Thursday, April 26, 2012

గాంధీ, అంబేద్కర్, రాజ్యాంగవ్యవస్థ---పొఫెసర్ ఘంటా చక్రపాణి



ఉద్యమాలు చాలా విషయాల పట్ల మన అవగాహనను పదునెక్కిస్తా యి. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఉన్నట్టుండి తమ పెద్దలందరినీ పేరుపేరునా తలుచుకుంటున్నారు. ఒక అలిశెట్టి ప్రభాకర్‌ను, ఒక సాహూను వారి మిత్రులు స్మరించుకున్నట్టే కొమురం భీమ్ జయంతిని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఘనంగా జరుపుకున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత నాటి తెలంగాణ యువతరం కథానాయకుడు జార్జిడ్డిని మళ్ళీ జనంలోకి తెచ్చి యువతరానికి వీరులంటే ఎలావుంటారో పరిచయం చేశారు. అదేవిధంగా ఈ సారి డాక్టర్ అంబేద్కర్‌ను కూడా స్మరించుకున్నారు. రెండేళ్ళ నిరంతర పోరాటం అంబేద్కర్ గురించిన అవగాహనను పెంచింది. ఈసారి హైదరాబాద్‌లో అంబేద్కర్ జయంతి జాతరను తలపించింది. దానికి తెలంగాణవాదం కూడా కారణం. అంబేద్కర్ అంటే కేవలం దళితుల నాయకుడు మాత్రమే అన్న ప్రచారం, ఆయన బతికున్న కాలంలోనే మొదలై ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఆయనను చదువుతున్నవాళ్ళు ఆ ఆలోచనలనుంచి బయటపడుతున్నారు. అందులో తెలంగాణ ప్రజానీకం కూడా ఉండ డం మంచి పరిణామం. తెలంగాణ ఉద్యమం వల్ల ప్రజలకు కొద్దో గొప్పో రాజ్యాంగ పరిజ్ఞానం అబ్బింది. ఇప్పుడు మన ఊళ్ళల్లో మూడో తరగతి చదివే పిల్లలకు కూడా రాజ్యాంగంలోని మూడవ ఆర్టికల్‌లో ఏముందో తెలిసిపోయింది. అంబేద్కర్ చిన్న రాష్ట్రాల గురించి ఏమన్నాడో వాళ్ళు చెప్పేస్తున్నారు. ఈ అవగాహన వల్లే ప్రజలు ఇంకా రాజ్యాంగం మీద చట్టసభల మీద నమ్మకంతో ప్రత్యేక రాష్ట్రం కోసం అలసటలేని పోరాటం చేస్తున్నారు. అంబేద్కర్ ఆచరణలో చూపిన మార్గాన్నే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనుసరిస్తోంది. బహుశా అదే శాసన సభ ఆవరణలో అంబేద్కర్ విగ్ర హం ప్రతిష్టించాలనే డిమాండ్‌కు కారణమైంది. 

ఈ డిమాండ్‌ను తెలంగాణవాదులు తెరమీదికి తేవడానికి ఆయన పట్ల ఈ ప్రాంత ప్రజలకు ఏర్పడ్డ గురి కూడా కారణం కావొచ్చు. విగ్రహాలతో సమాజంలో మహనీయుల పట్ల గౌరవం పెరుగుతుందన్న భ్రమలు నాకేమీ లేకపోయినా తెలంగాణ ఉద్య మం విగ్రహాలను ఆత్మగౌరవ ప్రతీకలుగా మార్చివేసిన సందర్భంలో అంబేద్కర్ విగ్రహం కోసం డిమాండ్ చేయడం న్యాయమైనదని నమ్ముతున్నాను. అయితే రాజకీయ నాయకులు చెబుతున్నట్టుగా అంబేద్కర్ కేవలం దళిత వర్గాలకే నాయకుడని నేననుకోను. ఆయన తరతరాలుగా దాస్యంలో మగ్గిన భారతీయ మహిళలకు విముక్తిని ప్రసాదించిన దార్శనికుడు. ఈ దేశం లో పుట్టిన ప్రతి శిశువుకూ నిర్బంధ ఉచిత విద్య ఉండాలని వాదించిన మేధావి. కార్మికులకు కనీస హక్కులుండాలని, వాటి సాధనకోసం సంఘటితమయ్యే అవకాశాలు ఉండాలని చట్టాన్ని రూపొందించిన శ్రామిక వర్గ పక్షపాతి. భారతదేశంలో సమానత్వం రావాలంటే భూములను జాతీయం చేసి వ్యవసాయాన్ని పరిక్షిశమగా గుర్తించాలని ప్రతిపాదించిన ధీశాలి. భారత దేశంలో బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, శాంతి సౌభాగ్యాలతో సమసమాజంగా విలసిల్లాలని కలలుగన్న స్వాప్నికుడు. ఆ కలలను నిజం చేసేందుకు తన అనుభవాన్ని, అధ్యయనాన్ని కలబోసి సమక్షిగమైన రాజ్యాంగాన్ని అందించిన శాసనకర్త! ఈ దేశంకోసం, దేశంలోని ప్రజలకోసం, భవిష్యతు కోసం అంబేద్కర్ అంతగా శ్రమించి, రాజ్యాంగ శాసన వ్యవస్థలను ప్రభావితం చేసిన నాయకుడు ఇంకొకరు పుట్టలేదు. తన నల భై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇరవై ఏళ్ళు గతాన్ని సవరించడానికి మరో ఇరవై ఏళ్ళు భవిష్యత్తును నిర్మించడానికి ఆయన వెచ్చించారు. అంబేద్కర్ ఈ దేశపు రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆ రాజ్యాంగ వ్యవస్థకు ప్రతిరూపమైన చట్టసభల ముందు అంబేద్కర్ విగ్రహం కచ్చితంగా ఉండి తీరాలి.

