Wednesday, December 12, 2012

ఉప ప్రణాళికలు--Sampadakiyam



దేశంలో అభ్యుదయ చట్టాలనేకం ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఆచరణకు నోచుకోకుండా ప్రజలకు అక్కరకు రాని చుట్టాలుగానే రుజువు చేసుకుంటున్నాయి. అందుచేత చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఆ చట్టాన్ని సమగ్రంగా అమలుకు నోచుకునేలా చేయడం అవసరం. దళితులు, ఆదివాసీల ఉప ప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు ప్రణాళికా నిధుల కేటాయింపు జరిగేలా చూసి అవి అందుకోసమే ఖర్చు అయ్యేలా చూడడం అత్యంత ఆవశ్యకం. 

దళితులు, ఆదివాసీలతో బాటు వెనుకబడిన తరగతుల కోసం కూడా జనాభాలో వారి దామాషాకు అనుగుణంగా ప్రణాళిక నిధులను కేటాయించి వారి వికాస అభివృద్ధుల కోసం ఖర్చు చేసినప్పుడే దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కొంతమేరకైనా అమలులోకి వచ్చినట్టు కాగలదు.ఈ వర్గాల ప్రజల జీవితాలలో వికాసం సాధించకుండా తమది ఆమ్‌ ఆద్మీ పార్టీ అని చెప్పుకునే హక్కు ఏ ఒక్క పార్టీకి ఉండదు. ముఖ్యంగా సంక్షేమానికి తిలోదకాలిచ్చి జాతీయ, అంతర్జాతీయ సంపన్న వర్గాల సేవలో తరించే విధానాలకు పట్టం కడుతున్న యుపిఎ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు అసలు ఉండదు. 

దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా షెడ్యూల్డు కులాలు, తెగల (ఎస్‌సి, ఎస్‌టి) ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించేందుకు నడుం బిగించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేము. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చొరవతో కిరణ్‌ కుమా ర్‌ రెడ్డి ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పలుసార్లు సమావేశాలు, చర్చలూ జరిపి ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేనుండడం అత్యంత హర్షించదగ్గ పరిణామం. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలకు చట్టరూపమిచ్చేం దుకు ఈ నెల 30, డిసెంబర్‌1వ తేదీలలో శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచాలని తీసుకున్న నిర్ణయమూ శ్లాఘించదగినది. ఇందుకు ముందు గా ముసాయిదాను ఆమోదించడం కోసం బుధవారంనాడు రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. శతాబ్దాల తరబడి సమాజంలో అట్టడుగున పడి ఉండి గట్టిగా నిలబడడానికి కాళ్ళ కింద నేల కూడా కరవెై ఇప్పటికీ అధ్వాన స్థితిలో కొనసాగుతున్న బహుజనులే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే బడుగు భారతమే అసలు భారతం. దేశానికి కండ, గుండె బిసి,ఎస్‌సి, ఎస్‌టిలే. అయితే అగ్రవర్ణ పాలకవర్గం విభజించి పాలించే సూత్రానికనుగుణం గా వీరిలో కొందరిని సామాజిక చట్రం వెలుపల, మరికొందరిని లోపల ఉంచి చీల్చడం జరిగింది.

