Tuesday, December 11, 2012

ఉపప్రణాళికః చిత్తశుద్ధి--- TA Pradeep Kumar



షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం1979వ సంవత్సరంలోనే ఉపప్రణాళికను కేంద్రప్రభు త్వం రూపొందించింది. కాని యస్సీ, యస్టీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌ నిధులు, విధులు నిత్యం దారి మళ్ళుతు న్నాయి. సబ్‌ప్లాన్‌ అసలు లక్ష్యం అమలు జరగటం లేదు. దేశంలోనే యస్సీ,యస్టీల కోసం రూ పొందించిన ఉపప్రణాళిక కు చట్టబద్ధత తీసుకొనివ చ్చి న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. 1982 నుం డి 2012 ఆర్ధిక సంవత్సరంవరకు 30,990 కోట్ల నిధులు దారిమళ్ళాయనే ఒక అంచనా వుంది. ప్రణాళికా సంఘం మార్గదర్మక సూత్రాల ప్రకారం జనాభా నిష్ప త్తిని బట్టి యస్సీ, యస్టీలకు అందవలసిన నిధులు గత 22 ఏళ్ళుగా దారి మళ్ళు తూనే ఉన్నాయి. 

మొదటినుంచి కాంగ్రెస్‌పార్టీ దళితులు, గిరిజనులను మోస గిస్తూనే వస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో యస్సీ,యస్టీలు 24 శాతం మం ది ఉన్నారు. 2011- 2012 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర బడ్జెట్‌ 1,45, 000 కోట్లు. అది రేపటి ఆర్థిక సంవత్సరానికి రెట్టింపు కావచ్చు కూడా. అయితే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లోని 25 శాతం నిధులను యస్సీ, యస్టీలకు ఎలా వినియోగిస్తార నేదే ప్రశ్న. యస్సీ, యస్టీలకు సంబంధించిన పథకాల రూపకల్పన సవ్యంగా జరగ కపోతే వారికి కేటాయించిన నిధులు ఎప్పటిలాగే మురిగిపోతాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర నరసింహ అధ్యక్ష తన సబ్‌ప్లాన్‌ కమిటీ యస్సీ,యస్టీలపై చేసిన అధ్యయనం ఎట్టకేలకు శాసనసభలో పదేళ్ళ చట్టంగా ఆమోదితమైంది. 

శాసనసభలో ఈ చట్టం ఆమోదం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన ప్రయత్నం గొప్పది కావచ్చు. కానీ యస్సీ, యస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరు ఎలా వుం టుందనే ప్రశ్న ప్రజలను వేధిస్తోంది. గడచిన 22 సంవత్సరాలలో దళితులకు సం బంధించిన నిధులు దారి మళ్ళిన తీరు చూస్తూనేవున్నాం. ఇది ఇలా వుంటే బాధ్య తగల మన శాసనసభ్యులు 178 మంది సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకొచ్చే సమయంలో గైర్హాజరయ్యారు. కేవలం 116మంది మాత్రమే హాజరయ్యారు. దళితుల నిధుల్ని దొడ్డి దారిన పంది కొక్కుల్లా కాజేసిన పాలకులకు సక్రమంగా చట్టాన్ని అమలుచేసే చిత్తశుద్ధి ఎక్కడిది. ప్రభుత్వం దళిత గిరిజనులను అభివృద్ధి పథంలో ఏమాత్రం నడిపించగలదో వేచి చూడాలి. 

ఆరు దశాబ్దాలలో దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందలేదు. రెండు గ్లాసుల పద్దతి, కుల దూషణ, కులం పేరుతో హింస, దళితుల పొలాల్ని, పంటల్ని అగ్రవర్ణ ప్రజలు ఆక్రమించుకోవడం, దేవాలయ దర్శనాలకు దళితులను నిషేధించడం నేటి సమాజంలో మామూలుగానే జరుగు తున్నాయి. కేవలం రిజర్వేషన్‌లు యిచ్చి నూటికి ఒక్కణ్ణి చూపి అభివృద్ధి అంటే యిదే అనే ధోరణిలో ప్రభుత్వం వుంది. అమానుషంగా దళితులపై జరిపిన హింసకు న్యా యం ఎక్కడ దొరుకుతుంది? 2007వ సంవత్సరంలోనే డావై.యస్‌.రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్య మంత్రిగా వున్నప్పుడు దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, పొరుగు రాష్ట్రాల్లో యస్సీ, యస్టీల నిధుల వినియో గాన్ని పాటిస్తున్న విధివిధానాల్ని అధ్యయనం చేసేందుకు మన శాసనసభ్యులను పంపారు. 

