Thursday, September 29, 2011

నిర్బంధపు జాడల్లో..By -జూలూరి గౌరీశంకర్ Namasethe Telangana 30/09/2011


9/29/2011 11:29:32 PM
నిర్బంధపు జాడల్లో..
రాజ్యం రాజ్యాంగబద్ధంగా ఉన్నట్టు అందంగా కనిపిస్తుంది. కానీ ప్రజా ఉద్యమాలు ఎక్కడ ఎగిసినా రాజ్యం వికృతంగా మారుతోంది. ప్రజా ఉద్యమాలను తన ఉక్కు పాదాలతో నలిపేయాలని భావిస్తోంది. అయితే తన దమననీతి చివరికి ప్రజా పోరాటాలకు ప్రాణం పోసి నిలబెడుతుందన్న చరివూతను గుర్తించదు. ఇలా ప్రపంచ చరివూతలో అనేక మంది రాజ్యాధినేతలు నిరంకుశంగా వ్యవహరించి ప్రజాపోరాటాల విజయానికి కారణభూతులయ్యారు. నిత్య నిర్బంధ చిత్రహింసల ఆర్తనాదా ల నుంచే ఉద్యమం జనిస్తుంది. ఈ సత్యం ఆయుధ పహారాల మధ్య, నిర్బంధాల నీడలో తల్లడిల్లిన తెలంగాణకు బాగా తెలుసు. భూమి, భుక్తి, విముక్తి కోసం తమ నెత్తురును చిందించడం లాంటివి ఈ తెలంగాణ నేలలో ఎక్కడ తవ్వినా సింగరేణి బొగ్గులా బయల్పడుతూనే ఉంటాయి. నా తెలంగాణ త్యాగాల వీణ. అదే ప్రపంచంలో తెలంగాణకు ఉన్నత స్థానాన్ని కల్పించింది. త్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం బతికింది. కానీ స్వార్థం, కుళ్లు రాజకీయాలను, కుతంవూతాలను తెలంగాణ ఏనాడు దరికి రానివ్వలేదు.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమం అంత బలం గా లేదని, విద్యార్థులు గొంతు పెకిలిస్తే లాఠీలతో, తూటాలతో అణచివేస్తే మళ్లీ గొంతు మెదపరని స్టీఫెన్ రవీంద్ర ఊహించారు. ఆయన నేతృత్వంలో 2009లో విచ్ఛలవిడిగా లాఠీచార్జీ, కాల్పులు, బాష్పవాయువు ప్రయోగించారు. కానీ రాజ్యం, పోలీసులు తలచింది ఒకటైతే, అందుకు భిన్నంగా జరిగింది. దీంతో పోలీసులు, రాజ్యమే కాదు అన్ని రాజకీయ పార్టీలు తలకిందులయ్యాయి. పదేళ్లుగా రాజకీయ భావజాల ప్రచారం ఎంత చేసినా దానికన్న బలంగా.. ఈ సంఘటన తెలంగాణ మనోఫలకంపై పడింది. ఉద్యమం గడప గడప దాకాపోయింది. రాజ్య నిర్బంధం ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కించడమే కాదు మరింత బలపడేటట్టు చేసింది. దీన్ని పోలీసులు, రాజ్యం గమనించి ఇలాంటి వికృత ఎత్తుగడలు వేయకుండా ఉంటే మంచిదని దాన్ని గుణపా తీసుకోవాలి. కానీ దానికి భిన్నంగా మళ్లీ అదే పనిచేస్తే దాన్ని ఏమనాలి? ఏ ఫలితాన్ని ఆశించి ఈ దాడులు చేస్తున్నారని? మొత్తం తెలంగాణ సమాజం వేస్తున్న ప్రశ్న.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాఠీచార్జీ, కాల్పులు, బాష్పవాయువుల సంఘటనలతరువాత ఉద్యమ జ్వాలలు ఎగిశాయి. దాని తర్వాత మూడేళ్లకు మళ్లీ అలాంటి భయంకరమైన వికృత దాడులు వరంగల్‌లో చోటుచేసుకున్నాయి. ఒక విద్యార్థిని విచక్షణా రహితంగా కొట్టడమే కాదు, ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్లింది. దాంతో వరంగల్ మరొకసారి పోరుగల్లుగా మారింది. తెలంగాణ ఉద్యమానికి టీఎన్జీవోలు ప్రాణవాయువు లాంటివాళ్లు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులు చేసిన పోరాటం, చివరకు ‘ఫ్రీజోన్’ విషయంపై కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష, ఆ తర్వా త ఉద్యమం ఎన్ని మలుపులు తీసుకుందో చూశాం. అటు విద్యార్థులు, ఇటు ఉద్యోగులు, ఆమరణదీక్షలు.. మొత్తం మీద డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. టీఎన్జీవో నేతలు స్వామిగౌడ్, దేవీవూపసాద్‌లు ఉద్యమ మార్గంలో వాళ్లెంచుకున్న దారిలో ఏనాడు వెనకడుగు వేయలేదు. ఆ సంఘం నిర్ణయం మేరకు స్వామిగౌడ్ సారథ్యంలో ముందుకుసాగారు.


