Wednesday, November 2, 2011

రబ్బర్‌ స్టాంప్‌ బీసీ కమిషన్‌ ఎందుకు? By రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు R Krishnaiah Surya News Paper 02/11/2011


రబ్బర్‌ స్టాంప్‌ బీసీ కమిషన్‌ ఎందుకు?
బీసీల అభివృద్ధి, రక్షణ, సమగ్ర వికాసాన్ని ఆకాంక్షించిన ‘సుప్రీంకోర్టు’ 1993 లో మండల్‌ కేసుగా ప్రసిద్ధిపొందిన ‘ఇందిరాసాహ్ని వ్యాజ్యం’లో వెలువరించిన తీర్పులో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లు ఏర్పాటుచేయాలని సూచించింది. ఆ మేరకు జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు కమిషన్లు నెల కొల్పినప్పటికి వాటికి ఎలాంటి అధికా రాలను కల్పించక పోవడంతో అవి ‘రబ్బర్‌స్టాంప్‌’ ఆర్గనైజే షన్లుగా రూ పాంతరం చెందాయి తప్ప, ఈ సామాజిక వర్గాలకు ఏ మాత్రం ఆశించినరీతిలో ప్రయోజనాలు చేకూర్చడం లేదు. మన రాష్ట్ర బీసీ కమిషన్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల కాలపరిమితి ముగిసింది. కొత్తవారిని నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

అధికారాలు లేకుండా ‘ఆచరణ’ చూపడం సాధ్యం కాదు. బీసీలకు చేదోడు- వాదోడుగా ఉండేదుకు బీసీ కమిషన్‌ చట్టాన్ని ఆమోదయోగ్యమైన సవరణలతో తీర్చి దిద్దడం అసాధ్యం కాదు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి తగు సిఫారసులతో ప్రభుత్వాలకు నిర్మాణాత్మకంగా, శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన నివేదికలను ఎప్పటికప్పుడు అందించాల్సిన బీసీ కమిషన్‌ క్రమంగా నిరూపయోగం కావడం ప్రజాస్వామ్యంలో సహేతుకం కానేరదు. ఇందుకు ప్రభుత్వ పరంగా బీసీల సంక్షే మంపట్ల చిత్తశుద్ధి లోపించడం ఒక కారణం. అంతే గాక ఈ వర్గాలకు అధికారాన్ని శాసించే స్థితికి రాక పోవడం మరో కారణం. ఉత్తర్‌ప్రదేశ్‌, సిక్కిం, కర్ణాటక, బీహర్‌ రాష్ట్రాలలో బీసీ కమిషన్‌లకు విశేష అధికారాలు కల్పిస్తూ చట్టాలను ఆయా ప్రభుత్వాలు సవరించాయి. అదే రీతిలో మన రాష్ట్ర బీసీ కమిషన్‌ ‘చట్టం- 20/ 1993’ను సవరించి బీసీ కమిషన్‌ను పటిష్ఠం చేయాల్సి ఉంది.

ఉత్తర ప్రదేశ్‌, సిక్కిం, కర్ణాటక, బీహర్‌ రాష్ట్ర ప్రభు త్వాలు అక్కడి బీసీ కమిషన్‌లకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను పర్యవేక్షించే విశేషాధికారాలను కల్పించాయి. సభ్యులుగా, ఛైర్మన్‌గా సామాజిక వేత్తలను, అలాగే ఆ వర్గాల హక్కుల కోసం పనిచేసే రాజకీయ వేత్తలను నియమించు కోవడానికి వీలుగా చట్టాల్ని సవరించుకున్నాయి. ప్రస్తుతం ఈ ఈ రాష్ట్రాల కమిషన్‌ల పనితీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది. మన రాష్ట్రంలో బీసీల సమగ్రాభివృద్ధికోసం ఏటా రూ. 2700 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తూ దేశం మొత్తానికి సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలో నిలుస్తున్నాం. ఇక్కడ ఫీజుల రియింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, హస్టళ్ళు, పం చాయతీ రాజ్‌ సంస్థలలో రిజర్వేషన్లు, పలు ప్రతిష్ఠాత్మకమైన స్కీములను ప్రవేశ పెట్టించుకున్నాం. ఇక్కడి పథకాలు అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా బీసీలు దశలవారీగా సాధించుకున్నవి.