యస్సీ,యస్టీ నిధులను ఏవిధంగా మన రాష్ట్రంలో వినియోగిస్తున్నారో పర్యవేక్షించేందుకు అపెక్స్‌ కమిటీని కూడా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి పాలనా అధికారాన్ని చేజిక్కించుకొన్న తరు వాత శాసన సభ్యులు యితర రాష్ట్రాల్లో జరిపిన అధ్యయనాన్ని గానీ, అపెక్స్‌ కమిటీ సిఫారసులనుగానీ పట్టించుకొన్న దాఖ లాలు లేవు. దీని ద్వారానే నోడల్‌ ఏజెన్సీ పనితీరు, ప్రభుత్వం అసలు రూపం రాష్ట్రంలోని దళితులకు తెలిసిపోయింది. చట్టం రూపంలో సబ్‌ప్లాన్‌ను రూపొం దించినా దాని పనితీరు మెరుగు పరచాల్సింది మాత్రం ప్రభుత్వం, అధికారులే. యస్సీ, యస్టీల కోసం తయారుచేసిన ఈ బిల్లుకు కాలపరిమితి విధించడం అనేది దళిత గిరిజనులను అన్యాయం చేయడమే. ఉపాధి హామీ, సమాచారహక్కు చట్టం, గృహహింస చట్టంలాంటి అనేక చట్టాలు ఈ పదేళ్ళలో వచ్చినవే. 

వాటికి ఎలాంటి కాలపరిమితి విధించ లేదు. కేవలం దళితుల్లో అవగాహన లేకపోవుట వల్లనే ఇలా చేస్తున్నారు. భవిష్యత్తులో సబ్‌ ప్లాన్‌ రద్దయినా ఆశ్చర్యం లేదు. చట్టానికి కాల పరిమితి విధించడమంటే దళితుల స్వేచ్ఛకు హద్దులు వేసినట్లే. యస్సీ, యస్టీ జనా భా ప్రాతిపదికన వారి ఆర్థిక,విద్య, జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు ఆయా వర్గాల ప్రజలకు భద్రత, సామాజిక హోదా కల్పించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దే శం. ఈ చట్టంద్వారా గొప్ప ఫలాలు సాధించవచ్చు. దళితుల భూములు వారి చేతు ల్లో లేవు. దళితుల్లో 92 శాతం మందికి భూమి లేదు. ప్రభుత్వమే దళితులకు భూమి కొనుగోలు చేసి ఇస్తే దళితులు రైతులు అయిపోయేవారు. 

వ్యవసాయ కూలీలుగా వున్న దళితులు రైతులుగా మారటమే కాదు తమ జీవన ప్రమాణాలు సైతం పెరిగే అవకాశం వుంది. వ్యవసాయ కూలీలుగా ఉన్న యస్సీలకు భూమిపై యాజ మాన్యపు హక్కులు ఏర్పడితే ముందు వారి చేతికి పాస్‌పుస్తకం అందుతుంది. అప్పుడు వారు బ్యాంకుల ద్వారా ఋణం పొందుతారు. అందుకే దళితులకు భూ పంపిణీ కార్యక్రమం అమలు చేయాలి. భూమిహక్కుని యివ్వాలి. యస్సీ, యస్టీలు చనిపోతే సమాధి చేసేందుకు శ్మశానాలు లేవు. ప్రభుత్వం పట్టుదలతో తీసుకొని వచ్చిన ఉపప్రణాళిక చట్టం 2012నందు శ్మశానాల కోసం బడ్జెట్‌ నిధులు కేటాయించాలి. 

