Wednesday, September 7, 2011

సమన్యాయం పాటించకపోతే సమరమే! ----ఆర్ కృష్ణయ్య Namasethe Telangana 08/09/2011


9/7/2011 11:32:37 PM
సమన్యాయం పాటించకపోతే సమరమే!
కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా అణచివేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 2900 బీసీ కులాల్లో దాదాపు 1800 కులాలు గిరిజన సంస్కృతి గల అత్యం త వెనుకబడిన కులాలు ఈ జాబితాలో ఉనాయి. ఈ కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగంలో ని 340 ఆర్టికల్ ప్రకారం 1953లో కాక కలెల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్లను నియమించి ఈ కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయస్థితి గతులను అధ్యయనం చేశారు. ఈ కులాల అభివృద్ధి కి ఈ కమిషన్లు సిఫార్సులు చేశాయి.

కానీ ఈ సిఫార్సులను అమ లు చేయడంలేదు. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 38 సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపించడం కారణంగా బీసీ కులాల అభివృద్ధి ఆగిపోయింది. దేశం అభివృద్ధి చెందుతోంది అంటూ.. అభివృద్ధి ఫలాల్లో బీసీలకు వాటా దక్కకుండా చేస్తున్నా రు. దేశంలోని 65 కోట్ల బీసీ కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రగామిగా ఎలా రూపుదిద్దుకుంటుంది? ఇన్నావూ్లైనా..బీసీల అభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖలేదు. బడ్జెట్ కేటాయింపులు లేవు. కనీసం ఐఐటి, ఐఐఎం, కోర్సులు చదివే వారికి స్కాలర్ షిప్‌లు , ఫీజులు రియంబర్స్‌మెంట్ స్కీము లేదు. కేంద్రస్థాయిలో బీసీల అభివృద్ధికి ఎలాంటి పథకాలు లేవు.

చట్ట సభలలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2008లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అలాగే 2010లో శాసనమండలిలో తీర్మానం చేశారు. చట్ట సభలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. కాని బీసీలకు పెట్టలేదు. బీసీలకు పంచాయితీ రాజ్ సంస్థలలో రిజర్వేషన్లు పెట్టా రు. కానీ అసెంబ్లీ, పార్లమెంటులలో రిజర్వేషన్లు లేకపోవడంతో బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే, 18 రాష్ట్రాలనుంచి ఒక్క బీసీ కూడా పార్లమెంటు సభ్యులలో లేరు. 54 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 15 శాతం ప్రాతినిధ్యం లేదు. 2900 బీసీ కులాల్లో 2850 బీసీ కులాలు ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశించలేదు. ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణం.

పేద కులాలకు భాగస్వామ్యంలేని ఈ ప్రజాస్వామ్యం ఏ వర్గాలను ఉద్ధరిస్తుంది? బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంబద్ధమైన హక్కు. రిజర్వేషన్లు లేకపోవడం మానవహక్కుల ఉల్లంఘన అవుతుంది. ఇప్పటికైనా.. బీసీలకు చట్ట సభల లో రిజర్వేషన్లు కల్పించాలి.
ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటరాదని తీర్పు చెప్పింది. దీంతో అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించారు. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రయ త్నం చేసింది. బీసీలు ప్రతిఘటించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. గతంలో 73-74వ రాజ్యాంగ సవరణ సందర్భంగా కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల స్పష్టమై న వైఖరి తీసుకోలేదు. ఇప్పటికైనా.. జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలి.

2008లో కేంద్రవూపభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు ఈ బిల్లునుంచి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తొలంగించారు. ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో బీసీలను రిజర్వేషన్ల చట్టం నుంచి తొలగించడానికి సహేతుకమైన కారణం లేదు. కేంద్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరిలలో కలిసి 5.3 శాతం మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి. 2010 లో కేంద్ర ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం కేంద్రంలో 32 లక్షల ఉద్యోగాలలో బీసీలు కేవలం లక్షా 62 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. నాచియప్పన్ కమిటీ కూడా బీసీలకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.

రాజ్యాంగంలోని 340 ఆర్టికల్, రాజ్యాంగంలోని 16(4)ఎ ప్రకారం జనాభా ప్రాకారం ప్రాతినిధ్యం, ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ 64 సంవత్సరాల స్వాతం త్య్ర భారతావనిలో రాజ్యాంగ స్ఫూర్తిని బీసీలకు అమలు చేయడం లేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించినప్పుడే తగు న్యాయం జరుగుతుంది. కేంద్రస్థాయిలో అనేక సామాజిక వర్గాలకు, మహిళలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నాయి. అలాగే.. క్రీడలకు, సాంస్కృతిక కార్యక్షికమాలకు ప్రత్యేక శాఖలున్నాయి కానీ.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. జనాభాలో 50 శాతంగాఉన్న జనాభాకు మంత్రిత్వ శాఖ లేకపోవడం దారుణం. ఈ పరిస్థితుల్లో బీసీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలా గే.. కేంద్ర ప్రభుత్వం 1994లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

కానీ దానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు, హోదా కల్పించలేదు. కేంద్ర స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా జాతీయ కమిషన్లకు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు. కానీ.. బీసీ కమిషన్‌కు మాత్రం ఆ హోదా కల్పించకుండా వివక్ష పాటిస్తున్నారు. దీంతో బీసీ కమిషన్ కేవలం రబ్బర్ స్టాంపులా తయారైంది. కాబట్టి బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా, అధికారాలు కల్పించాలి. అలాగే.. బీసీ విద్యార్థులకు కేంద్ర స్థాయిలో అన్ని విద్యా సంస్థలలో, ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత స్థాయి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్పులు మంజూరు చేయాలి. పేద కులాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విధించిన ఫీజులను కట్టలేక ఎందరో చదువులను మధ్యలోనే ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నా యి.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులందరికీ.. ఫీజు రీయెంబర్స్ మెంట్ ఇవ్వాలి. అలాగే.. బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకొని, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. ప్రజాస్వామ్యం శాంతియుతంగా సాగాలం అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వారి వాటా వారికివ్వాలి. ఇది ప్రజాస్వామ్య డిమాండ్. సమన్యాయం పాటించపోతే.. పీడిత కులాలు ఎదురు తిరుగుతున్న ప్రపంచ చరివూతను చూస్తున్నాము. బీసీలకు న్యాయం జరుగకపోతే.. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
-ఆర్ కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు

No comments:

Post a Comment