Thursday, March 29, 2012

ఆ ‘ఆత్మ’లను అర్థం చేసుకున్నారా?!---పొఫెసర్ ఘంటా చక్రపాణి



వరుస ఆత్మహత్యలతో మళ్ళీ తెలంగాణ అల్లకల్లోలమయింది. వరంగల్ నడి బొడ్డున భోజ్యానాయక్ వంటి ఉన్నత విద్యావంతుడు నిట్టనిలువునా కాలిపోయాడు. ఆ జ్వాలలు ఆరిపోకముందే మరో రాజమౌళి మంటల్లో మాడిపోయాడు. ఆ వెంటనే ఉప్పలయ్య... ఇలా వరుసగా రాలిపోతూనే ఉన్నారు. రాజకీయపార్టీలు, పాలకవర్గాలు చేస్తున్న మోసం భరించలేక తెలంగాణలో ఇప్పుడు అందరి గుండెలూ ఆవేదనతో రగిలిపోతున్నాయి. ఆ చావులు చూసినప్పుడు చలించిపోవడం, దుఃఖించడం మినహా వాటిని ఆపలేని నిస్సహాయతలో ఇప్పుడు తెలంగాణ సమాజం మిగిలిపోయింది. ‘సమస్య ఏదైనా, ఎంత క్లిష్టమైనదైనా చావుద్వారా పరిష్కరించడం కుదరదు. చనిపోవడమంటే సమస్యనుంచి పారిపోవడమే! ఆత్మహత్య అటువంటి పిరికితనానికి ప్రతీక లాంటిద’ని ఆత్మహత్యలను ఒక వ్యక్తిగత సమస్యగా చూసేవాళ్ళు చెప్పే మాటలివి. నిజమే సమస్య వ్యక్తిగతమైనది అయినప్పుడు ఆ సమస్యనుంచి తప్పించుకోవడానికి చనిపోవడం ఒక వైయక్తిక పరిష్కారంగా పరిగణిస్తారు. ఇక్కడ సమస్య వ్యక్తిగతమైనది కాదు. చనిపోతున్నవాళ్ళు కూడా తమ వ్యక్తిగత ఆకాంక్షల కోసం ఆత్మహత్యను ఎంచుకోవడం లేదు. తెలంగాణ ఒక విస్తృత సామాజి క ఆకాంక్ష. రాష్ట్ర సాధన అనేది తమ వ్యక్తిగత అవసరాలకంటే ఎక్కువ ప్రధానమైనదిగా భావిస్తున్నవాళ్లు, తమ సమస్యలకు ఒక పరిష్కారంగా నమ్మేవాళ్లు.. ఇంతకాలం అన్నిరకాల ప్రజాస్వామ్య మార్గాల ద్వారా తమ ఆకాంక్షను వ్యక్తపరిచారు. ఏళ్ళతరబడి జీవితం అంటేనే పోరాటమని చాటి చెప్పా రు. ఎవరినుంచీ ఎటువంటి హామీ రాక ఇప్పుడు ఆ త్మాహుతులకు ఒడిగడుతున్నారు. ఆత్మహత్యలు పరిష్కారం కాద ని పోరాడితేనే తెలంగాణ వస్తుందని ఉద్యమకారులే చెప్పడం వాళ్లకు విసుగుపుట్టిస్తోంది. ఉద్యమం ద్వారా కూడా తెలంగాణ ఎం దుకు రాలేదన్న వాళ్ళ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. సమాజంలో ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదంటే ఆ సమాజం చచ్చినట్టే లెక్క! అదే ఇవాళ అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. 

