Sunday, December 11, 2011

రైతుల గోస హక్కుల ఉల్లంఘనే(నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం)



రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రైతు ఆత్మహత్యల పరంపర గురించి ఏ స్పందనా లేకుండానే మాదే అసలైన రైతు ప్రభుత్వమని, తామే విజేతలమని ముఖ్యమం త్రి హర్షాతిరేకంతో ప్రకటించారు. సరే అంతా బాగానే ఉంది. మరి ఈ రైతు ప్రభుత్వ పాలనలో ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యల రిపోర్టులు ఎందుకు వార్తాపవూతికల్లో చోటుచేసుకుంటున్నట్టు? మీడియా అంతా కలిసి ప్రభుత్వ సమర్థత ను సహించలేక ఈర్ష్యతో కక్షకట్టి అబద్ధపు వార్తలు ఇస్తున్నాయని అనుకుందా మా? లేదా రైతులే వారికున్న సవాలక్ష చిన్నాచితక కుటుంబ సమస్యలతో, వ్యవసనాలతో తమ ప్రాణాలను తామే సరదాగా తీసేసుకుంటున్నారనుకుందామా? ఏవో ఇలాంటివే కారణం అవుతాయి, కానీ, వ్యవసాయం వల్ల మాత్రం కాదని మనం అనుకోవాలి. అదే నిర్ధారణ చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు ఎఫ్‌ఐఆర్ సాక్షిగా సెలవిస్తారు. ఈ ఏడాది అక్టోబరు-నవంబర్ కాలంలో 95 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పత్రికలు, ప్రజాసంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం మాత్రం ఈ మొత్తం సంవత్సరంలోనే 71 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించింది. పైగా రైతుల ఆత్మహత్యలు తగ్గించడంలో తమ ప్రభుత్వం గణనీయంగా కృషి చేసిందని సెలవిచ్చారు కూడా.

ఒకపక్క ‘వ్యవసాయం లాభసాటిగా లేదు కాబట్టి రైతులు మరో ఉపాధివైపు తప్పనిసరిగా మళ్లాల్సిందే’ అని ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. ఇంకోవైపు ‘మాదే అసలైన రైతు ప్రభుత్వమని, రైతులను అన్ని విధాలా మేమే ఆదుకుంటున్నాం’ అని కూడా ప్రకటిస్తారు. పత్రికలు, ప్రజాసంఘాలు చెప్పిన ఆత్మహత్యల లెక్కల గురించి పక్కనపెడదాం. మీ ప్రభుత్వం అంగీకరించిన ఆత్మహత్యల సంగతేమి టి? అవి ఎందుకు జరిగినట్టు? ఆ కుటుంబాలకు ఇప్పటి వరకూ మీరందించిన సహాయం ఏమిటి? ఏ ఒక్క కుటుంబాన్నయినా ముఖ్యమంత్రి వెళ్లి పరామర్శించారా? ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను కనుక్కున్నారా? వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు జీవో 421 ద్వారా 2004 జూలై 1న ప్రకటించిన నష్టపరిహారం అందించారా? ఇతర పథకాలన్నిటిలోనూ ప్రాధాన్యం కల్పించారా? సామాన్య చిన్న రైతులు చనిపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లాలా? అని తిరిగి ప్రశ్నిస్తారేమో? మీకంటే ముందు పాలించిన వాళ్లు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు కాబట్టి మీరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా?

రైతులు ప్రాణాలు తీసుకునేంత వ్యవసాయ సంక్షోభం కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే వచ్చిందా? ఒక సంవత్సరం పంట ఎండిపోవ డం వల్లే రైతుల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోందా? అలా అనుకుంటే పొరపాటే. కొన్నేళ్లు గా వాతావరణ మార్పులతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులకు అవుతు న్న ఖర్చుల వల్ల వ్యవసాయానికి పెట్టుబడులు పెరిగి పోయాయి. ఇంకా వీటితో పాటు నకిలీ విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు కూడా రైతులను నిలువునా ముంచుతున్నాయి. పంట ల్లో వస్తున్న నష్టాలు,మద్దతు ధరలు లేకపో వడం, పెరుగుతున్న నిత్యావసర ధరలు, అనారోగ్యాలు, ఖరీదైపోయిన వైద్యం, విద్య ఇలా ఒకదానిమీద ఒకటి ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ప్రతి సంవత్సరం వేసిన పంటకు గిట్టుబాటు ధర వస్తే కుటుం బం బాగుపడుతుందనే నమ్మకంతో, పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో మరింత అప్పులోకి వెళ్లడం జరుగుతోంది. దాదాపు ప్రతి ఒక్కరికి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలపైనే అప్పు ఉంటున్నది. ఈ అప్పులేవీ ప్రభు త్వ సంస్థాగత రుణాలు కావు. బ్యాంకుల నుంచి వచ్చినవి కావు. అన్నీ కూడా అధిక వడ్డీలతో కూడుకున్న ప్రైవేట్ అప్పులు. గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన రుణ అర్హత కార్డుల స్కీమ్ ఎంతమంది కౌలురైతులకు అందిందో చెప్పగలరా? వ్యవసాయ పెట్టుబడులు, రసాయన ఎరువులు, విత్తనాల ధరలు, డీజీల్ ధరల సూచిని చూస్తే చిన్న, సన్న కారు రైతులు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నది వాస్తవం. 

పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్రవూపదేశ్‌లో చనిపోతున్న ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా కళ్ల నుంచి కారేది కన్నీళ్లు కాదు, రక్తాక్షిశువులు. ఈ పదిహేను సంవత్సరాలలో మొత్తం దేశంలో బలవంతపు చావులకు గురైన రైతుల సంఖ్య దాదాపు రెండుల లక్షల యాభైవేలకు పైనే అని జాతీయ నేర పరిశోధనా గణాంకాలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు వేసుకోవలసిన ప్రశ్న.. అనేకమంది రైతులు ఈ విధంగా తమ ప్రాణాలను తీసుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిం దని. పండించే పంట మీద భరోసా ఎందుకు లేకుండాపోతున్నది? ఈ పరిస్థితి కి కారణం ఎవరు? పరిస్థితి ఇంతవరకూ రాకుండా చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? ఈ రైతుల మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏమవుతోంది? ఈ రెండు లక్షల యాభై వేలకు పైగా మరణాల్లో ఆంధ్రవూపదేశ్ మొదటి వరుసలో ఉన్నది. ఇది సగర్వంగా చాటుకుందామా? ఇదేనా ‘అన్నపూర్ణ’ అని చెప్పుకునే మన రాష్ట్ర గొప్పతనం.

ఇవి మా ప్రభుత్వ విధానాల వల్ల జరిగినవి కావు. వేరే పార్టీ అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాల ఫలితం అని చెప్పడం వల్ల మీకు సంతృప్తిగా ఉండవచ్చు. కానీ ఇవేవీ చనిపోయిన కుటుంబాలకు ఏ మాత్రం భరోసాను అందించలేవు. బహుశా మంచి పాలకులకు ఉండాల్సిన లక్షణం ఇది కాదేమో? ఇవన్నీ అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనలు అనే మాట బహుశా మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. ఇది ప్రభుత్వ పరిపాలనా వ్యవహారం. అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా సరే అంతర్జాతీయ మానవహక్కుల ఒడంబడికల అమలుకు కట్టుబడి ఉండాలి. మీరు కుర్చీలో ఉన్నంత వరకూ మీదే బాధ్యత.

అంతర్జాతీయంగా జరిగిన అనేక మానవహక్కుల ఒడంబడికల్లో భారతదేశం భాగస్వామిగా ఉండడంతో, వాటి అమలుకు సంబంధించి ఇక్కడ చట్టాలలో కూ డా మార్పులు తీసుకురావడం జరిగింది. ‘వ్యవసాయానికి మానవహక్కులకు సంబంధం ఏమిటి’ అని మీరు ప్రశ్నించవచ్చు. ‘ది ఇంటర్‌నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ (ఐసిసిపిఆర్), 1979; ప్రకారం (భారతదేశం దీని మీద సంతకం చేసింది) జీవించే హక్కు అనేది మనిషి ప్రాథమిక హక్కు. గౌరవవూపదంగా జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులను కాపాడటం, ఉపాధి కల్పించడం, ఆహార భద్రతను కల్పించడం ఇవన్నీ దీనిలోకే వస్తాయి. ఈ హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.

ఇదొక్కటే కాకుండా ఇంకా అనేక ఒప్పందాల్లో భారతదేశం భాగస్వామి. అవి ‘ది ఇంటర్‌నేషనల్ కోవనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్’ (ఐసిఇఎన్‌సిఆర్)1979; ‘ది కన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిస్‌క్షికిమినేషన్ ఎగైనెస్ట్ ఉమెన్’ (సిఇడిఎడబ్ల్యు) 1980; ‘ది కన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌సి), 1992; ‘ది ఇంటర్ నేషనల్ కన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ రేషియెల్ డిస్‌క్షికిమినేషన్ (ఐసిఇఆర్‌డి) 1967; ఈ ఒప్పందాల్లో మన దేశం భాగస్వామిగా ఉండడమంటే ఏదో పేరుకి ఉండడం కాదు. వీటిని అమలు పరచచడంలో నిత్యం కృషి చేయాలి. అందుకు అనువైన చర్యలు తీసుకోవాలి. భారతదేశ అన్ని చట్ట సభలు, వ్యవస్థలు వీటి అమలుకు అనుగుణంగా ప్రవర్తించాలి. వీటి స్ఫూర్తికి భిన్నంగా ఏ రకమైన విధాన నిర్ణయాలు చేయకూడదు. కానీ వాస్తవంలో రైతుల జీవితాల్లో ఇవి ఎంత వరకు అమలవుతున్నాయో ప్రభుత్వమే చెప్పాలి.

దేశ ఆహారభవూదతకు ఆయువు పట్టయిన చిన్న, సన్న కారు రైతాంగానికి భరోసానిచ్చే ప్రణాళికలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి రోజురోజుకి ప్రమాదకరంగా మారుతున్నది. ఈ పరిస్థితులే రోజురోజుకు పెరుగుతున్న రైతు ల ఆత్మహత్యలకు కారణాలు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించి చిన్న, సన్న కారు రైతులకు అనుకూలమైన వ్యవసాయ విధానాలు తీసుకునివుంటే, ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకునే వాడు కాదు. బాధిత కుటుంబాల్లోని స్త్రీలు, పిల్లలు ఒంటరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. తమ భర్తల, తండ్రుల మరణాలు వ్యవసాయ సంబంధిత అప్పులతోనే జరిగాయని ‘నిజమైన రైతు ఆత్మహత్య’లుగా నిరూపించుకోవాల్సిన అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొనేవారు కాదు. మరి ఇదేనా మీ అసలైన రైతు ప్రభుత్వం రైతులపై చూపిస్తున్న సానుభూతి? రైతు ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న తీరే ఈ ప్రభుత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. రైతు కన్నీరు పెట్టిన భూమి సుభిక్షంగా ఉండదంటారు. మరి రైతు కన్నీరు పెట్టని రోజు ఒక్కటైనా ఈ పాలనలో ఉన్నదా? 

-కె. సజయ
ఫీలాన్స్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త)
(నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం) Namasete Telangana Paper Dated 10/11/2011

No comments:

Post a Comment