ఇప్పుడున్న చట్ట సభలైన పార్లమెంటు, శాసన సభల రూపురేఖలు, విధివిధానాలు రూపొందించింది ఆయనే. అసలైతే ఒక్క అంబేద్కర్ విగ్రహమే ఉండాలి!
కానీ హైదరాబాద్ నగరపు నడిబొడ్డున ఉన్న ఆంధ్రవూపదేశ్ శాసనసభ ముందు గంభీర మౌనమువూదలో కూర్చున్న గాంధీ విగ్రహమే కనిపిస్తుంది. ఇరవైండు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం 1988లో ఏర్పాటు చేసింది. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా గాంధీకి శాసనసభకు ఉన్న సంబంధం ఏమిటన్న అనుమానం కలుగుతుంది. రాజ్యాంగానికి, శాసన వ్యవస్థకు, చట్టబద్ధ పరిపాలనకు రూపశిల్పి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని శాసనసభ ఆవరణలో పెట్టడానికి ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం అవలంబిస్తోన్న వ్యతిరేకత చూసిన తరువాత ఈ ప్రశ్న లేవనెత్తక తప్పడం లేదు. హైదరాబాద్‌తో పరిచయంగానీ, ఈ ప్రాంతంతో సంబంధంగానీ లేని అనేకమంది విగ్రహాలు టాంక్‌బండ్ మీద ఉన్నట్టే చట్టసభలతో పరిచయం గానీ, వాటిల్లో ప్రవేశానుభవంగానీ కనీసం చట్టాల పట్ల గౌరవంగానీ లేని గాంధీ విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఉండడంలో ఔచిత్యం అర్థం కాదు. గాంధీజీ గొప్ప నాయకుడే. స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో ఆయన ముఖ్యులు. దేశమంతా పర్యటించి జాతీయభావాన్ని విస్తరించడంలో గాంధీజీ పాత్ర విస్మరించలేనిది. ఆయన పేరుమీద దేశంలో అనేక వాడలు, రహదారులు మొదలు మహానగరాలే వెలిశాయి. ఆయన విగ్రహాలు వీధివీధినా కనిపిస్తాయి. కానీ గాంధీకి శాసనవ్యవస్థకు ఎలాంటి సంబంధ మూ లేదు. అసలు ఆయనకు ఇప్పుడున్నరాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం కూడా లేదు. గాంధీ ఇప్పటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కంటే ధర్మకర్తల్లాంటి పాలకులుండే ఆదర్శవాద గ్రామ స్వరాజ్య నమూనాను కలగన్నాడు. గాంధీ గ్రామీణ వ్యవస్థలో పెత్తందారీ కర్రపెత్తనం ఉండాలనుకున్నాడు కానీ సార్వవూతిక ఓటింగును సమర్థించలేదు. 

ఆయన పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ఇష్టపడ్డాడు. ప్రజాస్వామ్యం గ్రామంలో పెద్దమనుషులను ఎన్నుకుంటే, ఆ పెద్దమనుషులు పై స్థాయి పాలకులను ఎన్నుకోవాలని కోరుకున్నాడు. కానీ ఆ పెత్తందారీ వ్యవస్థను తుత్తునియలు చేసే సాధనంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మలిచాడు. రాజ్యాంగం అమాలౌతున్నదా? లేదా అన్నది వేరే చర్చ కానీ ఇప్పటికీ ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసి నడిపించేది రాజ్యాంగమే! రాజ్యాంగ రచన కోసం అంబేద్కర్ దాదాపు మూడేళ్ల తన విలువైన జీవిత కాలాన్ని వెచ్చించాడు. రాజ్యాంగ రచనా సంఘ సారథిగా ఆయన రాత్రింబవళ్ళు కృషి చేశారు. కానీ గాంధీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ వారసులమని చెప్పుకునే వారు ఇప్పుడు దాన్నొక చిత్తుకాగితంగా మార్చేశారు. అంబేద్కర్ శాసనం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలకు అనుకూలంగా మలచాలని ప్రయత్నించాడు. పెత్తందారీ ధర్మకర్తలకంటే చట్టం, న్యాయం మాత్రమే ధర్మాన్ని నిలబెడుతుందని నమ్మాడు.