తామర తంపరల్లా ఇవాళ తెలంగాణ నిండా ఉద్యమసంస్థలు, పిడి బాకుల్లాంటి ‘జాక్’లు చాలానే పుట్టుకొచ్చాయి. ఆశ్చర్యకరంగా అందరూ రెండు మూడేళ్ళుగా వేరే పనిలేకుండా ఉద్యమమే ఊపిరిగా ఊరూరా తిరుగుతూనే ఉన్నారు. ధూమ్ ధామ్‌లతో మొదలై, మీటింగులు, యాత్రలు, గర్జనలు ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో ఏదో ఒక ఉద్యమసంస్థ తన కార్యక్షికమాలను కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు తెలంగాణ ప్రజానీకం ఒక సంఘటితశక్తిగా నిలబడింది. రెండేళ్లకు పైగా మునిగాళ్ళ మీద నిలబడే పోరాడుతోంది. ఆ ప్రజానీకానికి తెలంగాణ వచ్చి తీరుతుందన్న విశ్వాసాన్ని ఏ ఒక్క సంస్థా ఎందుకు కల్పించలేకపోయిందన్నది అర్థం కాని ప్రశ్న! మీరే ఒక్కసారి గమనించండి. ఒక సంస్థ ఎన్నికలు, ప్రజాస్వామ్యంలో విశ్వాసాల ప్రకటనకు, రాజకీయ అభివూపాయాల వ్యక్తీకరణకు ఒక అవకాశంగా చూస్తోంది. ఆ సంస్థ తెలంగాణవాదుల్ని గెలిపించడం ద్వారా వాదాన్ని వినిపించాలని అంటుం ది. మరో సంస్థ ఎన్నికలతో తెలంగాణ రాదని ఉద్యమాల ద్వారానే అది సాధ్యమని, కాబట్టి అందర్నీ ఓడించాలని పిలుపునిస్తున్నది. ఇంకొకరు ఆర్థికమూలాలను దెబ్బతీస్తే తప్ప తెలంగాణ రాదని చెప్తున్నారు. ఒకరు రాస్తారోకో అంటే, మరొకరు రైల్‌రోకో అంటున్నప్పుడు ఏమనాలో తెలియక ఇంకొకరు విమానాల రోకో అనడం కూడా ప్రజలు చూశారు. ఉద్యమాల పేరుమీద ఎవరి మనుగడ కోసం వాళ్ళు పరస్పర విరుద్ధంగా మాట్లాడుకోవడం తప్ప ఐక్య కార్యాచరణ లేకపోవడానికి కారణాలు వెతకాలి. 

ఎప్పుడైనా సరే సైద్ధాంతిక, పరస్పర విరుద్ధ రాజకీయ అభివూపాయాలు ఉన్నప్పుడు ఆ సంస్థలు కలిసి పనిచేయడానికి జాయింట్ యాక్షన్ కమిటీ (జాక్)లు ఏర్పడతాయి. కానీ తెలంగాణలో ఇప్పుడు కేంద్రస్థాయిలో కనీ సం డజను జాక్‌లు ఒక్కో విభాగంలో, రంగంలో అరడజను, ఒక్క జిల్లా లో వందలు మొత్తంగా తెలంగాణ ఉద్యమంలో వేలాదిగా జాకులు పుట్టా యి. ఇవన్నీ ఏం చేస్తున్నాయన్నది అర్థంకాని ప్రశ్న. ఈ ప్రశ్న ఎందుకు వస్తోందంటే ఇలాంటి ఆత్మాహుతులు జరిగినప్పుడు అందరూ ‘ఆత్మహత్యలు పరిష్కారం కాదు పోరాటమే మా ర్గం’ అని గంభీరమైన సంతాప సందేశాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ‘పోరాడాలి’ అని పిలుపునిస్తోన్న మీరేం చేస్తున్నారు? ప్రజలు పోరాడడం లేదని, ఉద్యమాల్లో లేరని ఎందుకు అనుకుంటున్నారు? పిలుపులు ఎవరైనా ఇవ్వగలరు. ఎవ రు ఆచరించాలి, ఎవరు జన సమీకరణ చేయాలి, ఎవరు పోరాడాలి, ఎవరు ఎవరి ఆర్థిక మూలాలను కనిపెట్టాలి, ఎవరు వాటిని దెబ్బకొట్టాలి? ఇవన్నీ నాయకత్వ స్థానంలో ఉన్న మీరే నిర్ణయించాలి. 