ఈకారణంగా ఎస్‌సి, ఎస్టీలు ఆర్థిక దోపిడీతో బాటు తీవ్రమైన సామాజిక న్యూనతకూ గురయ్యారు, అవుతున్నారు. ఈ దారుణాన్ని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగకర్తలు ఎస్‌సి, ఎస్‌టిలకు రాజ్యాం గంలోనే ప్రత్యేక రక్షణలు కల్పించారు. వీరి సత్వరాభ్యున్నతి కోసం సానుకూల చర్యను ఉద్దేశించారు. అదే రిజర్వేషన్ల రూపంలో వీరికి ప్రత్యేక రాజ్యాంగ కవచంగా ఏర్పడింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఐదవ, ఆరవ షెడ్యూళ్ళు, దళితులు (ఎస్సీ), ఆదివాసీల (ఎస్టీలు)కు ప్రత్యేక రక్షణలు కల్పిస్తున్నాయి. రాజ్యాంగం 330 ఆర్టికల్‌ రిజర్వేషన్లను హామీ ఇస్తున్నది. ఈ ఏర్పాట్లేవీ ఈ వర్గాల సత్వర వికాస, అభివృద్ధులను సాధించలేకపోయాయని దళితుల వర్తమాన వాస్తవ స్థితిగతులు చాటుతున్నాయి. ఎస్‌సి, ఎస్టీయేతర గ్రామీణప్రజలలో మూడింట ఒకవంతుమం ది మాత్రమే భూమిలేని వారు కాగా దళిత గ్రామీణులలో మూడింట రెండు వంతులమంది భూమిలేని వారని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఎస్‌సి, ఎస్‌టియేతరులలో నాలుగో వంతు మంది దినకూలీపెై ఆధారపడి బతుకుతుండగా, ఎస్‌సి, ఎస్‌టిలలో 60 శాతం మందివి రోజు కూలీ బతుకులే. 

ఈ దుస్థితి నుంచి వీరికి వీలెైనంత తొందరగా విముక్తి సాధించడానికి వీలుగా ఆరవ ప్రణాళిక (1980-85)లోనే ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రణాళికాబద్ధ ఆర్థిక ఉన్నతిని కల్పించి, సమాజంలోని ఇతర వర్గాలతో సమాన స్థాయికి వారిని ఉత్కృష్టపరచాలన్న ఆలోచన ప్రాణం పోసుకున్నది. ఫలితంగా ఈ రెండు వర్గాలకు స్పెషల్‌ కాంపొనెంట్‌ (ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక) ప్లాన్‌ను అమలులోకి తేవాలనుకున్నారు. అది చివరికి ఉపప్రణాళికల రూపుదాల్చింది. కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి రంగాలన్నింటికీ చెందిన ప్రణాళికా నిధుల నుంచి ఎస్‌సి, ఎస్‌టిల జనాభా దామాషా మేరకు నిధులను సేకరించి ఎస్‌సి,ఎస్‌టి ఉప ప్రణాళికలను అమలు పరచాలన్న సంకల్పంతో ఈ వ్యూహం బయలుదేరింది. రాష్ట్రాలలో ఎస్‌సి, ఎస్‌టి అభివృద్ధి కార్పొరేషన్లను నోడల్‌ ఏజెన్సీలుగా ఏర్పాటు చేసి ఈ నిధుల ఖర్చును పర్యవేక్షింప చేయాలని సంకల్పించారు. ఇంత మహత్తరమైన ఆలోచన ఆచరణలో నీరుగారిపోయి ఆ నిధులు హుసేన్‌ సాగర్‌ సుందరీకరణ వంటి అమాంబాపతు పనులకు కూడా మళ్ళిపోయిన బాధాకరమైన చరిత్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నది. 

రాష్ట్రాలు ఈ ఉప ప్రణాళికలను పరిపూర్ణంగా అమలు చేస్తే, ప్రోత్సాహక గ్రాంటునివ్వాలని సంకల్పం చెప్పుకున్న కేంద్రం కూడా అత్తకు చెప్పి తెడ్డు నాకిన కోడలిని తలపిస్తూ ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రణాళికా కేటాయింపులలో భారీగా తొర్ర పెట్టింది. 2001 లెక్కల ప్రకారం జనాభాలో ఎస్‌సిలు 16.6 శాతం, ఎస్‌టిలు 8.2 శాతం ఉన్నారు (రాష్ట్ర జనాభాలోనూ వీరి దామా షా ఇలాగే ఉన్నది. ప్రస్తుతం ఈ రెండు వర్గాలూ కలిసి 28 శాతంగా ఉంటారని అంచనా) . 2006-07లో కేంద్ర ప్రణాళికా కేటాయింపు 1,65,499 కోట్ల రూపాయలు కాగా, అందులో 4.25 శాతం అనగా కేవలం 7,031.86 కోట్ల రూపాయలనే దళితుల కోసం కేటాయించారు. అలాగే 2007-08లో కేవలం 6.1 శాతం, 2010- 11లో కేవలం 8.21శాతం మాత్రమే ప్రత్యేకించారు. మన రాష్ట్రంలోనెైతే గత 19 ఏళ్ళుగా 26,000 కోట్ల రూపాయల సబ్‌ ప్లాన్‌ నిధులను ప్రభుత్వాలు దారిమళ్ళించాయి, 

