నంత కాలం వారి ఐక్యత ముందు మనం ఏం చేయలేం. అందుకే వారిని అడవినుంచి దూరం చేస్తే అక్కడ ఉన్న ఖనిజాలను సులభంగా తవ్వుకొని కోట్ల రూపాయాలు దోచుకోవచ్చనే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు.

ఈ టైగర్ జోన్‌కు కేటాయించిన ప్రాంతంలోని ఆదివాసీ తెగలు ప్రధానంగా గోండ్, నాయక్‌పోడ్, కోలాం. ఈ తెగలు చారివూతక కాలం నుంచి ఈ ప్రాంతం లో ప్రకృతితో సహజీవనం చేస్తూ అడవి జంతువులతో మమేకమై జీవిస్తున్నారు. ఇప్పుడు వీరిని పులుల రక్షణకని బయటికి పంపటం ఎంతవరకు సమంజసం? పైగా ఉన్న పళంగా గ్రామాలను వదిలి గొడ్డు గోద పిల్ల పాపలతో బతుకు దెరువు కోసం తమ ఉమ్మడి సాంస్కృతిక జీవన విధానాన్ని సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కట్టుబొట్టు, పవిత్ర దైవస్థలాలు అడవితోగల మమేకాన్ని విడిచి వెళ్ళాలి. ప్రధానంగా ఆదివాసీ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ కన్న వినియమ వ్యవస్థ (వస్తుమార్పిడి) ఎక్కువగా ఉంటుంది. స్వార్థపూరిత దళారీ వ్యవస్థతో కూడిన మైదాన ప్రాంతంలో ఆదివాసీల జీవనం ఆగమ్యగోచరంగా మారుతుంది. వారికి ఉపాధి కరువవుతుంది.

ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం పేరుతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తిని ఒక కుటుంబంగా పరిగణించి10 లక్షలు చెల్లిస్తామని ప్రకటించింది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బు 68 కోట్లు. 40 గ్రామాలలో నిర్వాసితులయ్యే కుటుంబాలు 1000 వరకు ఉంటాయి. ఈ కుటుంబాలలో 18 ఏళ్లు నిండిన వారిని ముగ్గురి చొప్పున లెక్కించినా 3వేల మందికి 300 కోట్ల రూపాయాలు కావాలి. మరి ప్రభుత్వం నిర్వాసితులకు అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? ఈ ప్రాజెక్టును ఎలా అభివృద్ధి చేస్తుం ది అనేది స్పష్టం చేయాలి. ఈ కాకి లెక్కలన్ని ప్రభుత్వం ఆదివాసీలు అమాయకులని చెబుతుందా? లేక సమాజం గుడ్డిదని చెబుతుందా అర్థం కావఒకవేళ 10 లక్షల నష్టపరిహారం అందినా సర్వం కోల్పోతున్న ఆదివాసీలు ఎంతకాలం నాణ్యమైన జీవనాన్ని గడపగలరు.నిజంగా వారు గ్రామాలను వదిలిన తరువాత పునరావాసం, నష్టపరిహారం అందుతుందన్న గ్యారంటీ లేదు.

ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఆదివాసీలు మోసపోవటం కొత్తకాదు. ఆదిలాబాద్‌లో ఓపెన్‌కాస్ట్ కింద నిర్వాసితులను చూస్తే సోముగూడెం, ఇందా రం, కాసీపేట, మందమర్రి, పెద్దపల్లి, ముత్యంపల్లి, కోమటిబెను, దుబ్బపల్లి, పెద్ద దర్గా రం, గోండ్‌గూడెం, మామిడి గుడ, ఎర్రగుంట పల్లె, పెద్దినపల్లి, సండ్రవిపాడులలో సింగరేణి అధ్యయన బృందం (సార్క్)నివేదిక ప్రకారం 300 మీట ర్ల లోతు 250 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్వహించే గని వల్ల కనీసం 10 కిలోమీటర్ల భూగర్భ జలాలు గనిలోకి చేరుతాయి. దీనివల్ల 10 కిలోమీటర్ల పరిధిలోని సాగునీటి వనరులు విధ్వంసం అవుతాయి. 10వేల ఎకరాల వ్యవసాయ భూమి కుంటుపడుతుంది. ఇదిగాక డోర్లి-1,డోరి-2, అప్పార్, కైరిగూడలది ఇదే పరిస్థితి. ఇంత పెను ప్రమాదం జరిగినా వీరికి ఇప్పటి వరకు నష్టపరిహారం అంటే తెలియదు. వీరు సర్వం కోల్పోయి దిన దిన గండంగా గడుపుతున్నారు. అదేవిధంగా దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ కింద ఆదివాసీల భూములను తీసుకొని నష్టపరిహారం ఇస్తాం. కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని భ్రమపెట్టి 400 ఎకరాలు తీసుకుని ఇప్పుడు 13 వందల ఎకరాలు ఆక్రమించుకున్నారు.