ఉద్యమం ఎలా ఉండాలో నిర్దేశించి నడిపించాలి. భోజ్యానాయక్ రెండున్నరేళ్లుగా అందరు తెలంగాణ విద్యార్థుల్లాగే ఉద్యమాల్లోనే ఉన్నాడు. రాజమౌళి తన ప్రాణంపోయే రోజుదాకా ఉద్యమాల్లోనే గడిపాడు. చివరగా ఆయన భోజ్యానాయక్ అంత్యక్షికియల్లో కూడా పాల్గొన్నాడు. అటువంటి ఉద్యమకారుల చావుల సందర్భం గా సంతాపం చెప్పేటప్పుడు ఇంకా పోరాడాలి అంటే ఈ జాకులను, మూకలను ఎలా అర్థం చేసుకోవాలి?! అసలు పోరాటం అంటే ఏమిటి? అన్ని పోరాట రూపాలను అద్భుతంగా ప్రయోగించిన తరువాత కూడా ఇంకా పోరాడాలంటే ఎలా? అదీ పోరాట వేదికలు నడిపిస్తోన్న నాయకులు, ఉద్యమకారులు అంటే ఏమని అర్థం? బహుశా ఇది అర్థం కాకే ‘భోజ్యా.. అంద రూ వస్తున్నారు, తెలంగాణ తెస్తమంటున్నారు..ఇంకెప్పుడు తెస్తారు?’ అన్న ప్రశ్నను తన ప్రాణం పోయేదాకా అడుగుతూనే ఉన్నాడు. దానికి ఎవరైనా సరే సమాధానం చెప్పగలరా? ఆ సమాధానం దొరకకే ఇవాళ అనేకమంది సమిధలై పోతున్నారు. ఈ సంఘాలు, సంస్థలు, జాకులు అన్నీ ఒకే గొడు గు కిందికి ఎందుకు రావడం లేదు? ఒకే ఉద్యమం, ఒకే ఉధృతి ఎందుకు లేదు? ఎవరి మనుగడ, ఎవరి ఉనికి, ఎవరి స్వార్థం వారిది. ఇటువంటి రాజకీయాలు, ఎత్తుగడలు రాజకీయ పార్టీలకు ఉంటాయి. 

కానీ కేవలం తెలంగాణ సాధన ఒక్కటే లక్ష్యం అని చెపుతున్న వారిలో ఈ వైరుధ్యాలు ఎందుకో సమాధానం దొరకదు. నాకు తెలిసినంత వరకు కోదండరామ్ నేతృత్వంలో ఉన్న రాజకీయ జేఏసీ ఒక విశాల వేదిక. బీజేపీనో, టీఆర్‌ఎస్‌నో మహబూబ్‌నగర్లో పోటీ చేయకుండా ఒప్పించడంలో కోదండరామ్ విఫలమై ఉండవచ్చు. కానీ గడిచిన పదేళ్లుగా విద్యావంతుల వేదిక నిర్మించడంలో, రెండేళ్లకుపైగా తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టడంలో ఆయనదే కీలక భూమిక. అటు హిందూ ఛాందసులు అన్న ముద్రపడ్డ బీజేపీని, ఇటు వారికి ఆగర్భ శత్రువులమని చెప్పుకునే నక్సలైటుపార్టీ మిత్రులతో సహవా సం చేయించిన వ్యక్తి అతను. ఆశ్చర్యంగా ఆయనతో, ఆయన రాజకీయ అభివూపాయాలతో చాలాకాలం ఊరేగిన వాళ్ళే ఇవాళ ఆయనకు పోటీగా కుంపట్లు వెలిగించుకుంటున్నారు. వీలయినప్పుడు తెలుగుదేశంపార్టీకి జెండాలు ఊపి, అవకాశం దొరికితే కాంగ్రెస్‌కు కండువాలు కప్పి, కుదిరితే కేసీఆర్‌తో ‘టీ’ ని, కాదంటే కిషన్‌డ్డితో కప్పు ‘కాఫీ’ని తాగేవాళ్ళు ఇప్పుడు సంఘటిత పోరాటాల గురించి, సమైక్య కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. అంతేతప్ప రెండేళ్లుగా అది ఎందుకు సాధ్యపడలేదో ఆలోచించాలి. అది జరిగి ఉంటే నిజంగానే తెలంగాణ ప్రజలకు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అయ్యేవాళ్ళు. తెలంగాణవాదుల్లోని ఈ అనైక్యతే ఇప్పుడు రాజకీయపార్టీల ఐక్యతకు ఆయిష్షు పోస్తున్నది. ఏ ప్రాంతం వాళ్ళైనా, ఏ పక్షం వాళ్లైనా, ఏ కులానికి చెందిన వాళ్లైనా తెలంగాణ వ్యతిరేకులంతా సంఘటితంగానే ఉన్నారు. కానీ ఒకే ప్రాంతానికి చెంది, ఒకే నినాదం అన్న వాళ్ళే వేయిగొంతుకలతో మాట్లాడుతున్నారు. అసలు పోరాటం వదిలేసి ఒకరిమీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. ఉద్యమకారులే ఉద్యమం వదిలేసి అసలు ఉద్యమం ఎలా ఉండాలో లెక్చర్లు దంచుతున్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుంది. 