ముఖ్యంగా అప్పటి బ్రిటీష్ పాలకుల మీద తన ఒత్తిడిని పెంచి పాలనా వ్యవస్థను ప్రజాస్వామీకరించే ప్రయత్నం చేశాడు. బ్రిటీష్ పాలనాకాలంలో అప్పటి పాలకులకు ఈ దేశం గురించి, దేశంలోని ప్రజల సమస్యల గురించి, ప్రాథమిక అవసరాల గురించి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, చేయాల్సిన చట్టాల గురించి మొట్టమొదటిసారిగా సమక్షిగంగా నివేదించిన వారిలో అంబేద్కర్ ఆద్యుడు. అప్పట్లో భారతీయ పరిపాలనా వ్యవస్థను మానవీకరించాలని గానీ, రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామీకరించాలని గానీ ఏ ఒక్కరూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే గాంధీ లండన్‌లో చదువు పూర్తిచేసుకుని తిరిగిరాగానే దేశం గురించి ఆలోచించలేదు. రాజ్‌కోట్ కోర్టులో ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అది సరిగా నడవకపోయేసరికి దక్షిణావూఫికాలో గుజరాతీ షావుకార్ల తరఫున వాదించడానికి డర్బన్ వెళ్లి అక్కడే దాదాపు ఇరవై ఏళ్ళకు పైగా ప్రాక్టీసు చేస్తూ స్థిరపడ్డాడు. అంబేద్కర్ అలా చేయలేదు. దేశీయ పాలకుల సహాయంతో విదేశాలకు వెళ్లి చదువు పూర్తికాగానే తిరిగి వచ్చిన వెంటనే సామాజిక వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కట్టాడు. అందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాడు. దాదాపు ఇరవయ్యేళ్ళ పాటు న్యాయవాదిగా, పాత్రికేయుడిగా, ప్రొఫెసర్‌గా ఉంటూ అనేక ఉద్యమాలను నిర్మించాడు. సమాజంలో పేరుకుపోయిన దురాచారాలను చట్టాలద్వారా రూపుమాపగలమని నమ్మాడు. అందుకోసం బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించి బ్రిటీష్ పాలకులను ఆలోచించే విధంగా చేశాడు. 

1919లో బ్రిటీష్ ప్రభుత్వం పాలనా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన మాంట్-ఫోర్డ్ కమిటీ అంబేద్కర్‌ను సంప్రదించింది. కమిటీ ముందు ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు, సార్వవూతిక ఓటింగ్ గురించే కాక భారతీయ సమాజంలో ఉన్న అసమానతలు, విద్యావకాశాల ఆవశ్యకత, సాంఘి క సంస్కరణలు, తేవాల్సిన శాసనాల గురించి సమక్షిగమైన నివేదిక అందించారు. భారత దేశానికి చట్టాలు చేసేముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలన్న ప్రతిపాదన చేశారు. ఆ తరువాత 1925లో భారత దేశ ద్రవ్య వినిమయ విధానంలోని సమస్యలను అధ్యయనం చేయడానికి వచ్చిన రాయల్ కమిషన్ ముందు హాజరై తన ఆలోచనలు పంచుకున్నాడు. అప్పుడే ఆయ న ఉమ్మడి వ్యవసాయం, భూమిశిస్తు విధానం, భూసంస్కరణల గురించి ప్రతిపాదనలు చేశారు. అదే కాలంలో ఆయన బొంబాయిలో చట్టసభలో క్రియాశీల పాత్ర పోషించాడు. ఆ తరువాత చట్టబద్ధ పరిపాలనను అందించే రాజ్యాంగ నిర్మాణం కోసం 1928లో వచ్చిన సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పిలుపునిచ్చింది.అప్పటికి కాంగెస్ స్వాతంత్య్రం కోసం తీర్మానం చేయలేదు. అయినప్పటికీ కమిషన్‌లో భారతీయులకు ప్రాతినిధ్యం లేదని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన లేవదీసింది. అంబేద్కర్ మాత్రం పూణెలో కమిషన్ ముందు హాజరై భారత దేశంలో రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉండాలో నివేదిక అందించారు. అందులో సార్వవూతిక ఓటు హక్కుతో పాటు, అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాదేశిక నియోజక వర్గాల ప్రస్తావన ఒకటి. కమిషన్ అంబేద్కర్ సూచనలేవీ పరిగణలోకి తీసుకోకపోవడంతో ఆయన లండన్‌లో నిర్వహించిన రెండు రౌండ్ సమావేశాలకు హాజరై తన వాదనలు వినిపించాడు.దాదాపు ఐదేళ్ళు పోరాడి అంబేద్కర్ కొద్దో గొప్పో అణగారిన వర్గాలను ప్రజాస్వామ్య శాసన నిర్మాణ వ్యవస్థలో భాగస్వాములను చేయాలని ప్రయత్నిస్తే గాంధీ దాన్ని అడ్డుకోవడానికి ఎరవాడ జైలులో నిరాహార దీక్షకు దిగి చివరకు ఆ అవకాశాలు అందకుండా చేశాడు. గాంధీజీకి తన మీద, తన నాయకత్వం, ఆలోచనల మీద ఉన్న నమ్మకం చట్టాల మీద ఎన్నడూ లేదు. అనేక సార్లు ఆయన శాసన బద్ధ పాలనను వ్యతిరేకించాడు. స్వయంగా శాసనాలను ఉల్లంఘించాడు. 