ఇక్కడి స్థానిక పెద్దలను అడిగితే తెలిసింది ఏమిటంటే గతంలో పులులు ఉండేవి గాని ప్రస్తుతం లేవు. 30 ఏళ్ళుగా ఫారెస్టు అధికారుల నిర్లక్ష్యం, అవినీ తి అక్రమాలు కలప స్మగ్లర్ల వలన ఈ అడవి అంతరించిపోయింది. దీంతో పులు లు కూడా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ లాంటి దట్టమైన అటవీ ప్రాంతంలోకి వలసపోయాయి. కాని ఇక్కడ పులులు నివసించే సౌకర్యం లేకున్నా ఫారెస్టు అధికారులు 2 పెద్డ పులులను, 2 చిరుతపులులను, 13 వేల విష సర్పాలను కవ్వాల ప్రాంతంలో వదిలారు. ఈ విధంగా భయవూభాంతులకు గురిచేస్తే అడవులను వదిలి వెళ్ళిపోతారని ఇటువంటి అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. పైగా అటవీ అధికారులు మీరు అడవిని వదలకుంటే ఆకలితో ఉన్న పులులుమిమ్మల్ని ఆహారం దొరకక తినేస్తాయి. విషస్పరాలు చంపేస్తాయి.

అని బెదిరిస్తున్నారు. అటువంటప్పుడు పులులకు ఆహారం దొరకని ప్రదేశాన్ని టైగర్‌జోన్‌గా ఎందుకు ప్రకటించారు. అనేది అదివాసీల ప్రశ్న? కనీసం జంతువులకు ఇచ్చే విలువ ఆదివాసీలకు ఇవ్వకపోవటం వలన అంతర్యమేమిటి అని ప్రశ్నిస్తున్నా రు. ఈ టైగర్‌జోన్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేస్తోంది. 5వ షెడ్యూల్డు 6(1)వ క్లాజు ప్రకారం షెడ్యూల్డు గ్రామ హోదాను తొలిగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం తరలించే 40 గ్రామాలలో 3ఱగామాలు షెడ్యూల్డు హోదా కలిగిఉన్నాయి. 2011 పంచాయతీరాజ్ షెడ్యూల్డు ప్రాంత నిర్దేశకాల ప్రకారం 40 గ్రామాల గ్రామసభల అనుమతి తీసుకున్నాకే ఈ గ్రామాలను తరలించాల్సి వుంటుంది. అడవి హక్కుల చట్టం - 2006 సెక్ష న్(5) ప్రకారం అటవిపై జీవవైవిధ్య, వన్యవూపాణులను కాపాడుకునే హక్కు, క్యాచ్‌మెంట్ ఏరియా నీటివనరులను కాపాడుకునే, సహజ సంపద, సాంస్కృతిక ప్రదేశాలను కాపాడుకునే హక్కు సముదాయక హక్కు కల్పించింది. కాని పాలకులు వీటికి కనీస విలువ కూడా ఇవ్వటం లేదు.

ఇక్కడ పులుల సంరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన గ్రామాలను ఎందుకు తరలిస్తున్నారనేది అంతుపట్టని పరిస్థితి. నల్లమల్లలో రాజీవ్‌గాంధీ పులుల అభయారణ్యం పేరుతో వజ్రాల త్రవ్వకానికి డీబీర్స్ కంపెనీకి తాకట్టు పెట్టినట్టు ఇక్కడ ఖనిజ నిక్షేపాలు త్రవ్వకాల ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? అనే అనుమానాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి. ఆదివాసీలు తాము గ్రామాలను వదిలి వెళ్లేది లేదని, తమ గోడును వినమని వేడుకుంటున్నారు. అయినప్పటికీ పాలకులు స్పందించకుంటే రాంజీ గోండ్ పోరాటం, జోడేఘట్ కొమురం భీం పోరాటం, ఇంద్ర పోరాటాల లాగా కవ్వాల పోరాటం కూడా పునరావృత్తం అవుతుందనేది పాలకులు గుర్తెరగాలి.

- మైపతి అరుణ్ కుమార్‌

No comments:

Post a Comment