నిజమే! ఆ ఆశతోనే సకల జనులు సమైక్యంగా పోరాడుతున్నారు. అలాంటి పోరాటాలు పతాకస్థాయి కి చేరిన ప్రతిదశలో అడ్డంగా మాట్లాడి అడ్డు తగిలిన ఉద్యమకారులూ తెలంగాణలో ఉన్నారు. అసలిప్పుడు తెలంగాణే వద్దు అంటున్న మేధావులు కూడా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఇది అయోమయానికి కారణం అవుతోంది. అది అర్థం కాకపోవడంవల్లే ఇవాళ అమాయకుల గుండెల్లో అగ్గిమండుతోంది. అది ఆర్పాల్సిన బాధ్యత ముమ్మాటికీ ఉద్యమానిది, ఉద్యమ సంస్థలదే. ఉద్యమాలు నడిపిస్తున్న వారికే ఉద్యమ గతిమీద, గమనం మీద పట్టులేకపోతే ప్రజలకు కచ్చితంగా మిగిలేది అయోమయమే! ఆ అయోమయమే ఇప్పుడు అగ్నికీలల్లో ఆవిరైపోతున్నది. 

ఈ అనైక్యత, అయోమయాన్ని ఆసరా చేసుకుని రాజకీయపార్టీలు ఇప్పు డు కొత్త రాగం ఎత్తుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇంత జటి లం కావడానికి కారణమైన రాజకీయపార్టీల అధినేతలు కూడా ఇప్పుడు చావులకు సంతాపం చెపుతున్నారు. ఆత్మహత్యలకు కారణమైన వాళ్ళే చావు లు సమస్యలకు పరిష్కారం కాదని ఉపదేశాలిస్తున్నారు. ఇది వినడానికే విడ్డూరంగా ఉన్నది. ముఖ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు సమస్య పరిష్కారానికి ప్రయత్నించకుండా ఆత్మహత్యల గురించి మాట్లాడడం బాధ్య తారాహిత్యమే తప్ప ఇంకొకటి కాదు. చనిపోయిన వాళ్ళు, చనిపోతున్న వాళ్ళు పదే పదే వేడుకుంటున్నది తెలంగాణ సంక్షోభానికి పరిష్కారం చూపించాలని. ఆ పరిష్కారం చూపే బాధ్యత ఈ రెండు పార్టీల మీద ఉన్న ది. ముందుగా కిరణ్‌కుమార్ రెడ్డి తను ఇప్పటికి ఇంకా మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న సంగతి గమనించాలి. తెలంగాణ ఆత్మాహుతులు తన ప్రభుత్వ అసమర్థతకు, ఆ ప్రభుత్వానికి వెన్నెముక అయిన కాంగ్రెస్ పార్టీ చేతగానితనానికి నిదర్శనం అన్న సంగతి గుర్తించాలి. 2009 ఎన్నికలకు ముందు రాష్ట్ర శాసనసభలో ముఖ్యమంత్రి రాజశేఖర్‌డ్డి తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేస్తే ఈ శాసనసభకు అభ్యంతరం లేదని ప్రకటించారు. అప్పు డు కిరణ్ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ఆ ప్రకటనను రికార్డు చేశారు. 2009 డిసెంబర్ ఏడున శాసనసభా పక్షాల అఖిలపక్ష సమావేశం శాసనసభాపతిగా ఆయన నేతృత్వంలో జరిగింది. ఆ సమావేశం చేసిన ఏకక్షిగీవ తీర్మానం మేర కు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 