శాసనోల్లంఘనకు పిలుపునిచ్చాడు. 1922-42 మధ్యకాలంలో గాంధీ అనేక సార్లు చట్టాలను ఉల్లంఘించి జైలుకు వెళ్ళాడు. ఇదంతా స్వాతంత్య్రం కోసమే అని మనం సరిపెట్టుకోవచ్చు. కానీ చట్టం ముందర ఆయన మాత్రం దోషిగానే నిలబడ్డారు. ఇదే కాలంలో సమాజాన్నిమానవీకరించే ప్రయత్నం చేస్తూనే అంబేద్కర్ దేశంలో రాజ్యాంగబద్ధ పాలనకోసం, శాసన వ్యవస్థకోసం కృషి చేసారు. బ్రిటీష్ ప్రభుత్వం భారత దేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా 1932-34 మధ్య కాలంలో విశేషమైన సేవలు అందించి, భారత దేశంలో ప్రజాస్వామిక పాలనకు బీజాలు వేశారు. అదే 1935లో భారత ప్రభుత్వ చట్టం పేరుతో భారత ప్రభుత్వ పాలనా వ్యవస్థకు స్వయంవూపతిపత్తి కల్పించి స్వతంత్ర అధికారాలను ఇచ్చింది. దేశంలో చట్టబద్ధ పాలనకు ఆస్కారం కలిగించింది. 1941 లో బ్రిటిష్ ప్రభుత్వంలో రక్షణ సలహా మండలి సభ్యుడిగా, వైస్రాయ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్‌గా ఆయన అనేక చట్టాలకు రూపకల్పన చేసారు. 

అంబేద్కర్ జీవితంలో ఎప్పుడూ విగ్రహాలను నమ్మలేదు. విగ్రహారాధననే వద్దనుకున్నాడు. కానీ తన విగ్రహాలే భవిష్యత్తులో చైతన్య ప్రతీకలుగా నిలబడతాయని, కోట్లాది మందిని ఆత్మగౌరవంతో నిలబెడతాయని ఊహిం చి ఉండడు. అంబేద్కర్ జీవితం, పోరాటం, ఆదర్శాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అంబేద్కర్‌ను గుండెల్లో నిలుపుకోవడానికి, ఆయన ఆశయాలను చిరస్థాయిగా, సజీవంగా నిలబెట్టడానికి ఇప్పుడు దేశంలో కోట్లాది మంది సిద్ధంగా ఉన్నారు. అందులో తెలంగాణ ప్రజలు కూడా కులమతాలకు అతీతంగా ఆ జాబితాలో చేరిపోయారు. ఆయన విగ్రహాలు పార్లమెంటు మొదలు గ్రామ సచివాలయం దాకా అన్ని రాజ్యాంగ వ్యవస్థల ముందు ఉండాలని కోరుకోవడం న్యాయమయిందే.కానీ ఆ చట్టసభలే రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నాయి. చట్టవ్యతిరేక శక్తులకు, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలయిపోతున్నాయి. వాటిముందు వేలెత్తి నిలదీసే అంబేద్కర్ లాంటి ఆదర్శ మూర్తి కంటే మౌనమువూదలో కూర్చుండే ఉత్సవ విగ్రహాలు ఉండడమే మంచిదేమో! 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
సమాజశాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్ : ghantapatham@gmail.com

Namasete Telangana News Paper Dated : 27/04/2012 

No comments:

Post a Comment