ఆర్టీఏ కార్యాలయం దగ్గర స్వామిగౌడ్‌పై మఫ్టీలో ఉన్న పోలీసుల దాడులు, మళ్లీ అక్కడ స్టీఫెన్ రవీంద్ర, హరీశ్‌లకు మధ్య ఘర్షణలు, ఓ దళిత ఎమ్మెల్యేను కిందపడేసి తొక్కడం లాంటి ఘటనలతో తెలంగాణ ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. స్వామిగౌడ్‌పై దాడి చేయడంతో ఉద్యోగులంతా భగ్గుమన్నారు. మళ్లీ ఉస్మానియా చరిత్ర పునరావృతమైంది. ఈసారి గ్రౌండ్ మారింది, అది ఆర్టీఏ కార్యాలయమైంది. ఆ సీను మొత్తానికి డైరెక్షన్ మళ్లీ స్టీఫెన్ రవీంద్రే కావడం విశేషం. ఈసారి అక్కడ విద్యార్థులు లేరు. సాక్షాత్తు ప్రజావూపతినిధులు, టీఎన్జీవోలు, రాజకీయ పార్టీల జాతీయ నాయకులున్నారు. ఎమ్మెల్యేలను ఈడ్చుకపోవడం, స్వామి గౌడ్‌ను ఎక్కడపడితే అక్కడ కనిపించకుండా గాయపరచారు. ఈసంఘటనలతో తెలంగాణ మళ్లీ భగ్గుమనే స్థితికి వచ్చింది. రాస్తారోకోలు, ధర్నా లు, బందులు, హర్తాళ్లతో దద్దరిల్లింది. స్టీఫెన్ రవీంద్ర వచ్చినప్పుడల్లా భయంకరమైన లాఠీచార్జీలు జరుగుతున్నాయి. అయితే ఉస్మానియా, ఆర్టీఏ ఈ రెండు సంఘటనల్లో తెలంగాణ ఉద్యమమే నైతికంగా విజ యం సాధించింది.


స్వామిగౌడ్ ఏదో టీఎన్జీవో సంఘానికి అధ్యక్షుడైన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నరాలకెక్కించుకున్నవారు కాదు. తను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే నాటి జై తెలంగాణ ఉద్యమంలోకి దూకి పోలీసు కాల్పులకు గురైనవారు. తన ఎడమ చేతికి తగిలిన తూటా దెబ్బసాక్షిగా తెలంగాణ కోసం పరితపించే స్వామిగౌడ్ అసలు సిసలు తెలంగాణవాది. స్వామిగౌడ్‌ను కొట్టడం వల్ల తెలంగాణ ఉద్య మం వేడెక్కింది. పోలీసులు విచ్ఛలవిడిగా నిర్బంధాన్ని ప్రయోగించిన ప్రతిసారి చరిత్ర ఒక మలుపు తీసుకుంటోంది.
-జూలూరి గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యద

No comments:

Post a Comment