అటు తీర్మానం పంపించి ఆ మరుసటి రోజే స్పీకర్‌గా సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాలను ఆయనే తీసుకుని పరిస్థితి గంభీరంగా ఉన్నదని కేంద్రానికి నివేదించారు. ఆ గంభీరత చల్లారిన తరువాత తెలంగాణ ప్రక్రియ కొనసాగిస్తామని, అది చల్లార్చాల్సిన బాధ్యత రాష్ట్రంలోని రాజకీయ పార్టీలదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ కిరణ్‌మీద పెడుతూ ఆయనను ముఖ్యమంవూతిగా చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకకే ఆత్మాహుతులతో ఆయన వైఖరి పట్ల నిరసన ప్రకటిస్తున్నారని ఎం దుకు అర్థం చేసుకోవడంలేదు. ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఈ చావులన్నిటికీ ఆయన బాధ్యత వహించి తీరాలి. విశ్వాసంతో ఉండండి అని చెప్పడం కాదు. అటువంటి విశ్వాసం కల్పించడం కోసం శాసన సభలో తీర్మానంచేసి పంపాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అలాగే చంద్రబాబు కూడా బహుశా మొదటిసారిగా ఆత్మహత్యల మీద మాట్లాడారు. కానీ ఆయన మాటలను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారా! తెలంగాణకు వ్యతిరేకం కాదని వేయిన్నొక రాగంలో చెపుతున్న బాబు తెలంగాణకు తమపార్టీ అనుకూలమని ఒకే ఒక ముక్క కేంద్రానికి రాసి ఉంటే ఈ సంక్షోభం ముదిరేది కాదు. ఎన్నికల్లో అనుకూలమని, ఆ తరువాత కానేకాదని తమకున్నది రెండు కళ్ళని, తనవాదం తటస్థమని మాటలు మారుస్తూ సంక్షోభానికి కారణమైన ఆ పార్టీ వైఖరిని ప్రజపూవరూ మరిచిపోలేదు. 

ఉద్యమాన్నే కాదు చివరకు ఆత్మహత్యల్లో అసువులు బాసిన వారిని కూడా అవహేళన చేసే విధంగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేతలు మాట్లాడిన మాటలు ఇంకా ప్రజలకు వినిపిస్తూనే ఉన్నాయి. అదే నేతలు ఇప్పుడు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటాం అంటున్నారు. అయ్యా! చనిపోయినవాళ్ళు మీరు ఆదుకోవాలని కోరుకోలేదు. మీ బాబు మారాలని కోరుకుంటూ ప్రాణం విడిచారు. మీకు సాధ్యమైతే ఆయనను మార్చండి. నిజంగానే చంద్రబాబు నాయుడు చనిపోతున్న యువకుల మనోభావాలు గౌరవిస్తే, ఇంకెవరూ చనిపోవద్దని కోరుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా సభా తీర్మానానికి నోటీసు ఇవ్వాలి, లేదా కేంద్రానికి పార్టీ తరఫున లేఖ ఇవ్వాలి. ఇవేవీ చేయకుండా సంతాప ప్రకటనలతో చేతులు దులుపుకోవడం భావ్యం కాదు. ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్ళ మరణ వాంగ్మూలాలు మరొక్కసారి చదవండి. వాళ్ళ చివరి మాటలను మళ్ళీ వినండి. వాళ్ళ మాటల్లో నిరాశలేదు. నిస్పృహ లేదు. నిలు నిరసన ఉంది. నిలదీసే ప్రశ్నలున్నాయి. నిప్పును రాజేసినవాళ్ళు, మంట లు ఎగదోసినవాళ్ళు, తెలంగాణను రావణకాష్టం చేసినవాళ్ళు ఆత్మపరిశీల న చేసుకోండి. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆ సమాధానాలు మాత్రమే మండిపోతున్న మనసులకు స్వాంతన చేకూరుస్తాయి. 

పొఫెసర్ ఘంటా చక్రపాణి 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
ఈ మెయిల్: ghantapatham@gmail.co

Namasete Telangana News Paper Dated : 29/03/2012 

No comments:

Post a Comment