అందులో నుంచి 500 కోట్ల రూపాయిలు పెట్టి దళితుల కోసం సాగుకు అనువెైన భూమిని కొనుగోలు చేసి పంచాలని, మరో 500 కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ నెలకొల్పాలని, ఎస్‌సి, ఎస్‌టి హాస్టళ్ళన్నింటినీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చాలని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానిిస్తున్నట్టుగా దళితవాడలకు కూడా ఇరవెై నాలుగు గంటలూ విద్యుత్తు సరఫరా చేయాలని అందుకుగాను బకాయి నిధులలో నుంచి 100 కోట్లు తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ వంటి సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక నుంచి రాష్ట్ర బడ్జెట్లలో ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు 28000 కోట్ల రూపాయలు కేటాయించి విధిగా వారి అభ్యున్నతికే ఖర్చు చేయాలనీ కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాలలో చట్ట రూపు ఇవ్వబోతున్న ముసాయిదాలో ఈ నిర్ణయాలు లేకపోవడం పట్ల నిరసన తెలుపుతున్నాయి.

ఈ డిమాండ్లను పట్టించుకొని అటువంటి వాటికి కార్యరూపమిచ్చినప్పుడే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో జరుపుతున్న శాసనసభ విశేష సమావేశాలకు గాని, తీసుకురాదలచుకున్న చట్టానికి గాని సార్ధకత.దేశంలో అభ్యుదయ చట్టాలనేకం ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఆచరణకు నోచుకోకుండా ప్రజలకు అక్కరకు రాని చుట్టాలుగానే రుజువు చేసుకుంటున్నాయి. అందుచేతచట్టబద్ధతకల్పించడమే కాకుండా ఆ చట్టాన్ని సమగ్రంగా అమలుకు నోచుకునేలా చేయడం అవసరం. దళితులు,ఆదివాసీల ఉప ప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు ప్రణాళికా నిధుల కేటాయింపు జరిగేలా చూసి అవి అందుకోసమే ఖర్చు అయ్యేలా చూడడం అత్యంత ఆవశ్యకం. దళితులు, ఆదివాసీలతో బాటు వెనుకబడిన తరగతుల కోసం కూడా జనాభాలో వారి దామాషాకు అనుగుణంగా ప్రణాళిక నిధుల ను కేటాయించి వారి వికాస అభివృద్ధుల కోసం ఖర్చు చేసినప్పుడే దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కొంతమేరకైనా అమలులోకి వచ్చినట్టు కాగలదు.ఈ వర్గాల ప్రజల జీవితాలలో వికాసం సాధించకుండా తమది ఆమ్‌ ఆద్మీ పార్టీ అని చెప్పుకునే హక్కు ఏ ఒక్క పార్టీకి ఉండదు. ముఖ్యంగా సంక్షేమానికి తిలోదకాలిచ్చి జాతీయ, అంతర్జాతీయ సంపన్న వర్గాల సేవలో తరించే విధానాలకు పట్టం కడుతున్న యుపిఎ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు అసలు ఉండదు.

Surya Telugu News Paper Dated: 29/11/2012 

No comments:

Post a Comment