అయితే ఈ సంక్షేమ పథకాలకు అధికా రులు తూట్లు పొడిచే చర్యలకు పాల్పడుతున్నప్పుడు సమగ్రంగా విచారించి చర్య లు చేపట్టడానికి ప్రత్యేకమైన చట్టబద్ద సంస్థ అవసరం ఉంది. బీసీ సంక్షేమ పథకాల అమలులో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసు కుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు సమీక్షిం చడం, అమలు తీరు తెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం, సమగ్రమైన అధ్యయనాలు నిర్వహించడం, సర్వేలు చేపట్టడం, ఈ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను నిశితంగా పరిశీలించడం, రిజర్వేషన్ల అమలులో లోపాలను సరిదిద్దడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయడం, ఆర్థిక సంవత్సరంకోసం ఖర్చు చేయాల్సిన నిధులకుగాను ముందస్తు ‘బడ్జెట్‌’, ఇతర ప్రణాళికలు తయారు చేయడం, అవినీతికి తావులేని విధంగా బీసీ సంక్షేమ శాఖ అమలుచేసే అన్ని పథకాలు, కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో నిఘా విభాగంగా పనిచేసే ఒక ‘పర్యవేక్షక వ్యవస్థ’ అవసరం. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు. అందుకు చట్టప్రకారం ఏర్పాటై ప్రత్యే కంగా ఉన్న ‘రాష్ట్ర బీసీ కమిషన్‌’ను ఉపయోగించుకోవాల్సిఉంది. ఈ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అధికారాలు పెంచవలసిన అవసరం ఉంది.

ప్రస్తుతం మన రాష్ట్ర బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం మినహా వేెరే అధికారాలు లేవు. అలాగే ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పిండం వంటి పరిమితాధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత చట్టం మేరకు కమిషన్‌ ఛైర్మన్‌- సభ్యులను బీసీల జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని వారిని నియమించడం వలన ‘కమిషన్‌’ పనితీరు ఆశాజనకంగా కొనసాగడంలేదు. ‘ఛైర్మన్‌’గా రిటైర్డ్‌ జడ్జీలను నియమిస్తుండం వలన వయో భారంతో వారు సరిగా పనిచేయలేక పోతున్నారు. వారికి బీసీల పట్ల అవగాహన ఉండటం కూడా అరుదు. వీరు ఆకళింపు చేసుకునేసరికే పుణ్యకాలం కాస్తా పూర్తయి. కొత్త పాలక మండలి నియామకమవుతోంది. దీంతో కొత్తపాలక మండ లి- గత పాలకమండలి నిర్ణయాలను పక్కన బెట్టి కొత్త కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది. ఇదంతా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప మరే ప్రయోజనం ఉండటం లేదు. గతంలోని జస్టిస్‌ పుట్టస్వామి అధ్వర్యంలోని కమిషన్‌, ఇటీవలే పదవీకాలం ముగిసిన జస్టిస్‌ సుబ్రహ్మణ్యం కమిషన్‌లు చేసిన తంతు ఇదే. ప్రస్తుతం కొత్త పాలకమండలి నియమకాన్ని చేపట్టడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. అందువల్ల ఇప్పుడే బీసీ కమిషన్‌కు విశేషాధికారాలు కల్పిస్తే ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది.

బీసీ వర్గాలకు చెందిన నాయకులు ప్రభుత్వాధినేతలుగా ఉన్న రాష్ట్రాలలో బీసీల సమగ్రాభివృద్ధిని కాంక్షించి ‘బీసీ కమిషన్ల’ చట్టాలను మౌలికంగా మార్పు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్లకు విశేషాధికారాలు కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం- ఇంతవరకు బీసీ కమిషన్‌ అధికారాలను విస్తృత పరచాలని యోచించకపోవడం విచారకరం. బీసీ కమిషన్‌ అంటే 50 శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహించే చట్టబద్ధమైన సంస్థగా గుర్తించకపోవడం సవతి తల్లి ప్రేమగాక మరేమవుతుంది?జాతీయ, రాష్ట్రాల పరిథుల్లో రాజ్యాంగబద్ధ హక్కులు కల్గిఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనారిటీ కమిషన్ల సభ్యులు- ఛైర్మన్ల నియామ కా లలో ఆయా సామాజిక రంగాలలో కృషిచేస్తున్న ప్రముఖుల్ని, సామా జిక వేత్తల ను, రాజనీతిజ్ఞలను నియమించే సంప్రదాయాన్ని కేంద్ర, రాష్ట్రాల ప్రభు త్వాలు అమలు చేస్తున్నాయి. కనుక మన రాష్ట్రప్రభుత్వం కూడా ఆ పద్ధతి చేపట్టాలి.

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌ చట్టం- 8/1993 ను 2001 నవంబర్‌ 12న సవరించి చట్టం- 10/2001 వెలువరించింది. ఈ సవరణ ద్వా రా ఛైర్మన్‌గా సామాజికవేత్త లేదా ఈ వర్గాలకోసం ఉద్యమ జీవితం గడిపిన రాజకీయ వేత్తను నియామకం చేసుకునే అవకాశం కలిగింది. సిక్కిం బీసీ కమిషన్‌ ఛైర్మన్‌కు అక్కడి ‘రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఛైర్మన్‌తో సమాన హోదాను ప్రభుత్వం కల్పిస్తున్నది. కమిషన్‌ సభ్యులుగా కూడా సామాజిక కార్యకర్తలను, రాజనీతి కోవిదులను నలుగురిని నియామకం చేసుకునే వీలుకలిగింది.

ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌ చట్టం- 1/1996 ను 2001, 2005, 2007 లలో మూడు సార్లు సవరించి విశేషాధికారాలను కల్పించింది. ఒక ఛైర్మన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్లను, 17 మంది సభ్యులను నియమించుకునేందుకు వీలుగా చట్టాన్ని సవరించింది. ఛైర్మన్‌కు ‘రాష్ట్ర మంత్రి’ హోదా, వైస్‌- ఛైర్మన్‌కు ‘డిప్యూటి మంత్రి’ హోదా కల్పించింది. ఛైర్మన్‌- సభ్యులుగా సామాజిక రంగాలలో నిష్ణాతులను, ప్రముఖులను నియమించే వీలు కల్పించుకుంది. అక్కడి కమిషన్‌ బీసీ ప్రజానీకం నుండి స్వీకరించిన ఫిర్యాదులపై తీర్పు వెలువరించిన సందర్భా లలో, ‘ప్రతివాది’ కమిషన్‌ నుండి నోటీస్‌ లేదా ఆదేశం అందుకున్న 10 రోజులలో స్పందించని పక్షంలో- ఐపిసి 174, 175, 176, 178, 179 180 ప్రకారం శిక్షార్హులు. అలాగే అక్కడి సంక్షేమశాఖ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని పర్య వేక్షించే అధికారం కమిషన్‌కు ఉంది. అమలు చేయని అధికారులను శిక్షించే అధి కారం ఉంది. బడ్జెట్‌ ప్రణాళికలను రూపొందించి ముందస్తు అంచనా ప్రతిపా దనలను ప్రభుత్వానికి నివేదిస్తుంది. సామాజిక అంశాల్లో దశాబ్దాలుగా పనిచేసిన ప్రముఖులను ఛైర్మన్‌- సభ్యులుగా నియామకం చేస్తున్నది.

కర్ణాటక ప్రభుత్వం బీసీ కమిషన్‌ చట్టం- 28/1995 ని 1997లో సవరించి అధికారాలు విస్తృత పర్చింది. ఛైర్మన్‌తో సహా ఐదుగురు సభ్యులుగా సామాజిక వేత్తను లేదా హై-కోర్టు జడ్జిని నియామకం చేయడానికి సవరించింది. అలాగే 5 గురు సభ్యులను నియమించుకునే వీలు కల్పించుకుంది. ఈ కమిషన్‌కూడా రిజర్వేషన్లను ఇతర పథకాలనుసమీక్షిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుంది. బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ‘సర్వే’ నివేదికలు అందచేస్తుంది. ప్రధానంగా (బీసీ) కులాల వారి గణన ప్రక్రియను శాస్రీయ పద్ధతిలో మొదలుపెట్టిన ఘనత కర్ణాటక కమిషన్‌కే దక్కుతుంది.

krushnaya
బీహర్‌ ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌ చట్టం- 12/1993 ను 1998లో సవరించి ఛైర్మన్‌, సభ్యులకు హోదాలను అక్కడి ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’తో సమానంగా వర్తింపచేస్తుంది. ఛైర్మన్‌గా ‘సామాజిక శాస్త్ర వేత్త’ లేదా బీసీల సమ స్యలపై అవగాహాన ఉన్న నాయకులను, సామాజిక దృక్పథం కలిగిన రాజకీయ ప్రముఖులను నియమించుకోవడానికి వీలుంది. సూచనలు: 1.రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజిక వేత్తను (లేదా) సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజ నీతిజ్ఞడిని నియామకం చేయడానికి కమిషన్‌ చట్టం- 20/ 1993 ను సవరించాలి. 2. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని బీసీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలును పర్యవేక్షించి, సక్రమంగా అమలు కానట్లైతే బాధ్యులపై చర్యలు చేపట్టడానికి కమిషన్‌ అధికారాలను విస్తృత పర్చాలి. 3. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల హోదాలను ఇక్కడి మన రాష్ట్ర ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ తో సమానంగా వర్తింప చేయాలి. 4.రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుల సంఖ్యను 3 నుండి 5 కి పెంచాలి. వీరిలో ఒక ‘మహిళాప్రతినిధి’ ఉండాలి. 5. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీకాల పరిమితిని 3 నుండి 5 సంవత్సరాలకు పెంచాలి.


రచయిత రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

No comments:

Post a Comment