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డు కులాలు, తెగల సబ్‌ప్లాన్‌ (ఆర్థిక వనరుల ప్రణాళిక, కేటాయింపులు- వినియోగం) చట్టం 2012 లోని ముఖ్యాంశాలు. 1. సబ్‌ప్లాన్‌ పఠిష్టంగా, పారదర్మకంగా అమలుపరిచేందుకు గాను, అన్ని ప్రభు త్వ శాఖలను పటిష్టపరచాలి. ఆర్థిక శాఖలో సబ్‌ప్లాన్‌ చట్టం కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. 2. యస్సీ,యస్టీలకు, యితర వర్గాల మధ్య ఉన్న అంత రాలను తగ్గించేలా ఆయా వర్గాలకు ప్రత్యక్ష, నాణ్యమయిన లబ్దిని కలిగే పధకాలను తయా రుచేయాలి. 3. యస్సీ,యస్టీలకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, హాబిటేషన్ల వారీ గా, బడ్జెట్‌ రూపకల్పనకు 6 నెలలముందే అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిం చాలి. బాగా వెనుకబడిన యస్సీ, యస్టీ ప్రాంతాలపై దృష్టి వుంచాలి. 

వార్షిక బడ్జె ట్‌ ఆమోదం పొందిన వెంటనే వివిధ శాఖలకు సబ్‌ప్లాన్‌లలో చూపించిన నిధుల ను విడుదల చేయాలి. 4. ఈ చట్టం అమలుకుగాను సాంఘీక, గిరిజన సం క్షేమ శాఖలు నోడల్‌ శాఖలుగా వ్యవహరిస్తాయి. ఆయా శాఖల మంత్రుల అధ్య క్షతన ఉండే కమిటీలు నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఏజెన్సీలు సబ్‌ప్లాన్‌ అమలు, పనితీరును పరిశీలించి అభివృద్ధి మండలి ఆమోదానికి పంపుతాయి. జిల్లా కలెక్టర్‌ చైర్మన్లుగా, జిల్లాస్థాయి పర్యవే క్షక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇవి జిల్లా ప్రణాళిక కమిటీలు అమలును సమీక్షి స్తాయి. 

ఈ చట్టం క్రింద కేటాయించే నిధుల దారి మళ్ళింపు గాని, ఖర్చుచేయని పక్షంలో మురిగిపోయేందుకు గాని అవకాశం ఉండదు. ఈ నిధులను ఖర్చు చేయ డంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించే అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసు కొంటారు. మంచి పనితీరు కనపరచిన అధికారులకు ప్రోత్సాహకాలిస్తారు. 5. రాష్టమ్రుఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే యస్సీ,యస్టీ అభివృద్ధి మండలి ఈ చట్టం ద్వారా సంక్రమించే అధికారాలు, విధులను పర్యవేక్షిస్తుంది. ఈ మండలి ఒక సంవత్సరంలో రెండుసార్లు సమావేశం కావాలి. ఈ మండలి ఆమోదం పొం దిన తరువాతే సబ్‌ప్లాన్‌ పథకాల నిధులను గ్రాంట్స్‌ డిమాండ్స్‌లో సబ్‌ప్లాన్‌ కోసం ప్రత్యేక పద్దులలో చూపిస్తారు. 6. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నోడల్‌ ఏజెన్సీలు సబ్‌ప్లాన్‌ అమలుతీరును పరిశీలించి అభివృద్థి మండలి ఆమోదానిి పంపుతాయి.

pradeep
అదేవిధంగా ఒక శాఖ నుండి మరో శాఖకు నిధులను బదలాయింపు చేసేందుకు ఎదురయ్యే అవరోధాలను గుర్తించి వాటిని అధిగమించే చర్యలను సిఫారసు చేస్తుంది. నోడల్‌ ఏజెన్సీలకు సహకరించేందుకు గాను ఆయా శాఖల పరిధిలో పరిపాలన,సాంకేతిక సహకార యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి శాఖలో సబ్‌ప్లాన్‌ సహకార యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దళితుల అభ్యున్నతి కోసం చట్టం రూపకల్పన ఎలా వున్నా అమలు తీరు లోప భూయిష్టంగా వుంటే దళిత, గిరిజన, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేకూరదు. నాణ్యమైన పాలన అందించబడదు. చట్టం పటిష్టంగా వుండాలి. పని తీరు, అమలు గొప్పగా వుండాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు కనబడతాయి.

Surya News Paper Dated: 12/12/2012 

No comments:

Post a Comment